Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com
indian politics లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
indian politics లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, మే 03, 2013

పవర్ యాత్ర




ఈ మధ్య ఎక్కడ చూసినా యాత్రలు..పాద యాత్రలు..పవర్ యాత్రలే కనిపిస్తునాయ్ వినిపిస్తున్నాయ్.

అప్పట్లో పదండి దండి మార్చ్ కి అంటూ ఉప్పు సత్యాగ్రహం కోసం గాంధీ గారు పాదయాత్ర చేసారట

తరువాత అద్వానీ గారు రామ రధం మీద గల్లీ గల్లీ తిరిగి తిరిగి ఢిల్లీ చేరారు

ఆ మధ్య వై ఎస్ ఆర్ గారు పాదయాత్ర చేసి చేసి చివరకి సీ ఎం కుర్చీలో రెస్ట్ తీసుకున్నారు. రెండు సార్లు ముఖ్య మంత్రి అయ్యారు. ఆయన మరణించాక వాళ్ళబ్బాయీ..ఆయన జైలుకెళ్ళాక వాళ్ళ చెల్లాయి ఓదార్పు యాత్ర పేరుతో పాద యాత్రలు..బస్సు యాత్రలు చేసారు చేస్తున్నారు..

నిన్నటి దాకా మన చంద్ర బాబు గారు కూడా గుర్తు సైకిల్ ఐనా పాపం రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి ప్రస్తుతం ఎలక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇవి పాదయాత్రలా పవర్ యాత్రలా అంటే పవర్ కోసం యాత్రలా ?


వీళ్ళంతా పదవి లేనప్పుడు పదవి కోసం తిరగడమే తప్ప..పదవి లో ఉన్నప్పుడు ఎందుకు తిరగరో.. టైముండదనుకుంటా...అప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లెంసు, ఇంకా అవీ ఇవీ అడ్డొస్తాయి కాబోలు!

అందరూ పల్లె పల్లె తిరిగేసి..గుడిసె గుడిసే చూసేసి..బుగ్గలు నిమిరేసి..భోజనాలు చేసేసి..కష్టాలు వినేసి.. స్పీచులు ఇచ్చేసి.. వాగ్దానాలు చేసేసి.. సరాసరి పీఠం ఎక్కేసి.. ఐదేళ్ళు రెస్ట్ తీసుకుంటారు... జనం మాత్రం ఈ ఐదేళ్ళు గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ, పంచాయితీల చుట్టూ.. ఆఫీసర్ల చుట్టూ,,రేషన్ కొట్ల చుట్టూ, సంక్షేమ పధకాల చుట్టూ చేతిలో పాత్రతో పాద యాత్ర మొదలు..


కమాన్ కామన్ మాన్ గెట్ రెడీ ఫర్ పాద యాత్ర!










నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

సోమవారం, జులై 11, 2011

దారుణా"నిధి"

దారుణా"నిధి"

నిధి చాల సుఖమా రాముని సన్నిధి చాల సుఖమా అని అడిగాడట త్యాగరాజు గారు గారు. పాపం అమాయకుడు...అదే ఈరోజుల్లో అడిగితే 'నిధి 'యే అని  చేప్తారు. 
ఈ మధ్య రెండు నిధుల గురించిన చర్చలు బాగా జరుగుతున్నాయి...రెండూ దక్షిణ దేశంలోవే...
ఒకటి విలువలను పాతరేసిన కరుణా నిధి ఫ్యామిలీ వెనకేసిన నిధి గురించి ఐతే..
నేల మాళిగలో పాతేసిన విలువ కట్టలేని రంగనాధుని నిధి మరోటి.
రెండూ పెట్టెలు తెరవలేదు..లెక్క కట్టలేరు ..

ఒకటి తీగ బంధం - మరోటి నాగబంధం.
ఇక్కడ తీగ లాగితే డొంక కదులుతుందని... మారన్ అని మారాం చేసినా సరే పదవి లాక్కుని పెదవి విరిచేసింది కేంద్ర ప్రభుత్వం.
అక్కడేమో నాగబంధం గురించి వాకబు చేయాల్సిందిగా కోర్టు సెలవిచ్చింది.

2G -  ఒకటి 2 జెనెరేషన్ ల ముందు దాచిపెట్టిన నిధి
         మరోటి 2 జెనెరేషన్ పేరిట దోచున్నది

        ఇంకా బయటకు రాబోయేవి ఎన్నున్నాయో లెక్క తెలీదు... గాలి గనులు, ఇనపగనులు, జ"గనులు " ,
        పుట్టపర్తి ట్రస్టు నిధులు .. అబ్బో ఇంకా చాలా ఉన్నాయి.. ఎవడన్నాడు ఇండియా పేద దేశమని..
        పేదలున్న దేశం

       funcounter@gmail.com








నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

సోమవారం, జులై 12, 2010

ఆస్ట్రో ప్లస్


ఆస్ట్రో ప్లస్

ప్రపంచ కప్ ఫుట్ బాల్ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా..ఆక్టోపస్ గురించి మాట్లాడారు జనాలు..ఆ ఆక్టోపస్ గురించి ఊళ వేసి మరీ చెప్పారు. అదే మనం చెప్తే మన జ్యోతిష్యాన్నీ ఇతర శాస్త్రాలని హేళణ చేస్తారు.

