Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com
ysr లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ysr లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, మే 03, 2013

పవర్ యాత్ర




ఈ మధ్య ఎక్కడ చూసినా యాత్రలు..పాద యాత్రలు..పవర్ యాత్రలే కనిపిస్తునాయ్ వినిపిస్తున్నాయ్.

అప్పట్లో పదండి దండి మార్చ్ కి అంటూ ఉప్పు సత్యాగ్రహం కోసం గాంధీ గారు పాదయాత్ర చేసారట

తరువాత అద్వానీ గారు రామ రధం మీద గల్లీ గల్లీ తిరిగి తిరిగి ఢిల్లీ చేరారు

ఆ మధ్య వై ఎస్ ఆర్ గారు పాదయాత్ర చేసి చేసి చివరకి సీ ఎం కుర్చీలో రెస్ట్ తీసుకున్నారు. రెండు సార్లు ముఖ్య మంత్రి అయ్యారు. ఆయన మరణించాక వాళ్ళబ్బాయీ..ఆయన జైలుకెళ్ళాక వాళ్ళ చెల్లాయి ఓదార్పు యాత్ర పేరుతో పాద యాత్రలు..బస్సు యాత్రలు చేసారు చేస్తున్నారు..

నిన్నటి దాకా మన చంద్ర బాబు గారు కూడా గుర్తు సైకిల్ ఐనా పాపం రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి ప్రస్తుతం ఎలక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇవి పాదయాత్రలా పవర్ యాత్రలా అంటే పవర్ కోసం యాత్రలా ?


వీళ్ళంతా పదవి లేనప్పుడు పదవి కోసం తిరగడమే తప్ప..పదవి లో ఉన్నప్పుడు ఎందుకు తిరగరో.. టైముండదనుకుంటా...అప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లెంసు, ఇంకా అవీ ఇవీ అడ్డొస్తాయి కాబోలు!

అందరూ పల్లె పల్లె తిరిగేసి..గుడిసె గుడిసే చూసేసి..బుగ్గలు నిమిరేసి..భోజనాలు చేసేసి..కష్టాలు వినేసి.. స్పీచులు ఇచ్చేసి.. వాగ్దానాలు చేసేసి.. సరాసరి పీఠం ఎక్కేసి.. ఐదేళ్ళు రెస్ట్ తీసుకుంటారు... జనం మాత్రం ఈ ఐదేళ్ళు గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ, పంచాయితీల చుట్టూ.. ఆఫీసర్ల చుట్టూ,,రేషన్ కొట్ల చుట్టూ, సంక్షేమ పధకాల చుట్టూ చేతిలో పాత్రతో పాద యాత్ర మొదలు..


కమాన్ కామన్ మాన్ గెట్ రెడీ ఫర్ పాద యాత్ర!










నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

శుక్రవారం, ఆగస్టు 05, 2011

సినీ ఓదార్పు యాత్ర

సినీ ఓదార్పు యాత్ర


ఇదీ ఓ రకం రాజకీయ ఓదార్పు లాటిదే. కాకపోతే ఇక్కడ సినిమా(ఆడక)పోతే, మా సినిమా ఎక్కడికీ పోలేదూ, అభిమానుల గుండెల్లో ఉందీ, జనాలు రాని ధియేటర్లలో ఉంది..ఎలాగైనా రికార్డులు సృషిటిస్తాం సృష్టిసుతున్నాం అంటూ ఓదార్పు సారీ విజయ యాత్రలు సాగిస్తారు(తున్నారు) మన సినీ జనాలు.

రాజకీయాల్లో లాగానే సినిమాల్లోనూ వారసత్వాలే పౌరసత్వాలుగా...అందిపుచ్చేసుకుని..తాత..తండ్రి తరువాత దిగిపోతున్నారు హీరోలు. వాళ్ళకి నటన అలవాటు కాకపోయినా మనం వాళ్ళ నటనకు (ఇది ఫలాన హీరో స్టయిల్) అలవాటుపడీపోతున్నాం ".

