నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి...Telugu Satire for Telugu People......!
Welcome
andhra pradesh లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
andhra pradesh లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
ఆదివారం, డిసెంబర్ 01, 2013
గురువారం, మార్చి 17, 2011
మగానుభావులు
శుక్రవారం, మార్చి 11, 2011
ట్యాంకు బండు పై కొమరం భీం విగ్రహం
ట్యాంకు బండు పై కొమరం భీం విగ్రహం - అమర విగ్రహ స్థూపం
సీ ఎం గారూ..
పగలిన విగ్రహాల గురించిన రిపోర్ట్ కు ఆదేశించారట. మళ్ళీ నిలబెట్టడానికి ఎంతౌతుందో లెక్క కట్టమన్నారట. అయ్యా..ఒక పని చేయండి. ఒక్క కొమరం భీం విగ్రహం వీలైనంత పెద్దది చేయించండి.. అమర వీరుల స్థూపం లా...అమర విగ్రహాల స్థూపం అన్నమాట. ఆ విగ్రహం చుట్టూ ఈ శిధిలాలను నిలబెట్టండి. అప్పుడైనా వాళ్ళ ఆవేశం వల్ల జరిగిన నష్టం వాళ్ళకి తెలుస్తుందేమో..జరిగిన దానికి సాక్షిగా...తరతరాలకూ తెలుస్తుంది.. ప్రభుత్వ వైఫల్యానికీ నిదర్శనంగా నిలుస్తుంది..
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
సీ ఎం గారూ..
పగలిన విగ్రహాల గురించిన రిపోర్ట్ కు ఆదేశించారట. మళ్ళీ నిలబెట్టడానికి ఎంతౌతుందో లెక్క కట్టమన్నారట. అయ్యా..ఒక పని చేయండి. ఒక్క కొమరం భీం విగ్రహం వీలైనంత పెద్దది చేయించండి.. అమర వీరుల స్థూపం లా...అమర విగ్రహాల స్థూపం అన్నమాట. ఆ విగ్రహం చుట్టూ ఈ శిధిలాలను నిలబెట్టండి. అప్పుడైనా వాళ్ళ ఆవేశం వల్ల జరిగిన నష్టం వాళ్ళకి తెలుస్తుందేమో..జరిగిన దానికి సాక్షిగా...తరతరాలకూ తెలుస్తుంది.. ప్రభుత్వ వైఫల్యానికీ నిదర్శనంగా నిలుస్తుంది..
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
సోమవారం, ఏప్రిల్ 12, 2010
ఆడపిల్లకి న్యాయం చేయలేని సిఎం ఉంటే యెంత ఊడితే ఎంత - అని మా ఫ్రెండు పంపిన ఒక పోస్టుకి ప్రతిస్పందన.
ఆడపిల్లకి న్యాయం చేయలేని సిఎం ఉంటే యెంత ఊడితే ఎంత ? ----------అని మా ఫ్రెండు పంపిన ఒక పోస్టుకి ప్రతిస్పందన.
తాజాగా విజయవాడలో హత్యకి గురైన నాగవైష్ణవి హత్య కేసులో నిందితులని తప్పించే ప్రయత్నం జరుగుతుంది అని వూహాగానాలు వస్తున్నాయి. కనిసం ఎనభై ఏళ్ళ వయసులో అన్న రోశయ్య తన కుర్చీ కన్నా ఆడపిల్లకి న్యాయం చేయడంలో శ్రద్ధ వహిస్తారు అని ఆశిద్దాం
ప్రతిస్పందన.
దయచేసి..సినిమాలు చూసి ఎమోషన్ అవద్దు. ఈ అన్యాయాలు శతాబ్దాల బట్టీ స్త్రీల మీద జరుగుతునే ఉన్నాయి. అందులో చూపించేవి కేవలం ఎమోషనల్ గా టచ్ చేసి సినిమా ఆడించుకోవడం కోసమే..నిజంగా వాళ్లకి అంతటి చిత్త శుద్ధి ఉంటుందా? అని నా ప్రశ్న. ఆ సినిమా అయిపోయి మళ్ళీ వేరే సినిమా మొదలవగానే అందులోని విషయం మర్చిపోతారు..ఏ ప్రేమ సబ్జెక్టో ఐతే వీలైనంతవరకూ "హీరోయిన్ " ని ఎక్స్ పోజ్ చేస్తారు.వాళ్ళు ఎప్పటికీ ఆదర్శం కారు.
