Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com
andhra politics లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
andhra politics లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, మార్చి 22, 2019

ఆదివారం, డిసెంబర్ 01, 2013

మూగా స్టార్

కాంగ్రెస్ లోకి వెళ్ళాను కాంప్రమైజ్ అయిపోయాను   
హస్తినాపురం వెళ్ళాను హస్తం గుర్తుకు మారాను

నేను యూటీ చెయ్యమని  మేడం తో చెప్పాను
మూసుకుని మీ డ్యూటీ మీరు చెయ్యమని  మేడం చెప్పారు !
చాలా ఇంకేమన్నా కావాలా ??



నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

శుక్రవారం, మే 03, 2013

పవర్ యాత్ర




ఈ మధ్య ఎక్కడ చూసినా యాత్రలు..పాద యాత్రలు..పవర్ యాత్రలే కనిపిస్తునాయ్ వినిపిస్తున్నాయ్.

అప్పట్లో పదండి దండి మార్చ్ కి అంటూ ఉప్పు సత్యాగ్రహం కోసం గాంధీ గారు పాదయాత్ర చేసారట

తరువాత అద్వానీ గారు రామ రధం మీద గల్లీ గల్లీ తిరిగి తిరిగి ఢిల్లీ చేరారు

ఆ మధ్య వై ఎస్ ఆర్ గారు పాదయాత్ర చేసి చేసి చివరకి సీ ఎం కుర్చీలో రెస్ట్ తీసుకున్నారు. రెండు సార్లు ముఖ్య మంత్రి అయ్యారు. ఆయన మరణించాక వాళ్ళబ్బాయీ..ఆయన జైలుకెళ్ళాక వాళ్ళ చెల్లాయి ఓదార్పు యాత్ర పేరుతో పాద యాత్రలు..బస్సు యాత్రలు చేసారు చేస్తున్నారు..

నిన్నటి దాకా మన చంద్ర బాబు గారు కూడా గుర్తు సైకిల్ ఐనా పాపం రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి ప్రస్తుతం ఎలక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇవి పాదయాత్రలా పవర్ యాత్రలా అంటే పవర్ కోసం యాత్రలా ?


వీళ్ళంతా పదవి లేనప్పుడు పదవి కోసం తిరగడమే తప్ప..పదవి లో ఉన్నప్పుడు ఎందుకు తిరగరో.. టైముండదనుకుంటా...అప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లెంసు, ఇంకా అవీ ఇవీ అడ్డొస్తాయి కాబోలు!

అందరూ పల్లె పల్లె తిరిగేసి..గుడిసె గుడిసే చూసేసి..బుగ్గలు నిమిరేసి..భోజనాలు చేసేసి..కష్టాలు వినేసి.. స్పీచులు ఇచ్చేసి.. వాగ్దానాలు చేసేసి.. సరాసరి పీఠం ఎక్కేసి.. ఐదేళ్ళు రెస్ట్ తీసుకుంటారు... జనం మాత్రం ఈ ఐదేళ్ళు గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ, పంచాయితీల చుట్టూ.. ఆఫీసర్ల చుట్టూ,,రేషన్ కొట్ల చుట్టూ, సంక్షేమ పధకాల చుట్టూ చేతిలో పాత్రతో పాద యాత్ర మొదలు..


కమాన్ కామన్ మాన్ గెట్ రెడీ ఫర్ పాద యాత్ర!










నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

గురువారం, మార్చి 17, 2011

మగానుభావులు

జపాను దేశం లో భూకంపం
భారత దేశం లో భూ పంపకం





పంచ భూతాలనూ కబ్జా చేయగల నాయకులు 
లంచాలతో మాయ చేయ గల మగానుభావులు 





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

గురువారం, ఆగస్టు 12, 2010

నీకేమి తెలుసు..నిమ్మకాయ పులుసు

నీకేమి తెలుసు ..నిమ్మకాయ పులుసు

రక్తం అమ్ముకుని కోట్లు సంపాదిస్తున్నారు....జీవితా రాజసేఖర్

రక్త దానం గురించి మాట్లాడితే నాలుక కోస్తా--అల్లు అరవిందు

తెలంగాణా అడ్డుపెట్టుకుని వేల కోట్లు గడించాడు కే సీ ఆర్ - హరికృష్ణ

నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.పరువునష్టం దావా వేస్తా - కే సీ ఆర్

