సుస్వాగతం

స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......welcome to funcounter the laughter channel....just for fun....from your phani madhav....

ఆర్యా థూ

 ఆర్యా థూ
దీనికి ఇంతకన్నా మంచి పేరు నాకు తోచలేదు. ఒక అద్భూతమైన  ముక్కోణపు ప్రేమ-స్నేహం-పైత్యం-త్యాగం-మూర్ఖత్వం- ల సమ్మేళణం గా మలచిన విచిత్ర రాజం అనిపించిన సినిమా.

అసలు ఆర్య లోనే ఆ పాయింటు అర్ధం కాక తికమక పడ్డా. ఇప్పుడు ఈ రెండో భాగం చూశాక అసలు వీళ్లకి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో అని అర్ధం కాలేదు.

ఇద్దరు ప్రాణ స్నేహితులుంటారు.అంటే ఒకళ్లకోసం ఒకళ్లు ప్రాణాలిచ్చేంత అని అపార్ధం చేసుకోకూడదు. వాళ్ల విచిత్ర స్నేహం తో మన ప్రాణం తీస్తారని అర్ధం. హీరో ఎవరికీ తెలీకుండా తాగిన, వాగినా, జనాల్ని కొట్టినా, సైటు తిట్టినా, హీరో కాబట్టి గ్రేటు..ఆయన గ్రేట్ నెస్ చూపాలంటే ఇంకోణ్ని వెధవని చెయ్యాలి. అంత ప్రాణ స్నేహితులు..ఎప్పటికప్పుడు హీరో ఫ్రెండు చెడ్డవాడిగా పనికిరానివాడిగా, చూపిస్తూ హీరోగారు మాత్రం మిస్టర్ పెర్ఫెక్త్ గా నిలుస్తుంటాడు. ఆయనంటే ఎంత గురి అంటే..హీరో లిఫ్టులో ముద్దు పెట్టాడు అని హీరోయిన్ చెప్పినా అదేదో టీ వీ లో టెలి బ్రాండ్ ఎడ్వర్టైజ్ మెంట్ లా చూసి నవ్వుకుని వెళ్లిపొతారు. ఆయన మాత్రం ఎంచక్క లేడీస్ టాయ్లెట్ లోకెళ్ళి మందు కొట్టి, ఆవకాయ నంచుకుని..బయటకొచ్చి బుడ్డిమంతుడు సారీ బుద్ధిమంతుడిలా నుంచుంటాడు..ఇక్కడా హీరోయిన్ పాపం బకరీ అవుతుంది..వీరి పైత్యానికి సపోర్ట్ గా బ్రహ్మానందం బ్యాచి, ఓ ముసుగు కారు,,మరిన్ని వింతలు..