హీరో అంటే అన్నిరకాల అవలక్షణాలూ ఉండాలి..ఎంత ఎదవైతే అంత మాసు ... మరి శంకరాభరణం అన్ని క్లాసుల్లోనూ ఆడింది.. ఏదో ఒక ఫార్ములా హిట్టైతే ఇక అదే ఫార్మూలాలు పెట్టేసి సినిమా తీసేసి జనాలమీద తోసేసి ఆడలేక మద్దెల ఓడన్నట్టు..పైరసీనో ఇంకేదోనో అని జనాలమీద పడటం. సినిమా హీరోలో రేట్లు పెంచేయడం..నిర్మాణం కాస్టు పెంచేయడం..తమిళనాడు నించీ డైరెక్టరు, కేరళ నుంచీ స్టోరీ, బాంబేనుంచీ హీరోయిను., విలన్ లని తెచ్చి ... ఏదో ఒకటి తీసేసి..పోనీ అదీ ఏమైనా త్వరగా వస్తుందా అంటే 2 యేళ్ళు, 3 యేళ్ళు...మరి ఖర్చుపెరగక చస్తుందా...ఎలాగూ అభిమానులు మొదటి వారం ఎగబడి చూస్తారు కాబట్టి టికెట్లు రేట్లు పెంచేసి..అటు టిక్కెట్ల కుమ్ములాటలో కాకపోయినా సినిమా చూశాక చొక్కాలు చించేసుకుని.. జుట్లు పీకేసుకుని బయటకు పరుగెత్తుకొచ్చేసి..మళ్ళీ పిచ్చి అభిమానంతో రెండో సారో ...మూడో సారో ఐనా అర్ధమౌతందునుకుని మళ్ళీ మళ్ళీ చూసే  అమాయకులుంటారు కాబట్టి .....తీసేయడం....ఇక అది ఆడదని ఒకటో ఆటకే తెలిసిపోతుంది కాబట్టి ఆరోజు మధ్యాన్నం నుంచే న్యూసు చానెల్సు..ఎంటర్ టైన్ మెంట్ చానెల్స్ అని తేడాలేకుండా గంటకో ఇంటర్వ్యూ...రోజుకో చర్చ...వారోనికో కాంటెస్టూ రన్ చేసి..ఇవీ చాలదన్నట్టు యూనిట్ మొత్తం పొలో మని బస్సు యాత్రలు..ధియేటర్లకి..కనీసం వాళ్లని చూడడానికైనా వస్తారని.

ఇక రోజూ గోడల మీద చూస్తే.. ఎవరో పోయినోళ్ళ పేపర్ అడ్వర్టైజ్ మెంటులాగా ఒకటో "రోజు  " పదో 'రోజు " 13వ 'రోజు " అంటూ పోస్టర్లు.. వాటికి బొట్లు దండలూ బోనస్.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ..సినిమా పోయాక జనాలని పట్టుకునే ప్రయత్నం కన్నా..హీరోలని గాల్లోంచి భూమి దింపిన కధలు..జనాల కు దగ్గరగ ఉండే సినిమాలైతే  చూస్తారేమో