తండ్రి వల్ల జగన్ ఆస్తులు కూడబెట్టాడు  --ఈనాడు
ప్రజల ఆస్తి మార్గదర్శిలో పెట్టి మోసం చెసాడు రామోజీ రావు - సాక్షి
శని వారం - భారత్ నంబర్ వన్ క్రికెట్ టీం
మనగళ వారం - 98 పరుగులకే ఆలౌట్ 200 పరుగుల తేడాతో న్యూజీలాండ్ చేతిలో ఓడిన భారత్
హా...కీ...
ఐ హెచ్ ఎఫ్ నే గుర్తిస్తాం..హాకీ ఇండియా నే సరైనది...
కామన్వెల్త్ క్రీడల పై క్రీనీడలు..పూర్తి కాని స్టేడియాలు...కొలిక్కిరాని స్పాన్సర్షిప్పులు
అభివృద్ధి పధం లో ముందుకు పోలేక పోయినా
బెల్టు షాపులతో నడుం బిగించి మందుకు పోదం అంటున్న ప్రభుత్వం
గవర్ణమెంటు ఆసుపత్రి..బడి..ఆఫీసు ఉన్నా లేకపోయినా వీధి వీధి కి....ఇంటి ఇంటి కీ మధ్య మధ్యం దుకాణం మా వరం...

ఇవి రోజూ వారీ హెడ్ లైన్లు.. కాకపోతే ... సగటు ఆంధ్రుడు..రోజూ సీరియల్ లాగా న్యూసు చూసేసి..ట్విస్ట్ లు చూసి..ఇది మామూలే అనుకుని..మళ్ళీ తన పని లోకి తాను...పోనీ ఏదైనా ఎవరినైనా అడుగుదామంటే..అతనికి ఎదురయ్యే ప్రశ్న

నీకేమి తెలుసు..నిమ్మకాయ పులుసు








నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

సోమవారం, ఏప్రిల్ 12, 2010

ఆడపిల్లకి న్యాయం చేయలేని సిఎం ఉంటే యెంత ఊడితే ఎంత - అని మా ఫ్రెండు పంపిన ఒక పోస్టుకి ప్రతిస్పందన.

ఆడపిల్లకి న్యాయం చేయలేని సిఎం ఉంటే యెంత ఊడితే ఎంత ? ----------అని మా ఫ్రెండు పంపిన ఒక పోస్టుకి ప్రతిస్పందన.


ayesha_pratusha_copyలీడర్ సినిమాలో ఆఖరు పావుగంటలో వచ్చే ఒక డైలాగ్ ప్రజలని ఆలోచనలోకి నెట్టింది. హీరో తన పదవికి రాజీనామా చేసినప్పుడు చెప్పే డైలాగ్ " ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని సిఎం ఉంటే ఎంత ఊడితే ఎంత " . నిజంగా తన పదవివి కాపాడుకోడానికి ఒక ఆడపిల్లని అత్యంత కిరాతకంగా మానభంగం చేసి , చంపేసిన నరరూప రాక్షసుడిని తన పదవికోసం కాపాడిన సిఎం ..... మరుక్షణం మనసు మార్చుకుని తన పదవికి రాజీనామా చేయడం కేవలం   సినిమాకే పరిమితం అయినప్పటికీ సిగ్గు లేని మన నాయకులకు చెప్పుదెబ్బ లాంటిది. గతంలో కొందరు అమాయకమైన ఆడపిల్లలు అత్యాచారాలకు బలైనప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వారిని కాపాడాడు అని ఆరోపణలు వచ్చాయి. వాటిలో ప్రధానమైనవి హీరోయిన్ ప్రత్యూష కేసు , ఇంకా ఆయేషా మీరా కేసు.