ఇక హీరోగారు, హీరో ఫ్రెండు గారు సిగరెట్ మీద సగం సగం పేరు రాసుకుని..సగం సగం పంచుని, తాగుతూ, ఆ బూడిద మనమీద వేస్తుంటారు. ఒక సిగరెట్ తాగినట్టుగానే ఒక అమ్మాయినే ప్రేమిస్తారు. చివరికంటా సిగరెట్టులానే మార్చి మార్చి పంచుకుంటారు. స్నేహం కోసం ఏమైనా చేసే..మన హీరో గారు హీరోయిన్ ను ఫ్రెండ్ కి అందించడానికి వాళ్ళ ఊరు వెళ్తాడు. మామూలుగానే ఫాక్షన్ లీడర్ గారైన హీరోయిన్ తండ్రిగారు...తాను మీ అమ్మాయి ప్రేమికుడిని అని చెప్పినా హీరోని ఏమీ అనక పోగ..అప్పట్నుంచీ హీరో ఏం చెబితే దానికి తల ఊపి, పెళ్లి చెడిపోయిన తరువాత తన కూతుర్నిచ్చి పెళ్ళికూడా చేస్తాడు.
ఇక ఇక్కడనుంచీ హీరో గారి హీరోయిజం ముందు మన భారత దేశం, మన సంప్రదాయం, పెళ్లి పై ఉన్న అభిప్రాయం, ఇవన్ని చిన్నబోతాయి. పెళ్లి చేసుకున్న తన భార్య ఐన ప్రియురాలిని..ఫ్రెండుకిచ్చి పంపించేసి మామ గారింటికి వెళ్లి పోతాడు మన హీరోగారు. ఫ్రెండుని ప్రియురాలిని అమెరికా పంపించడానికి అన్ని ఏర్పాట్లూ చేసేసి..పాపం ఫ్రెండు సిగరెట్టు మానెస్తాడేమో అని సగం సిగరెట్ట్లు తాగెసి పోగేసి హీరోయిన్ కం ప్రియురాలికి గిఫ్టు ఇస్తాడు. ఆ త్యాగం, చూసి చెలించిన చెలి అదేనండీ ప్రియురాలు తండ్రికి ఫోను చేసి పిలిపిస్తుంది..ఫ్రెండు ని పొడవబోయి అల్లుణ్ణి పొడుస్తాడు.
హాస్పటల్ లో జ్`నానోదయం అయిన ఫ్రెండు ప్రియురాలిని భర్తకి ఒదిలేసి కధ సుఖాంతం చేస్తాడు. ఆహా ఆక్సిజన్ సిలిండర్ ఆపినా బతికే హీరోగారు..ఎవర్ని ప్రేమించిందో తెలీని హీరోయిన్ కలిసిపోతారు. గ్రేట్ ఐడియా...

రింగ రింగ పాటలో అర్ధం బాగాలేదని గొడవ చేసిన.. వారికి  ..సినిమా చూస్తే ఇంక ఏమనిపిస్తుందో..మరి. అసలు సెన్సార్ అన్నది ఉందా. వారి పనేంటో..సినిమాలో సీనులు చూసి దాని బట్టి సర్టిఫికేట్ ఇవ్వడమేనా..ఇలాంటి అద్భుతాలు కనిపించినప్పుడు పట్టించుకోరా. హీరోలు...దర్శకులు వాళ్లకేది అనిపిస్తే అది తీసేసి జనం మీదకి తోసెయ్యడమేనా..పాట లో మార్పులు చేసారు.సినిమాలో, కానీ అప్పటికే విడుదలైన సీడీల మాటేమిటి..ఇక నుంచీ ఆడియోకి కూడా సెన్సారుండాలా విడుదల కి ముందు ఎవరైనా విని ఓకే చేసే పరిస్థితి వస్తుందా.? అసలు పైత్యానికి పరాక్ష్టగా ఉన్న వీళ్ల ఆలోచనలు ఎప్పుడు మారతాయో..ఎనిమిదేళ్ల అబ్బాయి ఏదో రసాయన చర్యలతో పెద్దగా ఐపఓయి. పెళ్ళి చేసుకుని, ఒక పూట చిన్నగా, ఒక పూట పెద్దగా ఉండే లాంటి కధలల్లే అపర మేధావులు, స్నేహం కోసం భార్యని త్యాగం చేసే మిస్టర్ పెర్ఫక్ట్ గార్లు, అబ్బ తెలుగు సినిమా పతాకం ఎక్కడో రెప రెప లాడుతోంది. రేపటి రోజు సినిమా తలుచుకుంటే భయమేస్తోంది.




నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

పేరంటం



ఆదివారం కదా అని హాయిగా లేటుగా నిద్ర లేచి...వాకిట్లో కూచుని పేపర్ తిరగేస్తున్నా.ఈలోగా..పట్టుచీరలు కట్టుకుని కొంతమంది ఆడవాళ్ళు పొలో మంటూ పది మంది వచ్చారు. మా ఆవిడ స్నేహితులేమో అనుకుని..లోపలకొచ్చి మా ఆవిణ్ణి పిలిచా. ఆ వచ్చిన వాళ్ళు, మా ఆవిడకి బొట్టుపెట్టి, రవికల గుడ్డ పెట్టి ఇంకేదో చెబుతున్నారు. మా ఆవిడ నన్ను పిలిచింది. ఏంటో అనుకుని నేను బయటకెళ్ళా. వాళ్ళలో ఒకరు..అన్నయ్య గారూ..మీరూ తప్పకుండా రావాలి. వొదిన్ని..బాబాఇగారిని తీసుకురావాలి. మర్చిపోవద్దు. అంటూ పొలోమని వెళ్ళి పోయారు...ఏదో గాలి దుమారం లా. నాకేమీ అర్ధం కాలేదు. ఆడవాళ్ళ ఫంక్షన్ కి నేనేమిటీ అని అడిగా మా ఆవిణ్ణి.కిసుక్కున నవ్వింది మా ఆవిడ.


ఆ వచ్చింది పేరంటానికి పిలవడానికి కాదండీ, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో ఓటెయ్యడానికి అని అసలు రహస్యం చెప్పింది. ఔరా అనుకున్నా. ఇంతలో దూరంగా మరో బాచ్ వస్తుంటే .. భయపడి బాత్రూం లో చేరా...


బయటకొచ్చాక మా ఆవిడిచ్చిన కాఫీ తాగుతూ..ఆవిడిచ్చిన (అదే పిలుపులకొచ్చిన ఆవిడ) ఫాంప్లేట్ చూశా. ఒక పక్క వాళ్ళాయన ఫొటో ..మరో పక్క ఆవిడ ఫొటో ఉన్నాయి. ఆయన మా కాలనీ చుట్టుపక్కల ఓమాదిరి పేరున్న లీడరే..ఏమైనా గొడవలూ గట్రా ఐతే  ఆయన తప్పకుండా అక్కడుంటాడు..ఐతే గోడవ తీర్చడానికి లేకపోతే గొడవపడుతూనో ఉంటాడు..ఈ మధ్యే ఒక ఆటో డ్రైవర్ ని ఐదు రూపాయలు ఎక్కువడిగినందుకు పళ్ళూడగొట్టి.అవినీతి పై తన ప్రతాపం చూపించిన మహా లీడర్ ఆయన. ఆయనకి మా కాలనీలో ఒకటి బయటింకెక్కడో మూణ్నాలుగు వైన్ షాపులున్నాయి. మున్సిపాలిటీలో కొన్ని కాంట్రాక్టులు కూడా ఉన్నాయి. మరి ఏకంగా ఆయనే నుంచోకుండా..వాళ్ళావిణ్ణి ఎందుకు నుంచో పెట్టాడా అనుకున్నా. ఈ నియోజకవర్గం లో స్త్రీల రిజర్వేషన్ ట .. గెలిచేది ఆవిడే అయినా పాలన వారిదేనట..ఇంకొన్ని కాంట్రాక్టులు ఈజీ గా రావడానికి వీలుగా మనమె మెంబరైపోతే ఇంకా హాయి గదా అని.ఇలా.....


సరే ఆ విషయం వదిలేస్తే ఓటెవరికి వెయ్యాలో అర్ధం కావట్లేదు. మొన్నటిదాకా కలిసున్న తెలుగు దేశం. టీ ఆర్ ఎస్ విడిపోయారో కలిసే ఉన్న్నారో అర్ధం కావట్లేదు. చిరంజీవి తప్ప మరెవరు ఆ పార్టీయో అర్ధం కాని ప్రజా రాజ్యం...లోక్ సత్త జయ ప్రకాష్ దీ అదే పరిస్థితి...ఇక వై ఎస్ లేని కాంగ్రెస్. ఎవరు ఎవరితో కలిసున్నారో..కలిసి లేరో..ఏది మిత్ర పక్షమో..ఏది ప్రతిపక్షమో..అసలు తెలీట్లేదు.