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

మంగళవారం, డిసెంబర్ 22, 2009

నాల్కల్ కోస్తాం, ముక్కుల్ నేలకి రాస్తాం - హైడ్రామాబాద్

 నాల్కల్ కోస్తాం, ముక్కుల్ నేలకి రాస్తాం - హైడ్రామాబాద్ 

ఆహా ఈ రాజకీయ పరిభాష చూస్తుంటే, వింటుంటే అనాలేమో కానీ టీవీల్లో చూపిస్తున్నారు కదా. ఫరవాలేదు. ఎంత బాగుందో. అసలు వీళ్లు కొట్టుకునేదెందుకో అర్ధం కావట్లేదు. తెలంగాణా కోసం దీక్ష చేసిన కేసీ ఆర్ , ఒక పక్క ఒక్కడే చేసినా రాష్ట్రం మొత్త ఏకం చేసారు. మరి సమైక్యాంధ్ర కోసం చేసే దీక్ష తలొకళ్ళు తలా ఒక చోట ఎందుకు చేస్తున్నట్టు ? ప్రస్తుతానికి హైదరాబాదే కదా రాజధాని. ప్రతీ ఒక్కరూ హైదరాబాద్ కోరుకుంటున్నారే తప్ప. అసలు విషయం అర్ధం కావట్లేదు. ఎక్కడో పుట్టిన వాడు ఏ డిల్లీకో, బాంబేకో, చెన్నై కో వెళ్ళి బతకట్లేదా? ఎక్కడ పని దొరుకుతుందో, సుఖం గా ఉంటుందో, అన్ని సదుపాయాలూ ఉంటాయో అక్కడ బతకాలనుకుంటాడు ప్రతీ మనిషి. బతకడం మొదలెట్టాక శాశ్వత నివాసం కోసం చూస్తాడు , తరువాత ఆస్తులు కూడబెడతాడు. కాలవ గట్టున ఉన్నవాళ్ళని ఖాళీ చేయించినట్టు..ఉన్న పళాన వెళ్ళి పో అంటే ఎక్కడికెళతాడు. ఇక్కడే ఉండనిస్తే రాష్ట్రం వస్తే ఆ రాష్ట్ర వాసి గా ఉంటాడు..లేదా పాత జీవితం కొనసాగిస్తాడు. ప్రభుత్వం తో పోరాడండి. సరైన నిర్ణయం తీసుకోండి..ప్రజలకి మంచి చెయ్యండి. అంతే కానీ మీలో మీరు కొట్టుకుని..ప్రజలను కంఫ్యూజ్ చేసి ..ఏమి జరుగుతున్నదో..అర్ధం కాకుండా..ఎవరో బ్రిటీషు వాళ్లతోనో.పాకిస్తాను వాళ్ళతోనో పోరాడినట్టు మన వాళ్ల మీద మనమే పోరాడడం ఎంత వరకూ సమంజసమో ఆలోచించండి. హోటళ్ళు మూసేసి, పేర్లు మార్చేసి, సినిమాలు ఆపేసి, బస్సులు పగల కొట్టి, ఆత్మాహుతులు చేసుకునీ కాదు..ఎందుకు చేస్తున్నాం, ఏమి సాధిస్తాం, అన్నది ప్రజలకి తెలిసేలా చెప్పండి. టీ వీల్లో చర్చల్లో..మోహన్ బాబు ఇలా అన్నాడు...కే సీ ఆర్ అలా అన్నాడు అని ఒక వ్యక్తి ప్రకటనలు, భావావేశం లో అన్న మాటలూ, గురించి టైం వేస్టు చేసుకుని, వాళ్ళ రేటింగులు పెంచి, వార్తలకో - ప్రకటనలకో సమయం అవగానే అర్ధాంతరంగా ఆగిపోయే చర్చలతో ఎందుకు కొట్టుకుంటారో అర్ధం కావట్లేదు.. విధ్వన్సానికి భయపడో..ఆస్తులు నష్టం అవుతాయనో మూసేస్తున్నారా..లేక నిజంగానే స్వచ్చందం గా మూస్తున్నారా మీరు చేసే బందులకి, ఇంట్లోంచి బయటకు రావాలంటే భయమేస్తోంది.ప్రతీ ఒక్కరికీ, NIMS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్ గా మారుతోంది. హైదరాబాద్ హైడ్రామాబాద్ గా మారుతోంది. సోనియా ఏమంటుందో తేలేదాకా ఇదే పరిస్థితి. ఏమనాలో..ఏమనుకోవాలో..ఏం జరుగనుందో ...అంతా సోనియా దయ.



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మంగళవారం, డిసెంబర్ 15, 2009

జై ఆంధ్రా - జై తెలంగాణా

 జై ఆంధ్రా - జై తెలంగాణా  

బయట జరుగుతున్న వాటిమీద నాకు పెద్దగా అవగాహన లేదు. అక్కడి ప్రజలు పడిన, పడుతున్న బాధలూ తెలీదు. టీ వీ చానెళ్ళలో చూపించేవి చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో...ఎవరిది కరెక్టో ఎవరిది కాదో కూడా అర్ధం కావట్లేదు. నా బాధ ఒకటే..నిన్నటిదాకా పక్క పక్కనే ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఎందుకు విడిపోతున్నారు. రాష్ట్రాలుగా కాదు..మనుష్యులుగా.

ఆంధ్ర మెస్ అని ఉంటే చెరిపేసి తెలంగాణా మెస్ అని రాస్తున్నారు..భోజనం మారుతుందా. రుచి మారిపోతుందా. ఆంధ్ర మహిళా సభ అని ఉంటే తెలంగాణా మహిళా సభ అని మారుస్తున్నారు. దేశం కోసం కష్టపడ్డ స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గా బాఇ దేశ్ ముఖ్ ఆత్మ ఘోషించదా. ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్నప్పుడు ఆవిడ పెట్టిన ఓ సేవా సంస్థ అది. ఇప్పుడు విడిపోతే ఆమె పెట్టుకున్న పేరు మార్చెయ్యాలా. ఆంధ్ర అంటే తెలంగాణా కానిదా. తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ లో లేదా.. ఆంధ్ర బ్యాంక్ కూ కొన్ని చోట్ల పేరు మార్చారు. భోగ రాజు పట్టాభి రామయ్య ఎప్పుడో మొదలెట్టిన ఆ అద్భుతాన్ని అవమానపరచాలా. మనం తలెత్తుకు ఎగురేసే జాతీయ జెండా తెలుగు వాడైన పింగళి వెంకయ్య తయారు చేసారు. మరి రేపు అదీ వద్దా..మనం వేరే జెండా తయారు చేసుకుందామా? మన ఎజెండాలో అదీ ఉందా?