cbn-pratyshaఅందాల నటి ప్రత్యూష అనుమానాస్పద రీతిలో మరణించిన తర్వాత ... ఆమె మరణం వెనుక పెద్దమనుషుల హస్తం ఉందని  అనేక ఆరోపణలు చేశారు ఆమె తల్లి . అప్పట్లో తెలుగుదేశం పార్టీలో నంబర్ 2 పోసిషన్ లో ఉండే ఒక నాయకుడి కుమారుడి మీద ఆరోపణలు వచ్చినా చంద్రబాబు నాయుడు వారికి కొమ్ము కాశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.  తన పార్టీ లోని అనుచరుడి కుమారుడిని కాపాడుకోవడానికి  తన కుర్చీ కోసం  ప్రతూషకి చంద్రబాబు  అన్యాయం చేశారని  ఆరోపణలు వచ్చినా నాయుడు గారు చలించలేదు. తర్వాత ఏం జరిగిందో ఏమో ప్రత్యూష తల్లి తెలుగుదేశం లో చేరారు. కానీ ప్రత్యూషకి మాత్రం అన్యాయం జరిగింది. చంద్రబాబు నాయుడికి కనీసం చీమ కుట్టినట్టు కూడా అనిపీలేదేమో. ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని చంద్రబాబు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్  చేస్తారట.
ayeshaa_ysrమరో కేసులో విజయవాడలో అత్యంత కిరాతకంగా రేప్ కి గురై హత్యగావించబడ్డ ఆయేషా మీరా కేసులో నిందితులని వైఎస్ఆర్ కాపాడుతున్నారని పెద్ద దుమారమే రేగింది. ఐనప్పటికీ వైఎస్ఆర్ చలించలేదు. కేసు విచారణ వేగవంతం అయ్యేటప్పుడే  విజయవాడ పోలీస్ కమీషనర్ నీ ట్రాన్స్ ఫర్ చేసేసారు. కేసుతో సంబంధం లేని లడ్డు అనే వైజాగ్ యువకుడిని తీసుకొచ్చి ఇరికించే ప్రయత్నం జరిగింది . తర్వాత సత్యం బాబు అనే మరొక యువకుడి పేరు వెలుగులోకి తెచ్చారు . కానీ ఆయేషా మీరా  కి అన్యాయం జరిగింది అని ఆమె తల్లి మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. కేవలం తన వర్గం వాడు అనే ఫీలింగ్ తోనే నిందితుడిని కాపాడి ఒక అమాయకమైన ఆడపిల్లకి అన్యాయం చేసి సిఎం సీటులో దర్జాగా కూర్చున్నారు అనే ఆరోపణ వైఎస్ఆర్  మీద ఉంది. ఇలా ఆడపిల్లలకి అన్యాయం చేసి చివరికి వీరు సాధించింది ఏంటి? బావుకున్నది ఏంటి ?
తాజాగా విజయవాడలో హత్యకి గురైన నాగవైష్ణవి హత్య కేసులో నిందితులని తప్పించే ప్రయత్నం జరుగుతుంది అని వూహాగానాలు వస్తున్నాయి. కనిసం ఎనభై ఏళ్ళ వయసులో అన్న రోశయ్య తన కుర్చీ కన్నా ఆడపిల్లకి న్యాయం చేయడంలో శ్రద్ధ వహిస్తారు అని ఆశిద్దాం



 ప్రతిస్పందన.


దయచేసి..సినిమాలు చూసి ఎమోషన్ అవద్దు. ఈ అన్యాయాలు శతాబ్దాల బట్టీ స్త్రీల మీద జరుగుతునే ఉన్నాయి. అందులో చూపించేవి కేవలం ఎమోషనల్ గా టచ్ చేసి సినిమా ఆడించుకోవడం కోసమే..నిజంగా వాళ్లకి అంతటి చిత్త శుద్ధి ఉంటుందా? అని నా ప్రశ్న. ఆ సినిమా అయిపోయి మళ్ళీ వేరే సినిమా మొదలవగానే అందులోని విషయం మర్చిపోతారు..ఏ ప్రేమ సబ్జెక్టో ఐతే వీలైనంతవరకూ "హీరోయిన్ " ని ఎక్స్ పోజ్ చేస్తారు.వాళ్ళు ఎప్పటికీ ఆదర్శం కారు.

ఇక రాజకీయ నాయకుల విషయానికొస్తే...అసలు మనదగ్గర ఉన్నది ప్రజా స్వామ్యమే కాదు. ఎందుకంటే..వారసత్వాన్ని ఓటు  ద్వారా మార్చుకుని గెలిచే వీళ్లు రాజకీయ నాయకులే కానీ ప్రజా నాయకులు కాదు. ముందు తరం నాయకుల పేర్లు చెప్పుకుని  కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్ళు, భార్యలూ(కరెక్టే కొందరికి ఇద్దరు ముగ్గురున్నారు), ఇలా బంధువులే నిండిపోతే ఇక ప్రజా  నాయకులెక్కడనుంచీ వస్తారు.

వాళ్ళ స్వంత ఖర్చులు..డ్రైవర్లు, పీ ఏలు, ఇతర మెయిన్ టెనెన్స్ ఖర్చులు ,అసెంబ్లీ లో వృధా చేసే గంటల కొద్దీ సమయం యొక్క విలువ లెక్కగడితే ఐదేళ్ళలో వాళ్ళు నియోజక వర్గానికి ఖర్చుపెట్టేదానికి కనీసం 30 రెట్లు ఎక్కువ ఉండవచ్చు.

ఇక ప్రత్యూష, అయేషా ల లాంటి కేసులు విషయానికొస్తే...బయటకు రాని కేసులు ఎన్ని ఉన్నాయో కూడా లెక్క చూడవలసి ఉంటుంది. కులం , వర్గం, ప్రాంతం, బంధు జనం, ఇలా అనేక రకాలుగా చుట్టూ ఉన్న జనాన్ని కాపాడే విషయంలో ప్రజల కి జరిగే అన్యాయాలని పట్టించుకునే టైం లేదు వీళ్లకి. దొరికిన ఐదేళ్ళలో అందింత దోచుకోవడానికే ప్రణాళికలు తప్ప..ఆడవాళ్లకి ఏమి జరిగితే వీళ్లకేమిటి.