ఇక రాజకీయ నాయకుల విషయానికొస్తే...అసలు మనదగ్గర ఉన్నది ప్రజా స్వామ్యమే కాదు. ఎందుకంటే..వారసత్వాన్ని ఓటు ద్వారా మార్చుకుని గెలిచే వీళ్లు రాజకీయ నాయకులే కానీ ప్రజా నాయకులు కాదు. ముందు తరం నాయకుల పేర్లు చెప్పుకుని కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్ళు, భార్యలూ(కరెక్టే కొందరికి ఇద్దరు ముగ్గురున్నారు), ఇలా బంధువులే నిండిపోతే ఇక ప్రజా నాయకులెక్కడనుంచీ వస్తారు.
వాళ్ళ స్వంత ఖర్చులు..డ్రైవర్లు, పీ ఏలు, ఇతర మెయిన్ టెనెన్స్ ఖర్చులు ,అసెంబ్లీ లో వృధా చేసే గంటల కొద్దీ సమయం యొక్క విలువ లెక్కగడితే ఐదేళ్ళలో వాళ్ళు నియోజక వర్గానికి ఖర్చుపెట్టేదానికి కనీసం 30 రెట్లు ఎక్కువ ఉండవచ్చు.
ఇక ప్రత్యూష, అయేషా ల లాంటి కేసులు విషయానికొస్తే...బయటకు రాని కేసులు ఎన్ని ఉన్నాయో కూడా లెక్క చూడవలసి ఉంటుంది. కులం , వర్గం, ప్రాంతం, బంధు జనం, ఇలా అనేక రకాలుగా చుట్టూ ఉన్న జనాన్ని కాపాడే విషయంలో ప్రజల కి జరిగే అన్యాయాలని పట్టించుకునే టైం లేదు వీళ్లకి. దొరికిన ఐదేళ్ళలో అందింత దోచుకోవడానికే ప్రణాళికలు తప్ప..ఆడవాళ్లకి ఏమి జరిగితే వీళ్లకేమిటి.
బ్రిటీష్ వాళ్ళు మనలని డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతి లో పాలించారు. కలిస్తే ప్రమాదమని ...వీలైనంతవరకు విభజించి పాలించారు. చేస్తే చేసారు కనీసం రైళ్ళు, విమానాలు లాంటి టెక్నాలజీ త్వరగా ఇచ్చి వెళ్ళారు. కానీ ఇప్పటి నాయకులు.. డిలే అండ్ రూల్ అనే సూత్రం పాటిస్తారు అంటే ...నిదానంగా పాలించు..ఎందుకంటే కొంత కాలం అయితే జనం మర్చిపోతారు. ఎవరు ఉన్నా ఎవరు లేక పోయినా ప్రపంచం నడుస్తునే ఉంటుంది కాబట్టి..ఎవరి గోల లో వాళ్ళుంటారు అని లేట్ చేస్తారు.
ప్రపంచం లో మనలని ఎవరూ ఉద్ధరించరు..మనలని మనమే కాపాడుకోవాలి..జనమే కలిసి పోరాడాలి..మన దాకా వచ్చేదాకా వేచి చూడక..పక్క వాడికి అన్యాయం జరిగినప్పుడు స్పందిస్తే..ప్రభుత్వమూ కళ్ళు తెరుస్తుంది..
"ఒక్క ఆడపిల్లకి సాయం/న్యాయం చేయలేని సీ ఎం ఉంటే ఎంత లేకపోతే ఎంత ?" ఇది కాదు ముఖ్యం "పక్కవాడికి అన్యాయం జరిగినప్పుడు స్పందించని మనం ఉంటే ఎంతా...లేకపోతే ఎంత.????"