ప్రాంతం కోసం జరిగే ఈ సమరం లో కొంచెం సమ్యమనం పాటించి..ఆవేశం తగ్గించి..మనకో పక్క వాళ్ళకో ప్రాణ నష్టం మరే నష్టం కలగ కుండా చూసుకొంటే మంచిది. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన స్టూడెంట్లు అందించే ఆ ఫలం అందుకుని ఆ కుటుంబ సభ్యులు ఆనందించ గలరా..వాళ్ళూ స్వతంత్ర్య పోరాట యోధులు గా మిగిలుతారా? లేక ఈ రాజకీయ నాయకుల పనుల్లో సమిధలుగా మిగులుతారా?

ప్రజల ముందు ఒక మాట..వెనకాల ఒక మాట చెప్పి పబ్బం గడుపుకునే రాజకీయనాయకులని నమ్మి అమాయకులైన కుటుంబ సభ్యుల జీవితాలను పణంగా పెట్టి ప్రాణ త్యాగాలు చెయ్యకండి మిత్రులారా..మీదైనా..పక్కవాడిదైనా ప్రాణం విలువ సమానమే..గాంధీ మార్గంలో సాధించండి..విజయీ భవ.





నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

ఆదివారం, నవంబర్ 15, 2009

పేరంటం



ఆదివారం కదా అని హాయిగా లేటుగా నిద్ర లేచి...వాకిట్లో కూచుని పేపర్ తిరగేస్తున్నా.ఈలోగా..పట్టుచీరలు కట్టుకుని కొంతమంది ఆడవాళ్ళు పొలో మంటూ పది మంది వచ్చారు. మా ఆవిడ స్నేహితులేమో అనుకుని..లోపలకొచ్చి మా ఆవిణ్ణి పిలిచా. ఆ వచ్చిన వాళ్ళు, మా ఆవిడకి బొట్టుపెట్టి, రవికల గుడ్డ పెట్టి ఇంకేదో చెబుతున్నారు. మా ఆవిడ నన్ను పిలిచింది. ఏంటో అనుకుని నేను బయటకెళ్ళా. వాళ్ళలో ఒకరు..అన్నయ్య గారూ..మీరూ తప్పకుండా రావాలి. వొదిన్ని..బాబాఇగారిని తీసుకురావాలి. మర్చిపోవద్దు. అంటూ పొలోమని వెళ్ళి పోయారు...ఏదో గాలి దుమారం లా. నాకేమీ అర్ధం కాలేదు. ఆడవాళ్ళ ఫంక్షన్ కి నేనేమిటీ అని అడిగా మా ఆవిణ్ణి.కిసుక్కున నవ్వింది మా ఆవిడ.


ఆ వచ్చింది పేరంటానికి పిలవడానికి కాదండీ, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో ఓటెయ్యడానికి అని అసలు రహస్యం చెప్పింది. ఔరా అనుకున్నా. ఇంతలో దూరంగా మరో బాచ్ వస్తుంటే .. భయపడి బాత్రూం లో చేరా...


బయటకొచ్చాక మా ఆవిడిచ్చిన కాఫీ తాగుతూ..ఆవిడిచ్చిన (అదే పిలుపులకొచ్చిన ఆవిడ) ఫాంప్లేట్ చూశా. ఒక పక్క వాళ్ళాయన ఫొటో ..మరో పక్క ఆవిడ ఫొటో ఉన్నాయి. ఆయన మా కాలనీ చుట్టుపక్కల ఓమాదిరి పేరున్న లీడరే..ఏమైనా గొడవలూ గట్రా ఐతే  ఆయన తప్పకుండా అక్కడుంటాడు..ఐతే గోడవ తీర్చడానికి లేకపోతే గొడవపడుతూనో ఉంటాడు..ఈ మధ్యే ఒక ఆటో డ్రైవర్ ని ఐదు రూపాయలు ఎక్కువడిగినందుకు పళ్ళూడగొట్టి.అవినీతి పై తన ప్రతాపం చూపించిన మహా లీడర్ ఆయన. ఆయనకి మా కాలనీలో ఒకటి బయటింకెక్కడో మూణ్నాలుగు వైన్ షాపులున్నాయి. మున్సిపాలిటీలో కొన్ని కాంట్రాక్టులు కూడా ఉన్నాయి. మరి ఏకంగా ఆయనే నుంచోకుండా..వాళ్ళావిణ్ణి ఎందుకు నుంచో పెట్టాడా అనుకున్నా. ఈ నియోజకవర్గం లో స్త్రీల రిజర్వేషన్ ట .. గెలిచేది ఆవిడే అయినా పాలన వారిదేనట..ఇంకొన్ని కాంట్రాక్టులు ఈజీ గా రావడానికి వీలుగా మనమె మెంబరైపోతే ఇంకా హాయి గదా అని.ఇలా.....