బ్రిటీష్ వాళ్ళు మనలని డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతి లో పాలించారు. కలిస్తే ప్రమాదమని ...వీలైనంతవరకు విభజించి పాలించారు. చేస్తే చేసారు కనీసం రైళ్ళు, విమానాలు లాంటి టెక్నాలజీ త్వరగా ఇచ్చి వెళ్ళారు. కానీ ఇప్పటి నాయకులు.. డిలే అండ్ రూల్ అనే సూత్రం పాటిస్తారు అంటే ...నిదానంగా పాలించు..ఎందుకంటే కొంత కాలం అయితే జనం మర్చిపోతారు. ఎవరు ఉన్నా ఎవరు లేక పోయినా ప్రపంచం నడుస్తునే ఉంటుంది కాబట్టి..ఎవరి గోల లో వాళ్ళుంటారు అని లేట్ చేస్తారు.

ప్రపంచం లో మనలని ఎవరూ ఉద్ధరించరు..మనలని మనమే కాపాడుకోవాలి..జనమే కలిసి పోరాడాలి..మన దాకా వచ్చేదాకా వేచి చూడక..పక్క వాడికి అన్యాయం జరిగినప్పుడు స్పందిస్తే..ప్రభుత్వమూ కళ్ళు తెరుస్తుంది..


"ఒక్క ఆడపిల్లకి సాయం/న్యాయం చేయలేని సీ ఎం ఉంటే ఎంత లేకపోతే ఎంత ?" ఇది కాదు ముఖ్యం "పక్కవాడికి అన్యాయం జరిగినప్పుడు స్పందించని మనం ఉంటే ఎంతా...లేకపోతే ఎంత.????"


నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మంగళవారం, డిసెంబర్ 22, 2009

నాల్కల్ కోస్తాం, ముక్కుల్ నేలకి రాస్తాం - హైడ్రామాబాద్

 నాల్కల్ కోస్తాం, ముక్కుల్ నేలకి రాస్తాం - హైడ్రామాబాద్ 

ఆహా ఈ రాజకీయ పరిభాష చూస్తుంటే, వింటుంటే అనాలేమో కానీ టీవీల్లో చూపిస్తున్నారు కదా. ఫరవాలేదు. ఎంత బాగుందో. అసలు వీళ్లు కొట్టుకునేదెందుకో అర్ధం కావట్లేదు. తెలంగాణా కోసం దీక్ష చేసిన కేసీ ఆర్ , ఒక పక్క ఒక్కడే చేసినా రాష్ట్రం మొత్త ఏకం చేసారు. మరి సమైక్యాంధ్ర కోసం చేసే దీక్ష తలొకళ్ళు తలా ఒక చోట ఎందుకు చేస్తున్నట్టు ? ప్రస్తుతానికి హైదరాబాదే కదా రాజధాని. ప్రతీ ఒక్కరూ హైదరాబాద్ కోరుకుంటున్నారే తప్ప. అసలు విషయం అర్ధం కావట్లేదు. ఎక్కడో పుట్టిన వాడు ఏ డిల్లీకో, బాంబేకో, చెన్నై కో వెళ్ళి బతకట్లేదా? ఎక్కడ పని దొరుకుతుందో, సుఖం గా ఉంటుందో, అన్ని సదుపాయాలూ ఉంటాయో అక్కడ బతకాలనుకుంటాడు ప్రతీ మనిషి. బతకడం మొదలెట్టాక శాశ్వత నివాసం కోసం చూస్తాడు , తరువాత ఆస్తులు కూడబెడతాడు. కాలవ గట్టున ఉన్నవాళ్ళని ఖాళీ చేయించినట్టు..ఉన్న పళాన వెళ్ళి పో అంటే ఎక్కడికెళతాడు. ఇక్కడే ఉండనిస్తే రాష్ట్రం వస్తే ఆ రాష్ట్ర వాసి గా ఉంటాడు..లేదా పాత జీవితం కొనసాగిస్తాడు. ప్రభుత్వం తో పోరాడండి. సరైన నిర్ణయం తీసుకోండి..ప్రజలకి మంచి చెయ్యండి. అంతే కానీ మీలో మీరు కొట్టుకుని..ప్రజలను కంఫ్యూజ్ చేసి ..ఏమి జరుగుతున్నదో..అర్ధం కాకుండా..ఎవరో బ్రిటీషు వాళ్లతోనో.పాకిస్తాను వాళ్ళతోనో పోరాడినట్టు మన వాళ్ల మీద మనమే పోరాడడం ఎంత వరకూ సమంజసమో ఆలోచించండి. హోటళ్ళు మూసేసి, పేర్లు మార్చేసి, సినిమాలు ఆపేసి, బస్సులు పగల కొట్టి, ఆత్మాహుతులు చేసుకునీ కాదు..ఎందుకు చేస్తున్నాం, ఏమి సాధిస్తాం, అన్నది ప్రజలకి తెలిసేలా చెప్పండి. టీ వీల్లో చర్చల్లో..మోహన్ బాబు ఇలా అన్నాడు...కే సీ ఆర్ అలా అన్నాడు అని ఒక వ్యక్తి ప్రకటనలు, భావావేశం లో అన్న మాటలూ, గురించి టైం వేస్టు చేసుకుని, వాళ్ళ రేటింగులు పెంచి, వార్తలకో - ప్రకటనలకో సమయం అవగానే అర్ధాంతరంగా ఆగిపోయే చర్చలతో ఎందుకు కొట్టుకుంటారో అర్ధం కావట్లేదు.. విధ్వన్సానికి భయపడో..ఆస్తులు నష్టం అవుతాయనో మూసేస్తున్నారా..లేక నిజంగానే స్వచ్చందం గా మూస్తున్నారా మీరు చేసే బందులకి, ఇంట్లోంచి బయటకు రావాలంటే భయమేస్తోంది.ప్రతీ ఒక్కరికీ, NIMS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్ గా మారుతోంది. హైదరాబాద్ హైడ్రామాబాద్ గా మారుతోంది. సోనియా ఏమంటుందో తేలేదాకా ఇదే పరిస్థితి. ఏమనాలో..ఏమనుకోవాలో..ఏం జరుగనుందో ...అంతా సోనియా దయ.



