ప్రజా సేవకు రెడీ అనే రాజ శేఖర్ రెడ్డి ఇక లేరు...ఇది ఇవ్వాళ ఏ పేపరు చూసినా..న్యూస్ చానెల్ పెట్టినా కనిపించిన హెడ్ లైను.కానీ ఆయన మనందరి మనసుల్లో ఉన్నాడు. ఇంత ఏ ముక్యమంత్రి మరణానికీ పక్క రాష్ట్రాలు కూడా శలవు ప్రకటించలేదు..అంటే ఆయనకున్న మంచి పేరు ఎలాంటిదో అందరికీ అర్ధం అవుతుంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రచ్చబండ కి వెళుతూ.తరలి రాని లోకాలకు వెళ్ళిపోయాడు ఆ మహా మనిషి.
ప్రజా సేవకు రెడీ అనే ఆ రాజ శేఖరుడు...కాలిబాటన రాష్ట్రం నలుమూలలా పర్యటించి..రాజధానికి రాజుగా చేరుకున్నాడు. పల్లెలో వెతలు చూసి ఉచిత కరెంటు ఇచ్చాడు, పల్లె బాటలో జనాన్ని చూసి రెండు రూపాయలకు బియ్యం ఇచ్చాడు. డాక్టరు కావడం వల్ల..తన ఆరాధ్యమైన రాజీవ్ పేరిట ఆరోగ్య శ్రీని అందించాడు...ఇందిరమ్మ ఇళ్ళు కట్టించి...కష్టించే వాళ్ళకూ గూడు అందించాడు. కూడు.గూడు..ఆరోగ్యం ....అందించాడు..ప్రాజెక్టులు కట్టి..పూర్తి చేసాడు...తలచిన పని చేసుకు పోవడమే కానీ వెను తిరిగి చూడని ధీశాలి.
ఇంకా ఎన్నో చేయాలనుకున్నా....మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఆ పనులు ఇంక ఎవరు చేస్తారో వేచి చూడాలి. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని ఆశిస్తూ
నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి...Telugu Satire for Telugu People......!
Welcome
airlines... లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
airlines... లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
శనివారం, సెప్టెంబర్ 05, 2009
మంగళవారం, జులై 21, 2009
కల కలాం
కల కలాం
ప్రపంచమంతా చంద్రుడిమీద కాలు పెట్టి నలభై ఏళ్ళు గడిచిన సంబరాలు జరుపుకుంటూ ఉంటే మన దేశంలో మాత్రం క్షిపణి మాంత్రికుడు.......స్ఫూర్తిప్రదాత....మాజీ రాష్ట్రపతి కి అవమానం జరిగింది.
ముంబాయి పేలుళ్ళలో దొరికిన..కసబ్ మావోడే అంటూ ఒక సారి...కాదు ఎవరో తెలీదు అని ఒకసారి మాట మారుస్తున్న తుపాకిస్తాను....అవును నేనే చేసాను అని ఒప్పుకున్న కసాయి కసబును విచారించడానికి ఎన్నేళ్లు పడుతుందో ఏమిటో.
పొట్ట పోసుకోవడానికి వెళ్ళి ....అతి తెలివికి పోయో...మోస పోయో పరాయి దేశాల్లో జైళ్ళలో మగ్గుతున్న ఎందరు భారతీయులు ఏమేమి కష్టాలు పడుతున్నారో..ఎలాంటి విచారణ ఎదుర్కుంటున్నారో తెలీదు.
మాజీ అధ్యక్షులు....క్లింటనో...బుస్షో వస్తే వాళ్ళని కూడా ఇలానే అవమానిస్తారా? లేక ఆ "సౌకర్యం " మన వాళ్ళకేనా..
ఆ మధ్య మన జార్జి ఫెర్నాండెజ్ గారికి కూడా ఈ రకంగా జరిగిందిట. రక్షణ మంత్రులు.రాష్ట్రపతులకే లేనిది ...ఇక సామాన్య మానవుణ్ణి ఏమి సరిగ్గా చూస్తారు.
బాంబేలో బాంబులేసినది ఎవరో తెలుసు..ఎంత నష్టం.జరిగింది...ఎన్ని ప్రాణాలుపోయాయి తెలుసు..ఎవరికోసం .........ఎవరి మెప్పు కోసం...ఎవరికి సమాధానం చెప్పాల్సి వస్తుందని...భయపడతారో తెలీదు..కార్గిల్ ఆక్రమించినప్పుడు మనం పోరాడి ....ఎన్నో ప్రాణాలు బలిచ్చి కాపాడుకున్నాం కానీ...ఎవరూ వచ్చి పాకిస్తాను వాడికి ఇది తప్పు నాయనా. అని ఎవరూ రాలేదు...తరువాతైనా మంచి చెడు చెప్పిందీ లేదు....మరి ఈ విధానమేంటో అర్ధం కాదు నా మట్టి బుర్రకి.
మీకెవరికైనా తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోండి.
బాబ్బాబు..........
నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)