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
మంగళవారం, డిసెంబర్ 22, 2009
నాల్కల్ కోస్తాం, ముక్కుల్ నేలకి రాస్తాం - హైడ్రామాబాద్
నాల్కల్ కోస్తాం, ముక్కుల్ నేలకి రాస్తాం - హైడ్రామాబాద్
ఆహా ఈ రాజకీయ పరిభాష చూస్తుంటే, వింటుంటే అనాలేమో కానీ టీవీల్లో చూపిస్తున్నారు కదా. ఫరవాలేదు. ఎంత బాగుందో. అసలు వీళ్లు కొట్టుకునేదెందుకో అర్ధం కావట్లేదు. తెలంగాణా కోసం దీక్ష చేసిన కేసీ ఆర్ , ఒక పక్క ఒక్కడే చేసినా రాష్ట్రం మొత్త ఏకం చేసారు. మరి సమైక్యాంధ్ర కోసం చేసే దీక్ష తలొకళ్ళు తలా ఒక చోట ఎందుకు చేస్తున్నట్టు ? ప్రస్తుతానికి హైదరాబాదే కదా రాజధాని. ప్రతీ ఒక్కరూ హైదరాబాద్ కోరుకుంటున్నారే తప్ప. అసలు విషయం అర్ధం కావట్లేదు. ఎక్కడో పుట్టిన వాడు ఏ డిల్లీకో, బాంబేకో, చెన్నై కో వెళ్ళి బతకట్లేదా? ఎక్కడ పని దొరుకుతుందో, సుఖం గా ఉంటుందో, అన్ని సదుపాయాలూ ఉంటాయో అక్కడ బతకాలనుకుంటాడు ప్రతీ మనిషి. బతకడం మొదలెట్టాక శాశ్వత నివాసం కోసం చూస్తాడు , తరువాత ఆస్తులు కూడబెడతాడు. కాలవ గట్టున ఉన్నవాళ్ళని ఖాళీ చేయించినట్టు..ఉన్న పళాన వెళ్ళి పో అంటే ఎక్కడికెళతాడు. ఇక్కడే ఉండనిస్తే రాష్ట్రం వస్తే ఆ రాష్ట్ర వాసి గా ఉంటాడు..లేదా పాత జీవితం కొనసాగిస్తాడు. ప్రభుత్వం తో పోరాడండి. సరైన నిర్ణయం తీసుకోండి..ప్రజలకి మంచి చెయ్యండి. అంతే కానీ మీలో మీరు కొట్టుకుని..ప్రజలను కంఫ్యూజ్ చేసి ..ఏమి జరుగుతున్నదో..అర్ధం కాకుండా..ఎవరో బ్రిటీషు వాళ్లతోనో.పాకిస్తాను వాళ్ళతోనో పోరాడినట్టు మన వాళ్ల మీద మనమే పోరాడడం ఎంత వరకూ సమంజసమో ఆలోచించండి. హోటళ్ళు మూసేసి, పేర్లు మార్చేసి, సినిమాలు ఆపేసి, బస్సులు పగల కొట్టి, ఆత్మాహుతులు చేసుకునీ కాదు..ఎందుకు చేస్తున్నాం, ఏమి సాధిస్తాం, అన్నది ప్రజలకి తెలిసేలా చెప్పండి. టీ వీల్లో చర్చల్లో..మోహన్ బాబు ఇలా అన్నాడు...కే సీ ఆర్ అలా అన్నాడు అని ఒక వ్యక్తి ప్రకటనలు, భావావేశం లో అన్న మాటలూ, గురించి టైం వేస్టు చేసుకుని, వాళ్ళ రేటింగులు పెంచి, వార్తలకో - ప్రకటనలకో సమయం అవగానే అర్ధాంతరంగా ఆగిపోయే చర్చలతో ఎందుకు కొట్టుకుంటారో అర్ధం కావట్లేదు.. విధ్వన్సానికి భయపడో..ఆస్తులు నష్టం అవుతాయనో మూసేస్తున్నారా..లేక నిజంగానే స్వచ్చందం గా మూస్తున్నారా మీరు చేసే బందులకి, ఇంట్లోంచి బయటకు రావాలంటే భయమేస్తోంది.ప్రతీ ఒక్కరికీ, NIMS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్ గా మారుతోంది. హైదరాబాద్ హైడ్రామాబాద్ గా మారుతోంది. సోనియా ఏమంటుందో తేలేదాకా ఇదే పరిస్థితి. ఏమనాలో..ఏమనుకోవాలో..ఏం జరుగనుందో ...అంతా సోనియా దయ.
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
లేబుళ్లు:
andhra politics,
andhra pradesh,
andhra pradesh politics,
ap elections results,
chandrababu,
kcr,
kosta,
lagadapati,
rosaiah,
soniya,
telangana,
ysr
మంగళవారం, డిసెంబర్ 15, 2009
జై ఆంధ్రా - జై తెలంగాణా
జై ఆంధ్రా - జై తెలంగాణా
బయట జరుగుతున్న వాటిమీద నాకు పెద్దగా అవగాహన లేదు. అక్కడి ప్రజలు పడిన, పడుతున్న బాధలూ తెలీదు. టీ వీ చానెళ్ళలో చూపించేవి చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో...ఎవరిది కరెక్టో ఎవరిది కాదో కూడా అర్ధం కావట్లేదు. నా బాధ ఒకటే..నిన్నటిదాకా పక్క పక్కనే ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఎందుకు విడిపోతున్నారు. రాష్ట్రాలుగా కాదు..మనుష్యులుగా.