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మంగళవారం, డిసెంబర్ 15, 2009

జై ఆంధ్రా - జై తెలంగాణా

 జై ఆంధ్రా - జై తెలంగాణా  

బయట జరుగుతున్న వాటిమీద నాకు పెద్దగా అవగాహన లేదు. అక్కడి ప్రజలు పడిన, పడుతున్న బాధలూ తెలీదు. టీ వీ చానెళ్ళలో చూపించేవి చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో...ఎవరిది కరెక్టో ఎవరిది కాదో కూడా అర్ధం కావట్లేదు. నా బాధ ఒకటే..నిన్నటిదాకా పక్క పక్కనే ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఎందుకు విడిపోతున్నారు. రాష్ట్రాలుగా కాదు..మనుష్యులుగా.

ఆంధ్ర మెస్ అని ఉంటే చెరిపేసి తెలంగాణా మెస్ అని రాస్తున్నారు..భోజనం మారుతుందా. రుచి మారిపోతుందా. ఆంధ్ర మహిళా సభ అని ఉంటే తెలంగాణా మహిళా సభ అని మారుస్తున్నారు. దేశం కోసం కష్టపడ్డ స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గా బాఇ దేశ్ ముఖ్ ఆత్మ ఘోషించదా. ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్నప్పుడు ఆవిడ పెట్టిన ఓ సేవా సంస్థ అది. ఇప్పుడు విడిపోతే ఆమె పెట్టుకున్న పేరు మార్చెయ్యాలా. ఆంధ్ర అంటే తెలంగాణా కానిదా. తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ లో లేదా.. ఆంధ్ర బ్యాంక్ కూ కొన్ని చోట్ల పేరు మార్చారు. భోగ రాజు పట్టాభి రామయ్య ఎప్పుడో మొదలెట్టిన ఆ అద్భుతాన్ని అవమానపరచాలా. మనం తలెత్తుకు ఎగురేసే జాతీయ జెండా తెలుగు వాడైన పింగళి వెంకయ్య తయారు చేసారు. మరి రేపు అదీ వద్దా..మనం వేరే జెండా తయారు చేసుకుందామా? మన ఎజెండాలో అదీ ఉందా?

ప్రాంతం కోసం జరిగే ఈ సమరం లో కొంచెం సమ్యమనం పాటించి..ఆవేశం తగ్గించి..మనకో పక్క వాళ్ళకో ప్రాణ నష్టం మరే నష్టం కలగ కుండా చూసుకొంటే మంచిది. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన స్టూడెంట్లు అందించే ఆ ఫలం అందుకుని ఆ కుటుంబ సభ్యులు ఆనందించ గలరా..వాళ్ళూ స్వతంత్ర్య పోరాట యోధులు గా మిగిలుతారా? లేక ఈ రాజకీయ నాయకుల పనుల్లో సమిధలుగా మిగులుతారా?

ప్రజల ముందు ఒక మాట..వెనకాల ఒక మాట చెప్పి పబ్బం గడుపుకునే రాజకీయనాయకులని నమ్మి అమాయకులైన కుటుంబ సభ్యుల జీవితాలను పణంగా పెట్టి ప్రాణ త్యాగాలు చెయ్యకండి మిత్రులారా..మీదైనా..పక్కవాడిదైనా ప్రాణం విలువ సమానమే..గాంధీ మార్గంలో సాధించండి..విజయీ భవ.





నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

గురువారం, నవంబర్ 05, 2009

మాయాజాలం

మాయాజాలం
తిరుపతి లో ఆంధ్ర మెజీషియన్ లు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఇంద్రజాల సభలు జరుగుతున్నాయి. ఆశ్చర్యమేమిటంటే ఇక్కడ ఇంకా పెద్ద స్థాయిలో ఇంద్రజాలం జరుగుతోంది. పీ సీ సర్కార్ సీనియర్ తరువాత ఆయన పరంపరని కొనసాగించాడు జూనియర్ పీ సీ సర్కార్...కానీ.ఇక్కడ సీనియర్ వై ఎస్ 'సర్కార్ ' తరువాత జూనియర్ వై ఎస్ కి అలా జరగలేదు. రాజకీయమనే ఇల్ల్యూజన్ లు ఇంకా వంటబట్టించుకోకపోవడమే దీనికి కారణమనుకుంటా...రక రకాల బిజినెస్సుల్లో బిజీ గా మెస్సై పోవడం వల్ల...కాబోలు.


సీనియర్ సర్కార్ రాష్ట్రమంతటా పర్యటించి...తన ఇందిరాజలం తో జనాల్ని సమ్మోహితుల్ని చేసి ఎసెంబ్లీ హౌసు ఫుల్లు కాక పోయినా కలెక్షన్ కి సీ ఎం సెలెక్షన్ కీ కావాల్సినంత చేసుకోగలిగాడు..ఐతే..పావురాల గుట్ట ????... మెజీషియన్ లు ఎక్కువగా పావురాలతోనే మేజిక్ చేస్తారు. అక్కడ అనుకోంది దుర్ఘటన తో..అందరికీ దూరమైనాడు. కానీ ఆయన కొనసాగింపు..వారసుడికి రాలేదు. సాధారణంగా వారసత్వాన్నే పౌరసత్వంగా భావించే కాంగ్రెస్ ఈ సారి ఎందుకనో? అలా జరక్కుండా..పీఠం జారకుండా జాగ్రత్త పడ్డారు.
బడ్జెట్ మంత్రిగారు..అదే ఆర్ధిక మంత్రిగారు..ఎలాగూ జిమ్మిక్కులు..అప్పులు-ఆస్తుల మేజిక్కులు..ప్రతిపక్షం వారిని నోరుమూయించగల లాజిక్కులు చాలా తెలుసు కాబట్టి..నెమ్మదిగా.ముఖ్య.మంత్ర దండం అందుకుని తిప్పుతున్నారు.


ఎలాగూ టోపీల్లోంచి వచ్చేవి 'కుందేళ్ళే " గనక ఖంగారు లేకుండా...నడిపించేస్తున్నారు రోశయ్య గారు. ఇండియన్ రోప్ ట్రిక్కు లాగా అందరినీ ఒక్క తాటి మీద నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కొరకరాని కొండ లుంటే,,డబ్బా లో పెట్టి మాయం చెయ్యగల సమర్ధులు. వారు.


ఢిల్లీలో చూద్దామా అంటే ...సీనియర్ వై ఎస్ సర్కార్ కి మేనేజర్ ఐన కె వీ పీ గారికి ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి..మేనేజ్మెంట్ లేకుండానే షో నడుస్తోంది..సోనియా చూస్తే ఫ్యూచర్ ప్రోగ్రాం గురించి చెప్పటం లేదు. గట్టిగా అడిగితే మేనేజర్గిరీ కే ప్రమాదమేమో కూడా.


మొత్తానికి..ప్రస్తూం ఆంధ్ర గవర్నమెంటు 'జంతర్ మంతర్ ' తిరుపతిలో జరగనున్న జాతీయ ఇంద్రజాలికుల సదస్సుకి శుభాభినందనలు శుభాకాంక్షలతో ..


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శుక్రవారం, అక్టోబర్ 23, 2009

గెలిచిన వేళనే చూడాలీ

 గెలిచిన వేళనే చూడాలీ ..నాయకుని ముఖమున వెలుగూ.....
 
ఆహా ఇంద్రప్రస్థ పురము న...10, జనపధ మార్గము ..ఇట్లు వెలిగిపోవుచున్నదేమి..ఆహా దీపావళి పండుగ మరలా వచ్చినదా ఏమి..అని ఆకాశమునుంచీ దేవతలు ఆశ్చర్యమున చూచుచున్నారు.

నాలుగు దినముల క్రితము ఐపోయిన పండుగ వాతావరణం మళ్ళీ ..డిల్లీలో కనిపించింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి..కాంగిరెస్సు వారు ఆనందోత్సాహాలతో సోనియా మాత గుడికి వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నారు. మాత దర్శనం కోసం క్యూ కాంప్లెక్సు లో వైటింగు చేస్తున్నారు.

