Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com
andhra pradesh politics లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
andhra pradesh politics లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, మార్చి 22, 2019

శుక్రవారం, మే 03, 2013

పవర్ యాత్ర




ఈ మధ్య ఎక్కడ చూసినా యాత్రలు..పాద యాత్రలు..పవర్ యాత్రలే కనిపిస్తునాయ్ వినిపిస్తున్నాయ్.

అప్పట్లో పదండి దండి మార్చ్ కి అంటూ ఉప్పు సత్యాగ్రహం కోసం గాంధీ గారు పాదయాత్ర చేసారట

తరువాత అద్వానీ గారు రామ రధం మీద గల్లీ గల్లీ తిరిగి తిరిగి ఢిల్లీ చేరారు

ఆ మధ్య వై ఎస్ ఆర్ గారు పాదయాత్ర చేసి చేసి చివరకి సీ ఎం కుర్చీలో రెస్ట్ తీసుకున్నారు. రెండు సార్లు ముఖ్య మంత్రి అయ్యారు. ఆయన మరణించాక వాళ్ళబ్బాయీ..ఆయన జైలుకెళ్ళాక వాళ్ళ చెల్లాయి ఓదార్పు యాత్ర పేరుతో పాద యాత్రలు..బస్సు యాత్రలు చేసారు చేస్తున్నారు..

నిన్నటి దాకా మన చంద్ర బాబు గారు కూడా గుర్తు సైకిల్ ఐనా పాపం రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి ప్రస్తుతం ఎలక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇవి పాదయాత్రలా పవర్ యాత్రలా అంటే పవర్ కోసం యాత్రలా ?


వీళ్ళంతా పదవి లేనప్పుడు పదవి కోసం తిరగడమే తప్ప..పదవి లో ఉన్నప్పుడు ఎందుకు తిరగరో.. టైముండదనుకుంటా...అప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లెంసు, ఇంకా అవీ ఇవీ అడ్డొస్తాయి కాబోలు!

అందరూ పల్లె పల్లె తిరిగేసి..గుడిసె గుడిసే చూసేసి..బుగ్గలు నిమిరేసి..భోజనాలు చేసేసి..కష్టాలు వినేసి.. స్పీచులు ఇచ్చేసి.. వాగ్దానాలు చేసేసి.. సరాసరి పీఠం ఎక్కేసి.. ఐదేళ్ళు రెస్ట్ తీసుకుంటారు... జనం మాత్రం ఈ ఐదేళ్ళు గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ, పంచాయితీల చుట్టూ.. ఆఫీసర్ల చుట్టూ,,రేషన్ కొట్ల చుట్టూ, సంక్షేమ పధకాల చుట్టూ చేతిలో పాత్రతో పాద యాత్ర మొదలు..


కమాన్ కామన్ మాన్ గెట్ రెడీ ఫర్ పాద యాత్ర!










నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

శుక్రవారం, ఫిబ్రవరి 08, 2013

డిలే అండ్ రూల్


అధార్ కి కూడా డెడ్ లైన్ లేదట.. గవర్నమెంట్ చెప్పింది..
బ్రిటీషోళ్ళది డివైడ్ అండ్ రూలు ఐతే వీళ్లది డిలే అండ్ రూల్ లా ఉంది..



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

మంగళవారం, ఫిబ్రవరి 08, 2011

మొబిలిటీ-2

Chiranjeevi must be the first one to change the NETWORK without changing the Number (18). The new network he joined is "SONIATEL", where only Sonia tells..and bells..