జెండాలు పెట్టిన పెట్టె ముట్టుకుంటే గెలుస్తున్నాయని..ముందే విజేత ని నిర్ణయిస్తుందనీ చెప్తే..ఆహా ఓహో అంటూ వింటున్నారు.

మరి సుర్యోదయం సమయం..గ్రహణం ఎప్పుడొస్తుంది..వర్షం ఎప్పుడు పడుతుంది..అన్ని చెప్పే మన జ్యోతిష్యాన్ని ఎందుకు అపహాస్యం చేస్తారో అర్ధం కావట్లేదు.

ఏ దుర్భిణిలు(టెలిస్కోపులు),,క్యాలిక్లేటర్లు.. కంప్యూటర్లు లేని రోజుల్లోనే ఖగోళ శాస్త్రాన్ని ఔపోసన పట్టి ఏది ఎంత దూరం లో ఉంది..గ్రహాలెన్ని ..వాటి ప్రభావం ఎలా ఉంటుంది ..అని చెబితే మనవాళ్ళని పిచ్చివాళ్ళన్నారు..అదే జోడియాక్ సైను..వర్గియో...కాన్సరు..అంటే మాత్రం...యా యా నేనూ వర్గియో నే..అందుకే సెన్సిటివ్ అంటూ తాళం వేస్తారు.

మన రుతువులు..వర్షాలు..ఎండలు..పండగలు.అన్నీ ప్రకృతి తో పాటు ప్రయాణిస్తాయి.. ఖచ్చితంగా ఎప్పుడొస్తాయో మనకి తెలుసు..అదే ఒక సారి డిసెంబర్ లో వచ్చే చలికాలం..ఒక సారి జనవరిలో మరో సారి నవంబరు లో వస్తాయి మన తెలుగు మాసాల్లో మాత్రం ఖచ్చితంగా ప్రతీ సారి చైత్రం లోనే ఎండాకాలం మొదలౌతుంది..ఉగాది నుంచే వసంతం మొదలౌతుంది..మన జీవనం ప్రకృతితో సహజీవనం..

ప్రతీ పండగకి..అది చేసుకునే విధానానికీ ఒక విశిష్టత ఉంది.. ఆరోగ్య సూత్రాలున్నాయి..ప్రకృతి నియమాలున్నాయి.

శాస్త్ర రూపం లో చెబితే కలకాలం..చదువురాని వారికి కూడా అర్ధమవుతుందని అప్పట్లో అలా చెప్పి ఉండొచ్చు...కానీ మన శాస్త్రాలు..విద్యలు..వేదాలు..అన్నిటికన్నా విలువైనవని ఇప్పటికైనా గుర్తించాలి..



 




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

మంగళవారం, సెప్టెంబర్ 15, 2009

కెలక్కు

వెన్న ముద్దలు అనే పుస్తకంలో ప్రముఖ రచయిత జనార్ధన మహర్షి అన్నారు..ఇష్టం లేక పోతే ఉలక్కు పలక్కు కానీ కెలక్కు...అని...ప్రస్తుతం కాంగ్రెస్ అధిస్టాన వర్గం అదే చేస్తోంది. ప్రస్తుతం ఆంధ్ర లో రాజకీయ అనిస్చితి చూసి....ఏం చెయ్యాలో తెలీక...ఏదో ఒకటి చేసేయలేక..ఎదురుచూస్తోంది.

సోనియా నే అన్నీ చూసుకుంటారు..సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు అని మిగిలినవాళ్ళు చెబుతున్నా....'ఆ' నిర్ణయం ఏంటో ఇంకా ఆవిడకి కూడా అంతుబట్టటం లేదు. ఇన్నాళ్ళూ అన్ని తానే అయి నడిపించిన రాజసేఖరుడు స్థానాన్ని ఎవరికి ఇవ్వాలో తెలియక తిక మక పడుతున్నారు.

మొన్నేమో జగనే సీ ఎం అన్నవాళ్ళు ఇప్పుడు కొంచెం గేప్ ఇచ్చారు. అటు కే వీ పీ...హైదరాబాదు..డిల్లీ తిరిగి తిరిగి విసిగి ఉన్నారు..ఇన్నాళ్ళూ వెనకుండి నడిపించిన ఆయన ప్రస్తుతం ముందు జరగవలసిన దాని గురించి మల్ల గుల్లాలు పడుతున్నారు.

ఏమిటో ...ప్రస్తుతం రోశయ్య గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా ఉన్నా...అలా ఉండడం ఆయనకూ ఇస్టం ఉండదు...ఐతే మొత్తం అవాలి లేదా ఊరుకోవాలి...





నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శనివారం, సెప్టెంబర్ 05, 2009

' ప్రజా ' శేఖర్ రెడ్డి= ప్రజా సేవకు రెడీ అనే రాజ శేఖర్ రెడ్డి

ప్రజా సేవకు రెడీ అనే రాజ శేఖర్ రెడ్డి ఇక లేరు...ఇది ఇవ్వాళ ఏ పేపరు చూసినా..న్యూస్ చానెల్ పెట్టినా కనిపించిన హెడ్ లైను.కానీ ఆయన మనందరి మనసుల్లో ఉన్నాడు. ఇంత ఏ ముక్యమంత్రి మరణానికీ పక్క రాష్ట్రాలు కూడా శలవు ప్రకటించలేదు..అంటే ఆయనకున్న మంచి పేరు ఎలాంటిదో అందరికీ అర్ధం అవుతుంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రచ్చబండ కి వెళుతూ.తరలి రాని లోకాలకు వెళ్ళిపోయాడు ఆ మహా మనిషి.

ప్రజా సేవకు రెడీ అనే ఆ రాజ శేఖరుడు...కాలిబాటన రాష్ట్రం నలుమూలలా పర్యటించి..రాజధానికి రాజుగా చేరుకున్నాడు. పల్లెలో వెతలు చూసి ఉచిత కరెంటు ఇచ్చాడు, పల్లె బాటలో జనాన్ని చూసి రెండు రూపాయలకు బియ్యం ఇచ్చాడు. డాక్టరు కావడం వల్ల..తన ఆరాధ్యమైన రాజీవ్ పేరిట ఆరోగ్య శ్రీని అందించాడు...ఇందిరమ్మ ఇళ్ళు కట్టించి...కష్టించే వాళ్ళకూ గూడు అందించాడు. కూడు.గూడు..ఆరోగ్యం ....అందించాడు..ప్రాజెక్టులు కట్టి..పూర్తి చేసాడు...తలచిన పని చేసుకు పోవడమే కానీ వెను తిరిగి చూడని ధీశాలి.

ఇంకా ఎన్నో చేయాలనుకున్నా....మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఆ పనులు ఇంక ఎవరు చేస్తారో వేచి చూడాలి. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని ఆశిస్తూ






నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మంగళవారం, జులై 21, 2009

కల కలాం

కల కలాం

ప్రపంచమంతా చంద్రుడిమీద కాలు పెట్టి నలభై ఏళ్ళు గడిచిన సంబరాలు జరుపుకుంటూ ఉంటే మన దేశంలో మాత్రం క్షిపణి మాంత్రికుడు.......స్ఫూర్తిప్రదాత....మాజీ రాష్ట్రపతి కి అవమానం జరిగింది.

ముంబాయి పేలుళ్ళలో దొరికిన..కసబ్ మావోడే అంటూ ఒక సారి...కాదు ఎవరో తెలీదు అని ఒకసారి మాట మారుస్తున్న తుపాకిస్తాను....అవును నేనే చేసాను అని ఒప్పుకున్న కసాయి కసబును విచారించడానికి ఎన్నేళ్లు పడుతుందో ఏమిటో.


పొట్ట పోసుకోవడానికి వెళ్ళి ....అతి తెలివికి పోయో...మోస పోయో పరాయి దేశాల్లో జైళ్ళలో మగ్గుతున్న ఎందరు భారతీయులు ఏమేమి కష్టాలు పడుతున్నారో..ఎలాంటి విచారణ ఎదుర్కుంటున్నారో తెలీదు.
మాజీ అధ్యక్షులు....క్లింటనో...బుస్షో వస్తే వాళ్ళని కూడా ఇలానే అవమానిస్తారా? లేక ఆ "సౌకర్యం " మన వాళ్ళకేనా..

ఆ మధ్య మన జార్జి ఫెర్నాండెజ్ గారికి కూడా ఈ రకంగా జరిగిందిట. రక్షణ మంత్రులు.రాష్ట్రపతులకే లేనిది ...ఇక సామాన్య మానవుణ్ణి ఏమి సరిగ్గా చూస్తారు.

బాంబేలో బాంబులేసినది ఎవరో తెలుసు..ఎంత నష్టం.జరిగింది...ఎన్ని ప్రాణాలుపోయాయి తెలుసు..ఎవరికోసం .........ఎవరి మెప్పు కోసం...ఎవరికి సమాధానం చెప్పాల్సి వస్తుందని...భయపడతారో తెలీదు..కార్గిల్ ఆక్రమించినప్పుడు మనం పోరాడి ....ఎన్నో ప్రాణాలు బలిచ్చి కాపాడుకున్నాం కానీ...ఎవరూ వచ్చి పాకిస్తాను వాడికి ఇది తప్పు నాయనా. అని ఎవరూ రాలేదు...తరువాతైనా మంచి చెడు చెప్పిందీ లేదు....మరి ఈ విధానమేంటో అర్ధం కాదు నా మట్టి బుర్రకి.
మీకెవరికైనా తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోండి.
బాబ్బాబు..........










నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

LinkWithin

Related Posts with Thumbnails