సరే ఆ విషయం వదిలేస్తే ఓటెవరికి వెయ్యాలో అర్ధం కావట్లేదు. మొన్నటిదాకా కలిసున్న తెలుగు దేశం. టీ ఆర్ ఎస్ విడిపోయారో కలిసే ఉన్న్నారో అర్ధం కావట్లేదు. చిరంజీవి తప్ప మరెవరు ఆ పార్టీయో అర్ధం కాని ప్రజా రాజ్యం...లోక్ సత్త జయ ప్రకాష్ దీ అదే పరిస్థితి...ఇక వై ఎస్ లేని కాంగ్రెస్. ఎవరు ఎవరితో కలిసున్నారో..కలిసి లేరో..ఏది మిత్ర పక్షమో..ఏది ప్రతిపక్షమో..అసలు తెలీట్లేదు.


పాత బట్టలకి స్టీల్ సామానిస్తాం, సత్తుబిందెలకి మాట్లేస్తాం.,అంటూ అరుస్తూ తిరిగే వాళ్ళలా ఎలక్షనప్పుడు మీ రోడ్లు బాగుచేస్తాం..మంచినీళ్ళిప్పిస్తాం, ప్రాబ్లెంస్ తీరుస్తాం, అంటూ వీధి వీధి..ఇల్లు ఇల్లు తిరిగి చాటింపు వేసే వీళ్ళు గెలిచాక ఎక్కడుంటారో..ఏం చేస్తారో తెలీదు. పెద్ద వాళ్లంతా ఎసెంబ్లీలో కొట్టుకుంటుంటే..వీళ్లంతా ఇక్కడేమో..ఏంటో ఈ ఎలక్షన్ లేమిటో.ఈ గొడవలేమిటో.


ఫ్లై ఓవర్ లు కూలితే తప్పు అవతల వాళ్లది.బాగుంటే ఘనత మనది..మినిస్టర్లు..సినిమా వాళ్ళు తిరిగే రోడ్లు అద్దాల్లా ఉంటాయి..,,మిగతావి అధ్వాన్నం గా ఉంటాఇ.. మళ్లీ విదేశాల్లో సర్వేలు.నివేదికలు..బడ్జెట్లు...గొడవలు..ఓకే అయ్యే నాటికి మళ్ళీ ఎలక్షన్ లు..షరా మామూలే..ఓకే మీరెళ్ళే సరికి మీ ఓటుంటే వేసి రండి...






నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

గురువారం, నవంబర్ 05, 2009

మాయాజాలం

మాయాజాలం
తిరుపతి లో ఆంధ్ర మెజీషియన్ లు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఇంద్రజాల సభలు జరుగుతున్నాయి. ఆశ్చర్యమేమిటంటే ఇక్కడ ఇంకా పెద్ద స్థాయిలో ఇంద్రజాలం జరుగుతోంది. పీ సీ సర్కార్ సీనియర్ తరువాత ఆయన పరంపరని కొనసాగించాడు జూనియర్ పీ సీ సర్కార్...కానీ.ఇక్కడ సీనియర్ వై ఎస్ 'సర్కార్ ' తరువాత జూనియర్ వై ఎస్ కి అలా జరగలేదు. రాజకీయమనే ఇల్ల్యూజన్ లు ఇంకా వంటబట్టించుకోకపోవడమే దీనికి కారణమనుకుంటా...రక రకాల బిజినెస్సుల్లో బిజీ గా మెస్సై పోవడం వల్ల...కాబోలు.