ఇటు ..జగన్ కూడా 'ఆ ' పని మీద అమ్మగా(వా)రి దర్శనం కోసం వెళ్ళాడు. జ్యోతి దర్శనం కోసం బయలుదేరినట్టు..అందరు...తలో మార్గం లో ప్రయాణిస్తున్నారు. ఐతే ప్రసాదం ఎవరికి దక్కుతుందో ..అక్షింతలు ఎవరకి పడతాయో..చూడాలి మరి.

ఇన్నాళ్ళు 'జగనంత కుటుంబం మాదీ' ..అన్న వాళ్ళు కాస్తా..ఇప్పుడు.  రోషాలకు..పాశాలకు పోకుండా ..రోశయ్య గారు చెప్పినట్ట్లు నడుచుకుంటున్నారు..సంతకాలు ఎందుకు పెట్టామో కూడా తెలీదు అని చెప్పారు కొందరు మహానుభావులు..అంతే లే ఇవి 'మామూలే '

జిల్లాకి పేరుపెట్టి...రాష్ట్రం సంగతి నే చూసుకుంటాలే అని చెప్పకనే చెప్పారు..ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు..ఆలస్యం అమృతం విషం అని ముందే కూసిన కోయిలలు..గవర్నమెంటు పనులలో నిదానమే ప్రధానం అన్న సూక్తి మాత్రమే వర్కౌట్ అవుతుందని తెలిసేలోగా...జరగాల్సినవి జరిగిపోతున్నాయి..బీ బ్లాకునుంచీ సీ బ్లాకుకి..

నేను నిమిత్త మాత్రుణ్ణి..దేవత ఏమి చెబితే అది చేస్తాను ..అని రోశయ్య గారి ఉవాచ..ఎలాగూ. ఓ నాలుగైదేళ్ళు తపస్సు చేస్తే గానీ.దేవత ప్రత్యక్ష్యమై.వరాలివ్వదని ఆయనకీ తెలుసు..దాదాపు 50 ఏళ్ళుగా తపస్సుచేస్తున్న అనుభవం ఆయనది..


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మంగళవారం, సెప్టెంబర్ 15, 2009

కెలక్కు

వెన్న ముద్దలు అనే పుస్తకంలో ప్రముఖ రచయిత జనార్ధన మహర్షి అన్నారు..ఇష్టం లేక పోతే ఉలక్కు పలక్కు కానీ కెలక్కు...అని...ప్రస్తుతం కాంగ్రెస్ అధిస్టాన వర్గం అదే చేస్తోంది. ప్రస్తుతం ఆంధ్ర లో రాజకీయ అనిస్చితి చూసి....ఏం చెయ్యాలో తెలీక...ఏదో ఒకటి చేసేయలేక..ఎదురుచూస్తోంది.

సోనియా నే అన్నీ చూసుకుంటారు..సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు అని మిగిలినవాళ్ళు చెబుతున్నా....'ఆ' నిర్ణయం ఏంటో ఇంకా ఆవిడకి కూడా అంతుబట్టటం లేదు. ఇన్నాళ్ళూ అన్ని తానే అయి నడిపించిన రాజసేఖరుడు స్థానాన్ని ఎవరికి ఇవ్వాలో తెలియక తిక మక పడుతున్నారు.

మొన్నేమో జగనే సీ ఎం అన్నవాళ్ళు ఇప్పుడు కొంచెం గేప్ ఇచ్చారు. అటు కే వీ పీ...హైదరాబాదు..డిల్లీ తిరిగి తిరిగి విసిగి ఉన్నారు..ఇన్నాళ్ళూ వెనకుండి నడిపించిన ఆయన ప్రస్తుతం ముందు జరగవలసిన దాని గురించి మల్ల గుల్లాలు పడుతున్నారు.

ఏమిటో ...ప్రస్తుతం రోశయ్య గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా ఉన్నా...అలా ఉండడం ఆయనకూ ఇస్టం ఉండదు...ఐతే మొత్తం అవాలి లేదా ఊరుకోవాలి...





నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శనివారం, సెప్టెంబర్ 05, 2009

' ప్రజా ' శేఖర్ రెడ్డి= ప్రజా సేవకు రెడీ అనే రాజ శేఖర్ రెడ్డి

ప్రజా సేవకు రెడీ అనే రాజ శేఖర్ రెడ్డి ఇక లేరు...ఇది ఇవ్వాళ ఏ పేపరు చూసినా..న్యూస్ చానెల్ పెట్టినా కనిపించిన హెడ్ లైను.కానీ ఆయన మనందరి మనసుల్లో ఉన్నాడు. ఇంత ఏ ముక్యమంత్రి మరణానికీ పక్క రాష్ట్రాలు కూడా శలవు ప్రకటించలేదు..అంటే ఆయనకున్న మంచి పేరు ఎలాంటిదో అందరికీ అర్ధం అవుతుంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రచ్చబండ కి వెళుతూ.తరలి రాని లోకాలకు వెళ్ళిపోయాడు ఆ మహా మనిషి.