ఆంధ్ర మెస్ అని ఉంటే చెరిపేసి తెలంగాణా మెస్ అని రాస్తున్నారు..భోజనం మారుతుందా. రుచి మారిపోతుందా. ఆంధ్ర మహిళా సభ అని ఉంటే తెలంగాణా మహిళా సభ అని మారుస్తున్నారు. దేశం కోసం కష్టపడ్డ స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గా బాఇ దేశ్ ముఖ్ ఆత్మ ఘోషించదా. ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్నప్పుడు ఆవిడ పెట్టిన ఓ సేవా సంస్థ అది. ఇప్పుడు విడిపోతే ఆమె పెట్టుకున్న పేరు మార్చెయ్యాలా. ఆంధ్ర అంటే తెలంగాణా కానిదా. తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ లో లేదా.. ఆంధ్ర బ్యాంక్ కూ కొన్ని చోట్ల పేరు మార్చారు. భోగ రాజు పట్టాభి రామయ్య ఎప్పుడో మొదలెట్టిన ఆ అద్భుతాన్ని అవమానపరచాలా. మనం తలెత్తుకు ఎగురేసే జాతీయ జెండా తెలుగు వాడైన పింగళి వెంకయ్య తయారు చేసారు. మరి రేపు అదీ వద్దా..మనం వేరే జెండా తయారు చేసుకుందామా? మన ఎజెండాలో అదీ ఉందా?
ప్రాంతం కోసం జరిగే ఈ సమరం లో కొంచెం సమ్యమనం పాటించి..ఆవేశం తగ్గించి..మనకో పక్క వాళ్ళకో ప్రాణ నష్టం మరే నష్టం కలగ కుండా చూసుకొంటే మంచిది. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన స్టూడెంట్లు అందించే ఆ ఫలం అందుకుని ఆ కుటుంబ సభ్యులు ఆనందించ గలరా..వాళ్ళూ స్వతంత్ర్య పోరాట యోధులు గా మిగిలుతారా? లేక ఈ రాజకీయ నాయకుల పనుల్లో సమిధలుగా మిగులుతారా?
ప్రజల ముందు ఒక మాట..వెనకాల ఒక మాట చెప్పి పబ్బం గడుపుకునే రాజకీయనాయకులని నమ్మి అమాయకులైన కుటుంబ సభ్యుల జీవితాలను పణంగా పెట్టి ప్రాణ త్యాగాలు చెయ్యకండి మిత్రులారా..మీదైనా..పక్కవాడిదైనా ప్రాణం విలువ సమానమే..గాంధీ మార్గంలో సాధించండి..విజయీ భవ.
నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
లేబుళ్లు:
andhra politics,
andhra pradesh,
kcr,
rosayya,
telangana,
trs,
ysr
శుక్రవారం, అక్టోబర్ 23, 2009
గెలిచిన వేళనే చూడాలీ
గెలిచిన వేళనే చూడాలీ ..నాయకుని ముఖమున వెలుగూ.....
ఆహా ఇంద్రప్రస్థ పురము న...10, జనపధ మార్గము ..ఇట్లు వెలిగిపోవుచున్నదేమి..ఆహా దీపావళి పండుగ మరలా వచ్చినదా ఏమి..అని ఆకాశమునుంచీ దేవతలు ఆశ్చర్యమున చూచుచున్నారు.
నాలుగు దినముల క్రితము ఐపోయిన పండుగ వాతావరణం మళ్ళీ ..డిల్లీలో కనిపించింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి..కాంగిరెస్సు వారు ఆనందోత్సాహాలతో సోనియా మాత గుడికి వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నారు. మాత దర్శనం కోసం క్యూ కాంప్లెక్సు లో వైటింగు చేస్తున్నారు.
ఇటు ..జగన్ కూడా 'ఆ ' పని మీద అమ్మగా(వా)రి దర్శనం కోసం వెళ్ళాడు. జ్యోతి దర్శనం కోసం బయలుదేరినట్టు..అందరు...తలో మార్గం లో ప్రయాణిస్తున్నారు. ఐతే ప్రసాదం ఎవరికి దక్కుతుందో ..అక్షింతలు ఎవరకి పడతాయో..చూడాలి మరి.