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

మంగళవారం, డిసెంబర్ 22, 2009

నాల్కల్ కోస్తాం, ముక్కుల్ నేలకి రాస్తాం - హైడ్రామాబాద్

 నాల్కల్ కోస్తాం, ముక్కుల్ నేలకి రాస్తాం - హైడ్రామాబాద్ 

ఆహా ఈ రాజకీయ పరిభాష చూస్తుంటే, వింటుంటే అనాలేమో కానీ టీవీల్లో చూపిస్తున్నారు కదా. ఫరవాలేదు. ఎంత బాగుందో. అసలు వీళ్లు కొట్టుకునేదెందుకో అర్ధం కావట్లేదు. తెలంగాణా కోసం దీక్ష చేసిన కేసీ ఆర్ , ఒక పక్క ఒక్కడే చేసినా రాష్ట్రం మొత్త ఏకం చేసారు. మరి సమైక్యాంధ్ర కోసం చేసే దీక్ష తలొకళ్ళు తలా ఒక చోట ఎందుకు చేస్తున్నట్టు ? ప్రస్తుతానికి హైదరాబాదే కదా రాజధాని. ప్రతీ ఒక్కరూ హైదరాబాద్ కోరుకుంటున్నారే తప్ప. అసలు విషయం అర్ధం కావట్లేదు. ఎక్కడో పుట్టిన వాడు ఏ డిల్లీకో, బాంబేకో, చెన్నై కో వెళ్ళి బతకట్లేదా? ఎక్కడ పని దొరుకుతుందో, సుఖం గా ఉంటుందో, అన్ని సదుపాయాలూ ఉంటాయో అక్కడ బతకాలనుకుంటాడు ప్రతీ మనిషి. బతకడం మొదలెట్టాక శాశ్వత నివాసం కోసం చూస్తాడు , తరువాత ఆస్తులు కూడబెడతాడు. కాలవ గట్టున ఉన్నవాళ్ళని ఖాళీ చేయించినట్టు..ఉన్న పళాన వెళ్ళి పో అంటే ఎక్కడికెళతాడు. ఇక్కడే ఉండనిస్తే రాష్ట్రం వస్తే ఆ రాష్ట్ర వాసి గా ఉంటాడు..లేదా పాత జీవితం కొనసాగిస్తాడు. ప్రభుత్వం తో పోరాడండి. సరైన నిర్ణయం తీసుకోండి..ప్రజలకి మంచి చెయ్యండి. అంతే కానీ మీలో మీరు కొట్టుకుని..ప్రజలను కంఫ్యూజ్ చేసి ..ఏమి జరుగుతున్నదో..అర్ధం కాకుండా..ఎవరో బ్రిటీషు వాళ్లతోనో.పాకిస్తాను వాళ్ళతోనో పోరాడినట్టు మన వాళ్ల మీద మనమే పోరాడడం ఎంత వరకూ సమంజసమో ఆలోచించండి. హోటళ్ళు మూసేసి, పేర్లు మార్చేసి, సినిమాలు ఆపేసి, బస్సులు పగల కొట్టి, ఆత్మాహుతులు చేసుకునీ కాదు..ఎందుకు చేస్తున్నాం, ఏమి సాధిస్తాం, అన్నది ప్రజలకి తెలిసేలా చెప్పండి. టీ వీల్లో చర్చల్లో..మోహన్ బాబు ఇలా అన్నాడు...కే సీ ఆర్ అలా అన్నాడు అని ఒక వ్యక్తి ప్రకటనలు, భావావేశం లో అన్న మాటలూ, గురించి టైం వేస్టు చేసుకుని, వాళ్ళ రేటింగులు పెంచి, వార్తలకో - ప్రకటనలకో సమయం అవగానే అర్ధాంతరంగా ఆగిపోయే చర్చలతో ఎందుకు కొట్టుకుంటారో అర్ధం కావట్లేదు.. విధ్వన్సానికి భయపడో..ఆస్తులు నష్టం అవుతాయనో మూసేస్తున్నారా..లేక నిజంగానే స్వచ్చందం గా మూస్తున్నారా మీరు చేసే బందులకి, ఇంట్లోంచి బయటకు రావాలంటే భయమేస్తోంది.ప్రతీ ఒక్కరికీ, NIMS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్ గా మారుతోంది. హైదరాబాద్ హైడ్రామాబాద్ గా మారుతోంది. సోనియా ఏమంటుందో తేలేదాకా ఇదే పరిస్థితి. ఏమనాలో..ఏమనుకోవాలో..ఏం జరుగనుందో ...అంతా సోనియా దయ.



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

గురువారం, నవంబర్ 05, 2009

మాయాజాలం

మాయాజాలం
తిరుపతి లో ఆంధ్ర మెజీషియన్ లు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఇంద్రజాల సభలు జరుగుతున్నాయి. ఆశ్చర్యమేమిటంటే ఇక్కడ ఇంకా పెద్ద స్థాయిలో ఇంద్రజాలం జరుగుతోంది. పీ సీ సర్కార్ సీనియర్ తరువాత ఆయన పరంపరని కొనసాగించాడు జూనియర్ పీ సీ సర్కార్...కానీ.ఇక్కడ సీనియర్ వై ఎస్ 'సర్కార్ ' తరువాత జూనియర్ వై ఎస్ కి అలా జరగలేదు. రాజకీయమనే ఇల్ల్యూజన్ లు ఇంకా వంటబట్టించుకోకపోవడమే దీనికి కారణమనుకుంటా...రక రకాల బిజినెస్సుల్లో బిజీ గా మెస్సై పోవడం వల్ల...కాబోలు.


సీనియర్ సర్కార్ రాష్ట్రమంతటా పర్యటించి...తన ఇందిరాజలం తో జనాల్ని సమ్మోహితుల్ని చేసి ఎసెంబ్లీ హౌసు ఫుల్లు కాక పోయినా కలెక్షన్ కి సీ ఎం సెలెక్షన్ కీ కావాల్సినంత చేసుకోగలిగాడు..ఐతే..పావురాల గుట్ట ????... మెజీషియన్ లు ఎక్కువగా పావురాలతోనే మేజిక్ చేస్తారు. అక్కడ అనుకోంది దుర్ఘటన తో..అందరికీ దూరమైనాడు. కానీ ఆయన కొనసాగింపు..వారసుడికి రాలేదు. సాధారణంగా వారసత్వాన్నే పౌరసత్వంగా భావించే కాంగ్రెస్ ఈ సారి ఎందుకనో? అలా జరక్కుండా..పీఠం జారకుండా జాగ్రత్త పడ్డారు.
బడ్జెట్ మంత్రిగారు..అదే ఆర్ధిక మంత్రిగారు..ఎలాగూ జిమ్మిక్కులు..అప్పులు-ఆస్తుల మేజిక్కులు..ప్రతిపక్షం వారిని నోరుమూయించగల లాజిక్కులు చాలా తెలుసు కాబట్టి..నెమ్మదిగా.ముఖ్య.మంత్ర దండం అందుకుని తిప్పుతున్నారు.


ఎలాగూ టోపీల్లోంచి వచ్చేవి 'కుందేళ్ళే " గనక ఖంగారు లేకుండా...నడిపించేస్తున్నారు రోశయ్య గారు. ఇండియన్ రోప్ ట్రిక్కు లాగా అందరినీ ఒక్క తాటి మీద నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కొరకరాని కొండ లుంటే,,డబ్బా లో పెట్టి మాయం చెయ్యగల సమర్ధులు. వారు.