సీనియర్ సర్కార్ రాష్ట్రమంతటా పర్యటించి...తన ఇందిరాజలం తో జనాల్ని సమ్మోహితుల్ని చేసి ఎసెంబ్లీ హౌసు ఫుల్లు కాక పోయినా కలెక్షన్ కి సీ ఎం సెలెక్షన్ కీ కావాల్సినంత చేసుకోగలిగాడు..ఐతే..పావురాల గుట్ట ????... మెజీషియన్ లు ఎక్కువగా పావురాలతోనే మేజిక్ చేస్తారు. అక్కడ అనుకోంది దుర్ఘటన తో..అందరికీ దూరమైనాడు. కానీ ఆయన కొనసాగింపు..వారసుడికి రాలేదు. సాధారణంగా వారసత్వాన్నే పౌరసత్వంగా భావించే కాంగ్రెస్ ఈ సారి ఎందుకనో? అలా జరక్కుండా..పీఠం జారకుండా జాగ్రత్త పడ్డారు.
బడ్జెట్ మంత్రిగారు..అదే ఆర్ధిక మంత్రిగారు..ఎలాగూ జిమ్మిక్కులు..అప్పులు-ఆస్తుల మేజిక్కులు..ప్రతిపక్షం వారిని నోరుమూయించగల లాజిక్కులు చాలా తెలుసు కాబట్టి..నెమ్మదిగా.ముఖ్య.మంత్ర దండం అందుకుని తిప్పుతున్నారు.


ఎలాగూ టోపీల్లోంచి వచ్చేవి 'కుందేళ్ళే " గనక ఖంగారు లేకుండా...నడిపించేస్తున్నారు రోశయ్య గారు. ఇండియన్ రోప్ ట్రిక్కు లాగా అందరినీ ఒక్క తాటి మీద నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కొరకరాని కొండ లుంటే,,డబ్బా లో పెట్టి మాయం చెయ్యగల సమర్ధులు. వారు.


ఢిల్లీలో చూద్దామా అంటే ...సీనియర్ వై ఎస్ సర్కార్ కి మేనేజర్ ఐన కె వీ పీ గారికి ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి..మేనేజ్మెంట్ లేకుండానే షో నడుస్తోంది..సోనియా చూస్తే ఫ్యూచర్ ప్రోగ్రాం గురించి చెప్పటం లేదు. గట్టిగా అడిగితే మేనేజర్గిరీ కే ప్రమాదమేమో కూడా.


మొత్తానికి..ప్రస్తూం ఆంధ్ర గవర్నమెంటు 'జంతర్ మంతర్ ' తిరుపతిలో జరగనున్న జాతీయ ఇంద్రజాలికుల సదస్సుకి శుభాభినందనలు శుభాకాంక్షలతో ..


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శుక్రవారం, అక్టోబర్ 30, 2009

రాజీ నామా

 రాజీ నామా
ఏమిటి సీ బ్లాకు దగ్గర హడావిడి..కెమేరాలు..పాత్రికేయులు..న్యూసెన్స్ చానెళ్ళు అంతా విడి విడి గా..కలివిడి గా హడావిడి..మాట్లాడేసుకుంటున్నారు. మళ్ళీ ఏ బిల్డింగైనా కాలిపోయిందా..కూలిపోయిందా అని డౌటొచ్చేసింది..కాదు కొండ గురించిన మాటలు జరుగుతున్నాయక్కడ.

ఇది మార్పుల వేళయనీ..జగనన్న మాసమనీ తొందరపడి ఒక కోయిలా డిజైను చూసింది...రెజైను చేసింది...వెనకాల బాక్ గ్రౌండులో పాట వినిపిస్తోంది.

కానీ,,ముఖ్య మంత్రి గారు మాత్రం...

లేదు..కాదు..తెలీదు..ఇదేలే గవర్నమెంటాఫీసులో రెడీమేడ్ సమాధానం
ఏ ఫైలు ఎక్కడుందో చెప్పడం ఒక పెద్ద అవధానం
సంతకానికీ పంపకానికీ మధ్య ఒఖ్ఖ ఏడాదే వ్యవధానం
వాళ్ళు నిత్యం పాటించే సూక్తి "నిదానమే ప్రధానం "

ఇది మన రోశయ్య గారికి బాగా వొంట పట్టినట్టుంది. ఇనుమైనా వేడిమీద ఉన్నప్పుడు కొడితే పనౌతుంది..చల్లారాక వంచడం కష్టం అని తెలుసు కాబట్టి...నెమ్మదిగా..వేడి తగ్గేదాకా ఆగారు...ఇప్పుడు సోనియా ఆశీస్సులతో నెట్టుకొచ్చేస్తున్నారు.

రాజీనామాల పేరుతో ఎదిరించిన వారూ బెదిరించిన వారూ..కూడా ప్రస్తుతం రాజీ మార్గం పట్టి..సోనియా ఏం చెప్తే అదే అంటున్నారు..కొండకు దారమేస్తే..కొండా సురేఖ రాజీనామా దాకా వచ్చింది..కదా మరి
వై ఎస్ మరణం తరువాత వేడెక్కిన రాజకీయాల మీద వరద పోటు రావడం వల్ల చల్లారిపోయి..జగన్ భవిష్యత్తు సీ ఎం గా మిగిలిపోయాడు..ప్రస్తుత....మౌనమే దానికి 'సాక్షి '.