ఇన్నాళ్ళు 'జగనంత కుటుంబం మాదీ' ..అన్న వాళ్ళు కాస్తా..ఇప్పుడు. రోషాలకు..పాశాలకు పోకుండా ..రోశయ్య గారు చెప్పినట్ట్లు నడుచుకుంటున్నారు..సంతకాలు ఎందుకు పెట్టామో కూడా తెలీదు అని చెప్పారు కొందరు మహానుభావులు..అంతే లే ఇవి 'మామూలే '
జిల్లాకి పేరుపెట్టి...రాష్ట్రం సంగతి నే చూసుకుంటాలే అని చెప్పకనే చెప్పారు..ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు..ఆలస్యం అమృతం విషం అని ముందే కూసిన కోయిలలు..గవర్నమెంటు పనులలో నిదానమే ప్రధానం అన్న సూక్తి మాత్రమే వర్కౌట్ అవుతుందని తెలిసేలోగా...జరగాల్సినవి జరిగిపోతున్నాయి..బీ బ్లాకునుంచీ సీ బ్లాకుకి..
నేను నిమిత్త మాత్రుణ్ణి..దేవత ఏమి చెబితే అది చేస్తాను ..అని రోశయ్య గారి ఉవాచ..ఎలాగూ. ఓ నాలుగైదేళ్ళు తపస్సు చేస్తే గానీ.దేవత ప్రత్యక్ష్యమై.వరాలివ్వదని ఆయనకీ తెలుసు..దాదాపు 50 ఏళ్ళుగా తపస్సుచేస్తున్న అనుభవం ఆయనది..
ఆహా ఇంద్రప్రస్థ పురము న...10, జనపధ మార్గము ..ఇట్లు వెలిగిపోవుచున్నదేమి..ఆహా దీపావళి పండుగ మరలా వచ్చినదా ఏమి..అని ఆకాశమునుంచీ దేవతలు ఆశ్చర్యమున చూచుచున్నారు.
నాలుగు దినముల క్రితము ఐపోయిన పండుగ వాతావరణం మళ్ళీ ..డిల్లీలో కనిపించింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి..కాంగిరెస్సు వారు ఆనందోత్సాహాలతో సోనియా మాత గుడికి వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నారు. మాత దర్శనం కోసం క్యూ కాంప్లెక్సు లో వైటింగు చేస్తున్నారు.
ఇటు ..జగన్ కూడా 'ఆ ' పని మీద అమ్మగా(వా)రి దర్శనం కోసం వెళ్ళాడు. జ్యోతి దర్శనం కోసం బయలుదేరినట్టు..అందరు...తలో మార్గం లో ప్రయాణిస్తున్నారు. ఐతే ప్రసాదం ఎవరికి దక్కుతుందో ..అక్షింతలు ఎవరకి పడతాయో..చూడాలి మరి.
ఇన్నాళ్ళు 'జగనంత కుటుంబం మాదీ' ..అన్న వాళ్ళు కాస్తా..ఇప్పుడు. రోషాలకు..పాశాలకు పోకుండా ..రోశయ్య గారు చెప్పినట్ట్లు నడుచుకుంటున్నారు..సంతకాలు ఎందుకు పెట్టామో కూడా తెలీదు అని చెప్పారు కొందరు మహానుభావులు..అంతే లే ఇవి 'మామూలే '
జిల్లాకి పేరుపెట్టి...రాష్ట్రం సంగతి నే చూసుకుంటాలే అని చెప్పకనే చెప్పారు..ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు..ఆలస్యం అమృతం విషం అని ముందే కూసిన కోయిలలు..గవర్నమెంటు పనులలో నిదానమే ప్రధానం అన్న సూక్తి మాత్రమే వర్కౌట్ అవుతుందని తెలిసేలోగా...జరగాల్సినవి జరిగిపోతున్నాయి..బీ బ్లాకునుంచీ సీ బ్లాకుకి..
నేను నిమిత్త మాత్రుణ్ణి..దేవత ఏమి చెబితే అది చేస్తాను ..అని రోశయ్య గారి ఉవాచ..ఎలాగూ. ఓ నాలుగైదేళ్ళు తపస్సు చేస్తే గానీ.దేవత ప్రత్యక్ష్యమై.వరాలివ్వదని ఆయనకీ తెలుసు..దాదాపు 50 ఏళ్ళుగా తపస్సుచేస్తున్న అనుభవం ఆయనది..
నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
లేబుళ్లు:
andhra politics,
andhra pradesh,
andhra pradesh politics,
ap elections results,
ap politics,
bharat,
congress,
current affairs,
indian politicis,
latest issue,
manmohan singh
శనివారం, అక్టోబర్ 10, 2009
ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.....
ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.....
అదే సామెత గుర్తొస్తోంది...ప్రస్తుతం ఆంధ్ర పరిస్థితి చూస్తుంటే..ఒక పక్క ఇళ్ళు మునిగిపోయి జీవనం అస్తవ్యస్తమై పోయి జనం బాధ పడుతుంటే...
టీ వీ చానెళ్ళ వాళ్ళు ---అధికారులు స్పందించలేదు..జనం కష్టాలు పడుతున్నారు..దొంగల భయం..అదీ ఇదీ అంటూ కధనాలు...ఇప్పుడు ఏ ప్రాంతం మునుగుతుంది..ఏది తేలుతుంది..కాంగ్రెస్ వాళ్ల వల్లేనా ఇది అంతా అంటూ చర్చా కార్యక్రమాలు. ఒక్కళ్ళైనా...ఎమెర్జెన్సీ నంబర్లు స్క్రోఅలింగు వెయ్యడం కానీ..ఖాళీ చెయ్యాల్సిన ప్రాంతాల వివరాలు చెప్పడం కానీ జరిగిందా? ఎంతసేపూ జరిగే విషయాన్ని భూతద్దం లో చూపించి..అందరికన్నా ముందు మేము అనిపించుకోవడం తప్ప ..ప్రభుత్వాన్నో ఇంకోళ్ళనో విమర్శించడం తప్ప నిజంగా సామాజిక బాధ్యత తో ప్రవర్తించడం వీళ్లకి ఎప్పుడు వస్తుందో..ఎంతసేపూ మాకు డబ్బులు పంపండి..బట్టలు పంపండి అంటూ విడి విడి గా స్క్రోలింగులు ఇచ్చుకోవడం తప్ప..సరిగ్గా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్నేమన్నాయి..దానికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పింది..ఇదే చర్చ..చ చ.
టెక్నాలజీ పెరిగినా ఎందుకు సరిగా వినియోగించుకోలేక పోతున్నామో తెలీదు. ఏమీ లేని ఆ రోజుల్లోనే వరదలో ఇంకో విపత్తో వస్తే, ఆకాశ వాణి ద్వారా...ఎమెర్జెన్సీ సర్వీసుల వివరాలు..సహాయ శిబిరాల వివరాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ఎంతో మందికి సాయ పడ్డారు.
మరి ఈ నాటి మీడియా..?????
అటు రాజకీయాలు చూస్తే..ఇంతటి విపత్తు వచ్చినప్పుడు కూడా..కాంగ్రెస్ గవర్నమెంటు అవినీతి జల యజ్ఞ్మ్ వల్లనే ఈ విపత్తుకు కారణం అంటూ ప్రతిపక్షాలు..ఇది వరకు పాలించిన చంద్రబాబు విధానాల వల్ల నే అంటూ పాలక వర్గం ...కొట్టుకోవడానికే టైం సరిపోవట్లేదు. ఇలాంటి స్మయం లో నైనా కలిసి ప్రజలకు ఏమైనా చేస్తే బాగుంటుంది..కదా. ఇక మన కే సీ ఆర్ గారైతే ఇంకో అడుగు ముందుకేసి..జలయజ్ఞ్మ్ అవినీతి వారం రోజుల్లో బయటపెడతా..లేక పోతే ఉరేసుకు చస్తా అని ప్రకటించారు. సారూ కే సీ ఆరు..జనానికి ఇప్పుడు నిజాలు...అవినీతి గురించిన వివరాలు కాదు కావాల్సింది...తిండి, గుడ్డ ..గూడు...ఆరోగ్యం ...కుదిరితే ఆ విషయం ఆలోచించండి..ఏ ప్రాంతం వాళ్ళైనా ప్రబ్లెం ఒకటే...'వరద '. ముక్కు నేల కి రాస్తావా ? నేనైతే ఉరేసుకుంటా ...అంటూ చాలెంజ్ ఇప్పటికి ఎన్ని విషయాల్లో ఎన్ని సార్లు చేసారో గుర్తు తెచ్చుకోండి..ఎంత మంది తో ముక్కు రాయించారో..ఎన్ని సార్లు ఉరేసుకున్నారో ?
నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
లేబుళ్లు:
andhra pradesh,
andhra pradesh politics,
ap elections results,
ap politics,
chandrabaabu,
current affairs,
flood in ap,
floods,
kcr,
manmohan singh,
rosaiah,
sonia,
soniya
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)