ఢిల్లీలో చూద్దామా అంటే ...సీనియర్ వై ఎస్ సర్కార్ కి మేనేజర్ ఐన కె వీ పీ గారికి ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి..మేనేజ్మెంట్ లేకుండానే షో నడుస్తోంది..సోనియా చూస్తే ఫ్యూచర్ ప్రోగ్రాం గురించి చెప్పటం లేదు. గట్టిగా అడిగితే మేనేజర్గిరీ కే ప్రమాదమేమో కూడా.


మొత్తానికి..ప్రస్తూం ఆంధ్ర గవర్నమెంటు 'జంతర్ మంతర్ ' తిరుపతిలో జరగనున్న జాతీయ ఇంద్రజాలికుల సదస్సుకి శుభాభినందనలు శుభాకాంక్షలతో ..


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శుక్రవారం, అక్టోబర్ 30, 2009

రాజీ నామా

 రాజీ నామా
ఏమిటి సీ బ్లాకు దగ్గర హడావిడి..కెమేరాలు..పాత్రికేయులు..న్యూసెన్స్ చానెళ్ళు అంతా విడి విడి గా..కలివిడి గా హడావిడి..మాట్లాడేసుకుంటున్నారు. మళ్ళీ ఏ బిల్డింగైనా కాలిపోయిందా..కూలిపోయిందా అని డౌటొచ్చేసింది..కాదు కొండ గురించిన మాటలు జరుగుతున్నాయక్కడ.

ఇది మార్పుల వేళయనీ..జగనన్న మాసమనీ తొందరపడి ఒక కోయిలా డిజైను చూసింది...రెజైను చేసింది...వెనకాల బాక్ గ్రౌండులో పాట వినిపిస్తోంది.

కానీ,,ముఖ్య మంత్రి గారు మాత్రం...

లేదు..కాదు..తెలీదు..ఇదేలే గవర్నమెంటాఫీసులో రెడీమేడ్ సమాధానం
ఏ ఫైలు ఎక్కడుందో చెప్పడం ఒక పెద్ద అవధానం
సంతకానికీ పంపకానికీ మధ్య ఒఖ్ఖ ఏడాదే వ్యవధానం
వాళ్ళు నిత్యం పాటించే సూక్తి "నిదానమే ప్రధానం "

ఇది మన రోశయ్య గారికి బాగా వొంట పట్టినట్టుంది. ఇనుమైనా వేడిమీద ఉన్నప్పుడు కొడితే పనౌతుంది..చల్లారాక వంచడం కష్టం అని తెలుసు కాబట్టి...నెమ్మదిగా..వేడి తగ్గేదాకా ఆగారు...ఇప్పుడు సోనియా ఆశీస్సులతో నెట్టుకొచ్చేస్తున్నారు.

రాజీనామాల పేరుతో ఎదిరించిన వారూ బెదిరించిన వారూ..కూడా ప్రస్తుతం రాజీ మార్గం పట్టి..సోనియా ఏం చెప్తే అదే అంటున్నారు..కొండకు దారమేస్తే..కొండా సురేఖ రాజీనామా దాకా వచ్చింది..కదా మరి
వై ఎస్ మరణం తరువాత వేడెక్కిన రాజకీయాల మీద వరద పోటు రావడం వల్ల చల్లారిపోయి..జగన్ భవిష్యత్తు సీ ఎం గా మిగిలిపోయాడు..ప్రస్తుత....మౌనమే దానికి 'సాక్షి '.

ఏం మంత్రి గారు,,మీరెటు ? ఆ చేతిలోది ఏమిటి...
ఔను రాజీనామా నే కాకపోతే...రాజీ అని నామానాన నేను పని చేసుకు పోతాను అని రాశా..అంతే...
అవతల ముఖ్యమంత్రిగారి మంత్రివర్గ విస్తరణలోగా ఈ కాగితం అందకపోతే..ఇక నేనూ ఇంటికి మార్గం పట్టాల్సిందే..అనుకుంటూ హడావిడిగా ఎవరికి వారు విడి విడి గా విడిది గృహం బయలుదేరారు.
గవర్నరు గారు రెడీ గా ఉన్నారా ప్రమాణ స్వీకారం చేయించడానికి..మళ్ళీ చానెల్స్ కి బోల్డంత..న్యూసు..మనకి న్యూసెన్సు...చూస్తూనే ఉండండి ,,,మాకు తోచింది చూపిస్తాం...



నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శుక్రవారం, అక్టోబర్ 23, 2009

గెలిచిన వేళనే చూడాలీ

 గెలిచిన వేళనే చూడాలీ ..నాయకుని ముఖమున వెలుగూ.....
 
ఆహా ఇంద్రప్రస్థ పురము న...10, జనపధ మార్గము ..ఇట్లు వెలిగిపోవుచున్నదేమి..ఆహా దీపావళి పండుగ మరలా వచ్చినదా ఏమి..అని ఆకాశమునుంచీ దేవతలు ఆశ్చర్యమున చూచుచున్నారు.

నాలుగు దినముల క్రితము ఐపోయిన పండుగ వాతావరణం మళ్ళీ ..డిల్లీలో కనిపించింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి..కాంగిరెస్సు వారు ఆనందోత్సాహాలతో సోనియా మాత గుడికి వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నారు. మాత దర్శనం కోసం క్యూ కాంప్లెక్సు లో వైటింగు చేస్తున్నారు.

ఇటు ..జగన్ కూడా 'ఆ ' పని మీద అమ్మగా(వా)రి దర్శనం కోసం వెళ్ళాడు. జ్యోతి దర్శనం కోసం బయలుదేరినట్టు..అందరు...తలో మార్గం లో ప్రయాణిస్తున్నారు. ఐతే ప్రసాదం ఎవరికి దక్కుతుందో ..అక్షింతలు ఎవరకి పడతాయో..చూడాలి మరి.