ఏం మంత్రి గారు,,మీరెటు ? ఆ చేతిలోది ఏమిటి...
ఔను రాజీనామా నే కాకపోతే...రాజీ అని నామానాన నేను పని చేసుకు పోతాను అని రాశా..అంతే...
అవతల ముఖ్యమంత్రిగారి మంత్రివర్గ విస్తరణలోగా ఈ కాగితం అందకపోతే..ఇక నేనూ ఇంటికి మార్గం పట్టాల్సిందే..అనుకుంటూ హడావిడిగా ఎవరికి వారు విడి విడి గా విడిది గృహం బయలుదేరారు.
గవర్నరు గారు రెడీ గా ఉన్నారా ప్రమాణ స్వీకారం చేయించడానికి..మళ్ళీ చానెల్స్ కి బోల్డంత..న్యూసు..మనకి న్యూసెన్సు...చూస్తూనే ఉండండి ,,,మాకు తోచింది చూపిస్తాం...



నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మంగళవారం, సెప్టెంబర్ 15, 2009

కెలక్కు

వెన్న ముద్దలు అనే పుస్తకంలో ప్రముఖ రచయిత జనార్ధన మహర్షి అన్నారు..ఇష్టం లేక పోతే ఉలక్కు పలక్కు కానీ కెలక్కు...అని...ప్రస్తుతం కాంగ్రెస్ అధిస్టాన వర్గం అదే చేస్తోంది. ప్రస్తుతం ఆంధ్ర లో రాజకీయ అనిస్చితి చూసి....ఏం చెయ్యాలో తెలీక...ఏదో ఒకటి చేసేయలేక..ఎదురుచూస్తోంది.

సోనియా నే అన్నీ చూసుకుంటారు..సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు అని మిగిలినవాళ్ళు చెబుతున్నా....'ఆ' నిర్ణయం ఏంటో ఇంకా ఆవిడకి కూడా అంతుబట్టటం లేదు. ఇన్నాళ్ళూ అన్ని తానే అయి నడిపించిన రాజసేఖరుడు స్థానాన్ని ఎవరికి ఇవ్వాలో తెలియక తిక మక పడుతున్నారు.

మొన్నేమో జగనే సీ ఎం అన్నవాళ్ళు ఇప్పుడు కొంచెం గేప్ ఇచ్చారు. అటు కే వీ పీ...హైదరాబాదు..డిల్లీ తిరిగి తిరిగి విసిగి ఉన్నారు..ఇన్నాళ్ళూ వెనకుండి నడిపించిన ఆయన ప్రస్తుతం ముందు జరగవలసిన దాని గురించి మల్ల గుల్లాలు పడుతున్నారు.

ఏమిటో ...ప్రస్తుతం రోశయ్య గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా ఉన్నా...అలా ఉండడం ఆయనకూ ఇస్టం ఉండదు...ఐతే మొత్తం అవాలి లేదా ఊరుకోవాలి...





నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శనివారం, సెప్టెంబర్ 05, 2009

' ప్రజా ' శేఖర్ రెడ్డి= ప్రజా సేవకు రెడీ అనే రాజ శేఖర్ రెడ్డి

ప్రజా సేవకు రెడీ అనే రాజ శేఖర్ రెడ్డి ఇక లేరు...ఇది ఇవ్వాళ ఏ పేపరు చూసినా..న్యూస్ చానెల్ పెట్టినా కనిపించిన హెడ్ లైను.కానీ ఆయన మనందరి మనసుల్లో ఉన్నాడు. ఇంత ఏ ముక్యమంత్రి మరణానికీ పక్క రాష్ట్రాలు కూడా శలవు ప్రకటించలేదు..అంటే ఆయనకున్న మంచి పేరు ఎలాంటిదో అందరికీ అర్ధం అవుతుంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రచ్చబండ కి వెళుతూ.తరలి రాని లోకాలకు వెళ్ళిపోయాడు ఆ మహా మనిషి.