ప్రజా సేవకు రెడీ అనే ఆ రాజ శేఖరుడు...కాలిబాటన రాష్ట్రం నలుమూలలా పర్యటించి..రాజధానికి రాజుగా చేరుకున్నాడు. పల్లెలో వెతలు చూసి ఉచిత కరెంటు ఇచ్చాడు, పల్లె బాటలో జనాన్ని చూసి రెండు రూపాయలకు బియ్యం ఇచ్చాడు. డాక్టరు కావడం వల్ల..తన ఆరాధ్యమైన రాజీవ్ పేరిట ఆరోగ్య శ్రీని అందించాడు...ఇందిరమ్మ ఇళ్ళు కట్టించి...కష్టించే వాళ్ళకూ గూడు అందించాడు. కూడు.గూడు..ఆరోగ్యం ....అందించాడు..ప్రాజెక్టులు కట్టి..పూర్తి చేసాడు...తలచిన పని చేసుకు పోవడమే కానీ వెను తిరిగి చూడని ధీశాలి.

ఇంకా ఎన్నో చేయాలనుకున్నా....మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఆ పనులు ఇంక ఎవరు చేస్తారో వేచి చూడాలి. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని ఆశిస్తూ






నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

ఆదివారం, జనవరి 04, 2009

రంగు పడుద్ది

రంగు పడుద్ది

ఎస్ నిజంగా రంగు పడుద్ది..కలర్స్ ఆఫ్ పాలిటిక్స్ చూస్తే మనకు రంగు పడుద్ది..

సపోస్ పర్ సపోస్ ప్రజారాజ్యం + బీజేపీ ఏమౌతుంది..కాంగ్రెస్స్ అవుతుంది..ఎలా అనుకుంటున్నారా? తెలుపు ఆకుపాచ్చ జెండాకి కాషాయం కలిస్తే కాంగ్రెస్స్ జెండా అవుతుంది కదా...

పసుపు లోంచి విడిపోయి పింక్ అయిపోయిన తెరాస ఇప్పుడు మళ్ళీ తెలంగాణా కోసం పింక్ కారుకి పసుపుతో కోటింగు కు సిద్ధం అని ఆమధ్య ప్రకటించారు..అఫ్ కోర్స్ అదీ ఎన్నాళ్ళో? నచ్చకపోతే మారొచ్చు కూడా...

తెలుపు ఆకుపచ్చల కు నీలం తోడై "ప్రజానవతెలంగాణరాజ్యం " సాధిద్దాం అనికూడా ఒక నినాదం నిదానంగా వినిపిస్తోంది...

ఇక ఈమధ్య ఆల్రెడీ పసుపు ఎరుపు కలిసి మూడో కూటమి కి మేము సైతం అంటున్నారు..సైకిల్ పై కత్తి కొడవలి స్వారీ అన్నమాట..పసుపు ఎరుపు కలిస్తే ఏం రంగు వస్తుందబ్బా...


ఈ కలర్స్ కాంబినేషన్ చూస్తుంటే కొంచెం కంఫ్యూజన్ గానే వుంది..అప్పట్లో అంటే చంద్రబాబు సీ ఎం గా ఉన్నప్పుడు ఆయన "పచ్చదనం-పరిశుభ్రత " అంటే అపార్ధం చేసుకున్న కార్యకర్తలు రాష్ట్రమంతా పసుపుమయం చేసారు పచ్చ అంటే పసుపు కాబోలు అనుకుని...కొందరు ఇంటికి వంటికి కూడా పూసుకుని తమ పార్టీ భక్తి కూడా చాటారు..అందుకే త్వరగా ఈ పార్టీలు రంగులు ఖరారు చేస్తే కార్యకర్తలు గోడలు ఖరాబు చెయ్యడానికి తయారు అవుతారు...

వాళ్ళ వాగ్దానాలకి కళ్ళు బైర్లు కమ్మి మనకి ఎలాగూ కలర్ బ్లైండ్ నెస్స్ వచ్చి మనం ఏది ఏ కలరో ..ఏకలర్ పార్టీ వాళ్ళు ఏపార్టీ తో జతకట్టేరోఅ గుర్తు పట్టలేము.. ఒకవేళ ఎలాగూ ఎనంకల ముందు వరాలూ తరువాత క్షవరాలుకి అలవాటుపడ్డవాళ్ళం కాబట్టి ఎవరైనా గుర్తుపట్టి తమ కు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుందామని వెళ్ళినా మన వోటు అప్పటికే ఎవరో ఒకరు వేసేసి వుంటారు కాబట్టి "తెల్ల " మొహం వేసుకుని వెనక్కి రావలసి వుంటుంది..

రాజకీయం రంగు తెలుసుకోవడం సామాన్య ఓటరు కి అర్ధం కాదు..

LinkWithin

Related Posts with Thumbnails