ఇన్నాళ్ళు 'జగనంత కుటుంబం మాదీ' ..అన్న వాళ్ళు కాస్తా..ఇప్పుడు.  రోషాలకు..పాశాలకు పోకుండా ..రోశయ్య గారు చెప్పినట్ట్లు నడుచుకుంటున్నారు..సంతకాలు ఎందుకు పెట్టామో కూడా తెలీదు అని చెప్పారు కొందరు మహానుభావులు..అంతే లే ఇవి 'మామూలే '

జిల్లాకి పేరుపెట్టి...రాష్ట్రం సంగతి నే చూసుకుంటాలే అని చెప్పకనే చెప్పారు..ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు..ఆలస్యం అమృతం విషం అని ముందే కూసిన కోయిలలు..గవర్నమెంటు పనులలో నిదానమే ప్రధానం అన్న సూక్తి మాత్రమే వర్కౌట్ అవుతుందని తెలిసేలోగా...జరగాల్సినవి జరిగిపోతున్నాయి..బీ బ్లాకునుంచీ సీ బ్లాకుకి..

నేను నిమిత్త మాత్రుణ్ణి..దేవత ఏమి చెబితే అది చేస్తాను ..అని రోశయ్య గారి ఉవాచ..ఎలాగూ. ఓ నాలుగైదేళ్ళు తపస్సు చేస్తే గానీ.దేవత ప్రత్యక్ష్యమై.వరాలివ్వదని ఆయనకీ తెలుసు..దాదాపు 50 ఏళ్ళుగా తపస్సుచేస్తున్న అనుభవం ఆయనది..


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శనివారం, అక్టోబర్ 10, 2009

ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.....

ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.....


అదే సామెత గుర్తొస్తోంది...ప్రస్తుతం ఆంధ్ర పరిస్థితి చూస్తుంటే..ఒక పక్క ఇళ్ళు మునిగిపోయి జీవనం అస్తవ్యస్తమై పోయి జనం బాధ పడుతుంటే...
టీ వీ చానెళ్ళ వాళ్ళు ---అధికారులు స్పందించలేదు..జనం కష్టాలు పడుతున్నారు..దొంగల భయం..అదీ ఇదీ అంటూ కధనాలు...ఇప్పుడు ఏ ప్రాంతం మునుగుతుంది..ఏది తేలుతుంది..కాంగ్రెస్ వాళ్ల వల్లేనా ఇది అంతా అంటూ చర్చా కార్యక్రమాలు. ఒక్కళ్ళైనా...ఎమెర్జెన్సీ నంబర్లు స్క్రోఅలింగు వెయ్యడం కానీ..ఖాళీ చెయ్యాల్సిన ప్రాంతాల వివరాలు చెప్పడం కానీ జరిగిందా? ఎంతసేపూ జరిగే విషయాన్ని భూతద్దం లో చూపించి..అందరికన్నా ముందు మేము అనిపించుకోవడం తప్ప ..ప్రభుత్వాన్నో ఇంకోళ్ళనో విమర్శించడం తప్ప నిజంగా సామాజిక బాధ్యత తో ప్రవర్తించడం వీళ్లకి ఎప్పుడు వస్తుందో..ఎంతసేపూ మాకు డబ్బులు పంపండి..బట్టలు పంపండి అంటూ విడి విడి గా స్క్రోలింగులు ఇచ్చుకోవడం తప్ప..సరిగ్గా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్నేమన్నాయి..దానికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పింది..ఇదే చర్చ..చ చ.
టెక్నాలజీ పెరిగినా ఎందుకు సరిగా వినియోగించుకోలేక పోతున్నామో తెలీదు. ఏమీ లేని ఆ రోజుల్లోనే వరదలో ఇంకో విపత్తో వస్తే, ఆకాశ వాణి ద్వారా...ఎమెర్జెన్సీ సర్వీసుల వివరాలు..సహాయ శిబిరాల వివరాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ఎంతో మందికి సాయ పడ్డారు.
మరి ఈ నాటి మీడియా..?????

అటు రాజకీయాలు చూస్తే..ఇంతటి విపత్తు వచ్చినప్పుడు కూడా..కాంగ్రెస్ గవర్నమెంటు అవినీతి జల యజ్ఞ్మ్ వల్లనే ఈ విపత్తుకు కారణం అంటూ ప్రతిపక్షాలు..ఇది వరకు పాలించిన చంద్రబాబు విధానాల వల్ల నే అంటూ పాలక వర్గం ...కొట్టుకోవడానికే టైం సరిపోవట్లేదు. ఇలాంటి స్మయం లో నైనా కలిసి ప్రజలకు ఏమైనా చేస్తే బాగుంటుంది..కదా. ఇక మన కే సీ ఆర్ గారైతే ఇంకో అడుగు ముందుకేసి..జలయజ్ఞ్మ్ అవినీతి వారం రోజుల్లో బయటపెడతా..లేక పోతే ఉరేసుకు చస్తా అని ప్రకటించారు. సారూ కే సీ ఆరు..జనానికి ఇప్పుడు నిజాలు...అవినీతి గురించిన వివరాలు కాదు కావాల్సింది...తిండి, గుడ్డ ..గూడు...ఆరోగ్యం ...కుదిరితే ఆ విషయం ఆలోచించండి..ఏ ప్రాంతం వాళ్ళైనా ప్రబ్లెం ఒకటే...'వరద '. ముక్కు నేల కి రాస్తావా ? నేనైతే ఉరేసుకుంటా ...అంటూ చాలెంజ్ ఇప్పటికి ఎన్ని విషయాల్లో ఎన్ని సార్లు చేసారో గుర్తు తెచ్చుకోండి..ఎంత మంది తో ముక్కు రాయించారో..ఎన్ని సార్లు ఉరేసుకున్నారో ?



నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

సోమవారం, సెప్టెంబర్ 21, 2009

తుమ్మెద


'తుమ్మెద' అంటే .....అదేదో పూల మీద వాలే 'తుమ్మెద' అనుకునేరు. ఇది జలుబు వల్ల వచ్చిన వైరస్ తో కూడిన తుమ్ము...'తుమ్మెద' అంటే...నాలుగు మైళ్లు పరిగెడుతున్నారు..ప్రజలు.

భారత దేశం లో అస్సలు పారిసుద్ధత ఉండదు...అంతా చెత్త...ఇక్కడ జనాలకు ఆరోగ్య సూత్రాలు తెలీదు అనే విదేసీయుల్ని...కొందరు స్వదేశీయులనీ చూస్తుంటే ఆస్చర్యమేస్తుంది. ఎందుకంటే...ఈ మధ్య వచ్చిన జబ్బులు ఐడ్స్, బర్డ్ ఫ్లూ, ఆంత్రాక్స్, స్వైన్ ఫ్లూ ఇంకా కొన్ని రకాల జబ్బులు..అన్నీ విదేశియులు మనకిచ్చిన కానుకలే..అవి అక్కడ నుంచీ దిగుమతి ఐన మహమ్మారులే.......మనవి కావు అని మనవి చేస్తున్నా.

సుబ్బరంగా వయసు వాచ్చాక పెళ్ళి...ఒకరే పెళ్ళాం,,,,హాయిగా సంసారం...పిల్లలు..ఇదీ మన సంప్రదాయం...కొన్ని రోజులు కలిసుండీ...ఒక్కోసారి ఏళ్ళతరబడి కూడా..నచ్చితే పెళ్ళి...నచ్చకపోతే...చెల్లు..అంటూ వదిలేసే డేటింగు వాళ్ళ విధానం..దేనివల్ల నష్టం....ఐడ్స్ కష్టం..అన్నది జనాలే నిర్ణయించుకోవాలి.

చిన్నప్పటినుంచీ తుమ్మొస్తే..చెయ్యి అడ్డం పెట్టుకోమని మనం పిల్లలకి నేర్పుతాం,..ఇప్పుడూ అదే చెబుతున్నారు...కాకపోతే..చెయ్యి స్థాయి నుంచీ...మాస్కు స్థాయి వరకు వచ్చింది..ఇంకా ఇప్పుడు అవతల వాడు తుమ్ముతుంటే..మనం అడ్డు పెట్టుకోవాల్సి వస్తోంది..దీనికి మందు...మన హోమియోలోనే ఉందిట..ఎప్పుడూ పాస్చాత్యుల్ని చూసి ఇన్ ఫ్లు యెన్స్ అవుతామనఒ ఏంటో దాని పేరు కూడా ఇంఫ్లుయెంజా...ట..అంతే కాదు..తులాసాకు, వేపాకు వేడి నీళ్లలో వేసి వాసన చూసినా తగ్గుతుందట...మరి.

ఈ మధ్య వస్తున్న చాలా జబ్బులు..పేర్లు కూడా కొన్ని తెలీవు..కిడ్నీ లో రాళ్ళు, గాలిబ్లాడర్ లో రాళ్ళు,,.ఊబకాయం వొళ్ళు....ఇంకా చాలా..... కేవలం ఆహార పద్ధతుల వల్లే పెరుగుతున్నాయట. క్యాబేజీ...టమాటా....లాంటివి ఎక్కువేసి చేసిన...సాండు విచ్(ఇసుక దెయ్యం అనొచ్చేమో), చీజ్ వేసిన బర్గర్లు..పిజ్జాలు...లాంటి ఫుడ్డు ఎక్కువయ్యాకనే ...ఇలాంటి జబ్బులూ పెరిగాయి అని చెప్పడానికి సర్వేలు అక్కర్లేదేమో..
లావు తగ్గడానికి ఏమి చెయ్యాలి డాక్టర్ అని పేరొందిన..కార్పొరేట్ హాస్పిటల్ లో ఫారిన్ లో ట్రైన్ అయి ఫ్లైట్ లో వచ్చిన డైటీషన్ ని అడిగితే...ఎల్ డీ ఎల్...వీ డీ ఎల్,,హెచ్ డీ ఎల్...లిపిడ్ ప్రొఫైల్ లాంటి వంద టెస్టులు చేసి..
ఫాట్ ఫూడ్డు తగ్గించండి..ఆయిల్స్ తినకండి...పచ్చి కూర ముక్కలు..కీరా..కారట్ తినండి...మొలకెత్తిన ధాన్యాలు తినండి..రాగి/ఓట్స్, లేక పోతే ఆకుకూరల గంజి తాగండి (ఇంగ్లీసులో సూప్ అంటారు)...రోజూ నడవండి...అంటూ కారులో వచ్చిన వాణ్ణి ఫీజు గుంజి...స్వంత కాళ్ళ మీద నడిపిస్తారు...