ప్రజా సేవకు రెడీ అనే ఆ రాజ శేఖరుడు...కాలిబాటన రాష్ట్రం నలుమూలలా పర్యటించి..రాజధానికి రాజుగా చేరుకున్నాడు. పల్లెలో వెతలు చూసి ఉచిత కరెంటు ఇచ్చాడు, పల్లె బాటలో జనాన్ని చూసి రెండు రూపాయలకు బియ్యం ఇచ్చాడు. డాక్టరు కావడం వల్ల..తన ఆరాధ్యమైన రాజీవ్ పేరిట ఆరోగ్య శ్రీని అందించాడు...ఇందిరమ్మ ఇళ్ళు కట్టించి...కష్టించే వాళ్ళకూ గూడు అందించాడు. కూడు.గూడు..ఆరోగ్యం ....అందించాడు..ప్రాజెక్టులు కట్టి..పూర్తి చేసాడు...తలచిన పని చేసుకు పోవడమే కానీ వెను తిరిగి చూడని ధీశాలి.

ఇంకా ఎన్నో చేయాలనుకున్నా....మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఆ పనులు ఇంక ఎవరు చేస్తారో వేచి చూడాలి. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని ఆశిస్తూ






నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

గురువారం, మే 21, 2009

ఫీల్డు మారిందా..షీల్డు గోవిందా...

ఫీల్డు మారిందా..షీల్డు గోవిందా...
పుడుతూనే తల్లిని పోగుట్టుకుంటాడు, తండ్రి చీ కొడతాడు,,ఐనా బోరింగు పంపు లో నిళ్ళు తాగి పీదవాడవుతాడు మన హీరో..కోటీస్వరుడి కూతురు ఈ హీరోని చూసి మనసు పారేసుకుంటుంది. ఇంక వెంటనే పాట ఫారిన్ లొకేషన్ లో....ఐన వెంటనే ఒక చేసింగు సీను..ఫైటింగూనూ...కట్ చేస్తే..హీరఓయిన్ ని ఎక్కడికో పంపేస్తారు వాళ్ళ కసాయి తండ్రి.
హీరో అడుక్కుతింటూనే ఐ ఏ ఎస్ పాసయి వాళ్ళ వూరికే కలెక్టర్ గా వస్తాడు..తను అడుక్కుతినే వాడిగా అవడానికి కారణమైన వాళ్ళమీద రివెంజి తీర్చుకుంటాడు..
పోలీసు ఆఫీసరైన మన హీరోగారు..చండ ప్రచండమైన విలన్ గాంగుని నామ రూపాల్లేకుండా కాల్చి అవతల పారేస్తాడు..మిగిలిన వాళ్ళు ఆయన కంట్లోని 'అగ్ని ' కి ఆహుతైపోతారు..
మూటలు మోసే ఒక మేస్త్రీ తన స్వయంకౄషితో ఎంచక్కా లేబర్ మినిస్టరైపోయి చాలా మంది బాక్స్ ఆఫీసులు బద్దలుకొట్టేస్తారు..ఒక ఖాను గారు లగాను రద్దు కోసం ఇంగిలీషు వాళ్ళతో యాభై ఓవర్ల మాచులు పాపం అప్పట్లో అరవై ఓవర్లుండేవని మర్చిపోయి మాచు గెలిపిస్తాడు
మరో ఖాను గారేమో ఏకంగా చెక్క బాటులు పట్టుకున్న అమ్మాయిలకి హాకీ నేర్పించి చక్ దే ఇండియా అని స్ఫూర్తి నింపుతాడు..
పెద్దన్నయ్యలని అదే నండీ బిగ్గు బ్రదర్లని చూసి పొడుగుకాళ్ల సుందరి శిల్పా సెట్టి కూడా ఆ జాబితాలోకి చేరింది...
ఏతా వాతా చెప్పొచ్చేదేంటంటే సినిమాల్లో ఏదైనా చెయ్యగల సమర్ధులైన మన హీరోలు ఇతర రంగాల్లో నెగ్గుకు రావడం కొంచెం కష్టమైన పనే అని అర్ధం అవుతోంది.రాజకీయాల్లోకి వచ్చిన స్టార్లు..క్రికెట్టు లో డబ్బు పెట్టిన స్టార్లూ పాపం కాలం కలిసి రాక ఇమేజి డామేజి అయి ..........తీసుకున్న నిర్ణయం ...ఫ్లాపు సినిమా అయి ప్రస్తుతం డౌట్ ఆఫ్ ఇండియా తో ఉన్నారు...మన ఫీల్డు ఏల్దాం బాసు మనకెందుకు పక్కోడి గోల..అవన్నీ చూసి ఆనందించాల్సిందే కానీ చేసి కాదు..డబ్బలు తిరిగొచ్చాక క్లైమాక్సు మారిస్తే ఏం లాభం..
నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

LinkWithin

Related Posts with Thumbnails