సో నే చెప్పొచ్చేదేంటంటే..మన పద్ధతుల్లో మనం ఉంటే.....ఏ ప్రాబ్లెంసూ రావు.
కష్టం లో ఉన్న భూమిని (పంది) వరాహ రూపం లో ఆదుకున్న వేద భూమి మనది...పందుల వల్ల స్వయన్ ఫ్లూ...వ్యాపింపచేసే..విదేశీ అనుకరణలొద్దు మనకి.




నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మంగళవారం, సెప్టెంబర్ 15, 2009

కెలక్కు

వెన్న ముద్దలు అనే పుస్తకంలో ప్రముఖ రచయిత జనార్ధన మహర్షి అన్నారు..ఇష్టం లేక పోతే ఉలక్కు పలక్కు కానీ కెలక్కు...అని...ప్రస్తుతం కాంగ్రెస్ అధిస్టాన వర్గం అదే చేస్తోంది. ప్రస్తుతం ఆంధ్ర లో రాజకీయ అనిస్చితి చూసి....ఏం చెయ్యాలో తెలీక...ఏదో ఒకటి చేసేయలేక..ఎదురుచూస్తోంది.

సోనియా నే అన్నీ చూసుకుంటారు..సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు అని మిగిలినవాళ్ళు చెబుతున్నా....'ఆ' నిర్ణయం ఏంటో ఇంకా ఆవిడకి కూడా అంతుబట్టటం లేదు. ఇన్నాళ్ళూ అన్ని తానే అయి నడిపించిన రాజసేఖరుడు స్థానాన్ని ఎవరికి ఇవ్వాలో తెలియక తిక మక పడుతున్నారు.

మొన్నేమో జగనే సీ ఎం అన్నవాళ్ళు ఇప్పుడు కొంచెం గేప్ ఇచ్చారు. అటు కే వీ పీ...హైదరాబాదు..డిల్లీ తిరిగి తిరిగి విసిగి ఉన్నారు..ఇన్నాళ్ళూ వెనకుండి నడిపించిన ఆయన ప్రస్తుతం ముందు జరగవలసిన దాని గురించి మల్ల గుల్లాలు పడుతున్నారు.

ఏమిటో ...ప్రస్తుతం రోశయ్య గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా ఉన్నా...అలా ఉండడం ఆయనకూ ఇస్టం ఉండదు...ఐతే మొత్తం అవాలి లేదా ఊరుకోవాలి...





నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శనివారం, సెప్టెంబర్ 05, 2009

' ప్రజా ' శేఖర్ రెడ్డి= ప్రజా సేవకు రెడీ అనే రాజ శేఖర్ రెడ్డి

ప్రజా సేవకు రెడీ అనే రాజ శేఖర్ రెడ్డి ఇక లేరు...ఇది ఇవ్వాళ ఏ పేపరు చూసినా..న్యూస్ చానెల్ పెట్టినా కనిపించిన హెడ్ లైను.కానీ ఆయన మనందరి మనసుల్లో ఉన్నాడు. ఇంత ఏ ముక్యమంత్రి మరణానికీ పక్క రాష్ట్రాలు కూడా శలవు ప్రకటించలేదు..అంటే ఆయనకున్న మంచి పేరు ఎలాంటిదో అందరికీ అర్ధం అవుతుంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రచ్చబండ కి వెళుతూ.తరలి రాని లోకాలకు వెళ్ళిపోయాడు ఆ మహా మనిషి.

ప్రజా సేవకు రెడీ అనే ఆ రాజ శేఖరుడు...కాలిబాటన రాష్ట్రం నలుమూలలా పర్యటించి..రాజధానికి రాజుగా చేరుకున్నాడు. పల్లెలో వెతలు చూసి ఉచిత కరెంటు ఇచ్చాడు, పల్లె బాటలో జనాన్ని చూసి రెండు రూపాయలకు బియ్యం ఇచ్చాడు. డాక్టరు కావడం వల్ల..తన ఆరాధ్యమైన రాజీవ్ పేరిట ఆరోగ్య శ్రీని అందించాడు...ఇందిరమ్మ ఇళ్ళు కట్టించి...కష్టించే వాళ్ళకూ గూడు అందించాడు. కూడు.గూడు..ఆరోగ్యం ....అందించాడు..ప్రాజెక్టులు కట్టి..పూర్తి చేసాడు...తలచిన పని చేసుకు పోవడమే కానీ వెను తిరిగి చూడని ధీశాలి.

ఇంకా ఎన్నో చేయాలనుకున్నా....మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఆ పనులు ఇంక ఎవరు చేస్తారో వేచి చూడాలి. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని ఆశిస్తూ






నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మంగళవారం, అక్టోబర్ 28, 2008

ఇన్ ఫ్రంట్ క్రోకడాయల్ ఫెస్టివల్...

ఇన్ ఫ్రంట్ క్రోకడాయల్ ఫెస్టివల్...
హౌస్ పెయింటింగ్ ఫెస్టివల్ నాట్...ఇల్లు అలకగానే పండగ కాదు..ఇంగ్లీష్ లో చెప్పమంటారు
...చెబితే అర్ధం కాదు..అని శంకర్ దాదా అన్నట్టు గుర్తు....సినిమా ఓపెనింగ్ కి తిరుపతి చేరిన
అభిమాన 'ప్రజా' వాహిని చూసి ఆనందిస్తున్నారు...
ఇక శ్రీకాకుళ యాత్ర తో రాజకీయ 'రహ దారులు ' ఎలా వుంటాయో కొంచెం అవగతమై
వుంటుంది..ళైట్లలో షూటింగులు,,ఫైట్లలో తగిలే దెబ్బలు..అలవాటైన వాడు కాబట్టి కొంచెం
తట్టుకోగలిగినా..జనం చూపించిన ప్రేమ వల్ల బాగానే నెట్టుకొచ్చారు...యాత్రని..
అయితే రానున్న ఎన్నికలు..పోటీలు..సీట్లు..కేటాయింపులు..లాంటి తలనొప్పులు ఇంకా చాలా
ఉన్నాయి..పండక్కి రిలీజయ్యే పెద్ద హీరోల సినిమాల మధ్య పోటీలా, ప్రస్తుతం అన్ని రాజకీయ
పార్టీలూ..తమ తమ హీరోలని సినిమా వాళ్ళని దింపే ప్రయత్నాలలో ఉన్నారు..మెగా 'స్టారు ' కన్నా
మా 'సారు ' 'వై ఎస్సారు ' కే పాపులారిటీ ఎక్కువ అని బింకం గా చెబుతున్నా సూపర్ స్టారు క్రిష్ణ,
యువరాజు..మహేషుని,,సహజ నటి 'జయ ' సుధ, యాంగ్రీ యంగ్ మాన్ మరో 'రాజ సేఖర్ ' ఆయన
'జీవిత ' భాగ స్వామి, ధర్మవరపు, లాంటి వారిని తమ బెటాలియన్ లో చేర్చుతున్నారు
(సోనియా)గాంధీ భవన్ నాయకులు..
మరో పక్క తెలుగు దేశం వాళ్ళు నందమూరి సిం హాలు "గర్జించడానికి" గుంటూరు లో సన్నాహాలు
చేబట్టినాయి..కాక పోతే..'కాక ' మీద ఉన్న నందమూరి అభిమానులు 'బాలయ్య 'ను కాబోయే సీ ఎం
గా చూడాలనుకుంటున్నారు..యువ సిమ్హాలు కూదా బాబు గురించి కాక బాబాయి గురించే ఎక్కువ
చెబుతున్నారు.... 'గర్జన ' సంగెతెలా ఉన్నా ఈ విషయం మీద తర్జన భర్జన పడుతున్నారు ప్రస్తుతం
ఎన్ టీ ఆర్ ట్రస్ట్ భవనం లో
మరో పక్క ఎవరు తమ పార్టీకి ఎక్కువ కోటా సీట్లిస్తారో ఈసారి ఎవరికి మద్దతిస్తారో తెలీక బీపీ పెరిగిన
బీజేపీ తమ వంతుగా కోటా, కృష్ణం రాజు..ని నమ్ముకుంటున్నారు..
టీ ఆర్ ఎస్ లో హీరో ఒకే ఒక్కడు కే సీ ఆర్..ఎన్ టీ ఆర్, వై ఎస్ ఆర్, మెగా స్టార్ ఎవరొచ్చినా సరే,
ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే సింగిల్ హాంద్ కే సీ ఆర్..అంటూ ఒంటరి పోరాటం చేస్తున్నా..తెలంగాణా
కి సై అంటే ఎవరైనా ఓకే అంటున్నారు...
ఇక బరిలో ఉన్న ఏకైక హీరోయిన్ 'విజయ ' శాంతి..తల్లి తెలంగాణా కోసం పోరాడుతోంది..
ఇవన్నీ ఇలా ఉంటే నాకర్ధం కాని విషయం ఒకటుంది..చిన్న గల్లీలోనైనా..చిన్న టీ వీ షూటింగు జరిగినా విరగబడి చూసే జనం,, బట్టల షాపు ఓపెనింగులకి
హీరోయిన్లు వస్తే రోడ్డు నిండా ఆగి చూసే జనం..స్టూడియోల ముందు నిలబడి కారులో ఉన్న తమ
హీరోలని నల్ల అద్దాల్లోంచి చూసి ఆనందించే జనం..హీరో ఇంట్లో పెళ్ళి వేడుకలైతే ఎదురుగా కరెంటు
పోలెక్కి చూసే జనం...(నిజంగా కనపడుతుందా అని కూడా ఒక డౌటు) ...ప్రజా అంకిత సభలకి,,
గర్జనలకి, హాజరయ్యే జనం ..వాళ్ళ అభిమానం వోటుగా మారుతుందా అని? అసలు వాళ్ళు వెళ్ళే
సరికి వాళ్ళ ఓటు ఇంకా ఉంటుందా అని...కాంగ్రెస్స్ లో ఎన్ టీ ఆర్ అభిమానులు, తెలుగు దేశంలో
చిరంజీవి అభిమానులు ఇలా ఉండరా అని...
నిన్నటి దాకా షూటింగు కి కొబ్బరికాయ కొట్టిన దగ్గరనుంచీ గుమ్మడికాయ కొట్టే వరకు హడావిడి
చేసి..ఆడియో రిలేజు నుంచి సినిమా రిలీజు వరకు ఎంజాయ్ చేసి..ధియేటర్ లకి రంగులేసి..కటౌట్లకి
దండలేసి..పోస్టర్ లకి తిలకాలు దిద్ది..టికెట్లకు లైనులో నిలబడి సినిమాలో విజిల్సు వేసి..వంద
రోజుల ఫంక్షను కోసం ఎదురు చూసే అభిమాని రక్తం పంచుకు పుట్టక పోయినా రక్తం పంచే
కార్యక్రమంలో పాల్గొన్న తమ్ముళ్ళ లాంటి అభిమాని ఇప్పుడు సడెన్ గా కార్యకర్తగా మారి..పార్టీ జెండా
పట్టుకుని వొట్లేసే చోట లైనులో నుంచొని..(కటౌట్లు పోస్టర్లు మామూలే) వోట్లేసి గెలిపించే పని ఎంత
త్వరగా నేర్చుకుంటారో మరి...
నిజంగా అభిమానులకి తమ హీరో చేసేవి 'అన్నీ ' నచ్చితే హీరో ఎంతో 'ఇష్టపడి ' కష్టపడి చేసిన ప్రతీ
సినిమా హిట్ అవ్వాలి కదా..ఈ సినిమా ఫ్లాప్ అయితే మరో ఏడాదికి కొత్త సినిమా వస్తుంది..కానీ
రాజకీయాలలో ఎన్నికల సినిమా ఫ్లాప్ అయితే ఐదేళ్ళ వరకూ మరో సినిమా ..కష్టమే..
పార్టీలో కూడా తన అభిమానులు..అభిమాన సంఘం అధ్యక్షుడు, ఇతర పార్టీలనుంచీ జాయిన్ అయ్యే
రాజకీయ నాయకులు,,మేధావులు..బడుగు వర్గాల నాయకులు...లాంటి వారందరిలో ఎవరికి టికెట్టు
ఇవ్వాలో కొంచెం కష్టమైన పనే...

శనివారం, ఆగస్టు 09, 2008

ఒలంపిక్స్

ఒలంపిక్స్
ఒలంపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే అందరూ ' బీజింగ్ ' అంటారేమో..కానీ అసలు ఒలంపిక్స్ జరుగుతున్నది మాత్రం మన ఆంధ్రా లో..ఔను నిజం ఆంధ్రాలోనే..08-08-08 అని ప్రపంచమంతా ఎదురుచూస్తుంటే..ఆంధ్రా ప్రజానీకం మాత్రం కొత్త రైలు కోసం ఎదురుచూసింది...కానీ ఎందుకో చిరు రైలు లేటైంది...ఏం ? ఎందుకు ? అంటే చిరు మందహాసమే సమాధానం,,,,అందుకే ఆ టాపిక్ వదిలేసి..ఒలంపిక్స్ వైపుకొచ్చా....

మన క్రీడలు..
జిమ్నాస్టిక్స్ : ఈ ఆటకి ప్రాతినిధ్యం వహిస్తున్నది కాంగ్రెస్..అధికారం లో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేస్తున్నాం అని నిరూపించుకోవడానికి ఆరోగ్యశ్రీ .. రెండు రూపాయల కిలో బియ్యం మంచినీటి పధకం అని రకరకాల విన్యాసాలు చేసి ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు..ఈ విన్యాసాలు అప్పుడప్పుడు సోనియాని ఆకట్టుకోవడానికి కూడా చేసి చేసి బాగ ప్రాక్టీసులో వున్నారు...
హాకీ : తెలంగాణాకి వ్యతిరేకం కాదు..మాది ఎప్పటికీ సమైక్యవాదమే...అవసరమైతే తెలంగాణా ఇస్తాం..కలిసి వుంటే కలదు సుఖం...అంటూ తెలంగాణా వాదం తో డ్రిబ్లింగ్ చేస్తూ ముందుకు వెళ్తోంది తె దే పా..
పోల్ వాల్ట్ : పరిగెత్తుకుంటూ వచ్చి ప్రత్యేక తెలంగాణా అనే కర్రతో సడంగా ఎగిరి నవతెలంగాణా లో దూకిన దేవేందర్ పతకం గెలుస్తాడో లేదో pole తోనే తెలుస్తుంది
కో కో : కాసేపు సోనియాతో భేటీ..తరువాత కో చెప్పి చంద్రబాబు తో మంతనాలు..ఆ తరువాత చిరంజీవితో కబుర్లు..మొత్తానికి తెలంగాణా తెస్తాం అంటూ కో కో ఆట ఆడుతున్నారు తె రా స
రన్నింగు : ఎన్ని పార్టీలున్నా ఎన్ని గొడవలున్నా ఎన్ని సమస్యలున్నా బంగారు పతకం - బంగారం లాంటి పాలన మాదే అంటూ రిలే "పరుగు " పందెం లో ముందుకొస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి..
స్విమ్మింగు : ఏతకొలనులో ఎటువైపు వెళ్ళాలో తెలీక నాలుగువైపుల ఉన్న అన్ని పార్టీల వైపు ఏదేప్రయత్నం లో వున్న కమ్యునిస్టులు ఈసారి ఎవరివైపు ఈది ఎవరిని గెలిపిస్తారో చూడాలి..
వైట్ లిఫ్టింగు : హిందుత్వ - రామాలయం అనే బరువులు మోస్తూ ఎప్పటికైనా ఫస్టు మేమే వస్తాం అప్పటిదాక wait చేస్తాం అంటూ వైట్లిఫ్టింగ్ చేస్తున్నారు..భా జా పా..
బీచ్ వాలీబాలు : ఆడేది బీచ్ వాలీబాలు లాంటి రాజకీయం అనే ఆట ఐనా మేము మొత్తం డ్రస్సు వేసుకునే ఆడతాం నైతిక విలువలు నిలుపుకోవడానికి వలువలు వేసుకునే పోరాడతాం..నిజాయితీగా ఆడతాం మా సత్తా చూపుతాం అంటూ నిత్యం రక రకాల డోపింగులు తీసుకునే వాళ్ళతో పోటీ పడుతున్నారు లోక్ సత్త వాళ్ళు..
మనమూ చూద్దాం ఈ పొలిటికల్ ఒలంపిక్స్ లో ఎవరు గెలుస్తారో .........

LinkWithin

Related Posts with Thumbnails