పాత బట్టలకి స్టీల్ సామానిస్తాం, సత్తుబిందెలకి మాట్లేస్తాం.,అంటూ అరుస్తూ తిరిగే వాళ్ళలా ఎలక్షనప్పుడు మీ రోడ్లు బాగుచేస్తాం..మంచినీళ్ళిప్పిస్తాం, ప్రాబ్లెంస్ తీరుస్తాం, అంటూ వీధి వీధి..ఇల్లు ఇల్లు తిరిగి చాటింపు వేసే వీళ్ళు గెలిచాక ఎక్కడుంటారో..ఏం చేస్తారో తెలీదు. పెద్ద వాళ్లంతా ఎసెంబ్లీలో కొట్టుకుంటుంటే..వీళ్లంతా ఇక్కడేమో..ఏంటో ఈ ఎలక్షన్ లేమిటో.ఈ గొడవలేమిటో.


ఫ్లై ఓవర్ లు కూలితే తప్పు అవతల వాళ్లది.బాగుంటే ఘనత మనది..మినిస్టర్లు..సినిమా వాళ్ళు తిరిగే రోడ్లు అద్దాల్లా ఉంటాయి..,,మిగతావి అధ్వాన్నం గా ఉంటాఇ.. మళ్లీ విదేశాల్లో సర్వేలు.నివేదికలు..బడ్జెట్లు...గొడవలు..ఓకే అయ్యే నాటికి మళ్ళీ ఎలక్షన్ లు..షరా మామూలే..ఓకే మీరెళ్ళే సరికి మీ ఓటుంటే వేసి రండి...






నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

యాక్ నిరంజన్

 యాక్ నిరంజన్
ఈ సినిమా మొదటి రోజునే చూసేసా. కానీ తేరుకుని ఈ పోస్టు రాయడానికి ఇన్ని రోజులు పట్టింది. అసలు వీళ్ళేమనుకుంటారో అర్ధం కాదు. బిల్లా సినిమాలో హీరోయిన్ లకి బికినీలేసి సారేమో తెల్ల సూట్లేసుకుని మలేసియానో అదేదో దేశం లో అటూ ఇటూ తిరిగాడు..ఇందులో ఏకంగా బేడీలు బొడ్లో దోపుకుని రౌడీల వెంటబడతాడు. ఏమిటో అంతా జగన్నాధుని మాయ.

నేను బాగా చూసి అర్ధం చేసుకున్న విషయం ఏమిటంటే ,.ఈయన చిన్నప్పుడు అంటే కొంచెం పెద్దయ్యాకే..ఏ పోలీసు ఉద్యోగం కోసమో ట్రై చేశాడు ...కానీ అది రాలేదు..అని. ఎందుకంటే ..ఈయన గారి మొదటి సినిమా..బాచి లో జగపతి బాబు పోలీసు...(అనచ్చోలేదో) అమెరికా స్టైల్లో తెల్లటి డ్రస్సు..చొక్కాకి రెండు తుపాకులు .....ఊ అంటే అది తీసి ఆయన ఫైరింగు. ఇక ఇడియట్ లో ఐతే ఆయన మోటో పోలీసు ఆఫీసర్ అవడమే..పోకిరి డిటో ఆల్రెడీ పోలీసు..కానీ పోకిరి..ఇప్పుడు ఇందులో చిన్నప్పడు ఒకణ్ణి పట్టించి.ఒకరూపాయి అందుకున్న పాపానికి (మన పాపానికే) పెద్దయ్యేసరికి పోలీసు ఇంఫార్మర్ గా(దీనికి సార్ ఇంకేదో పేరు కూడా పెట్టాడు) బేడీలు కూడా వేసే స్థాయిలో  మన హీరోగారు. హీరోయిన్ సరే సరి పాపం గిటారు నేర్పుతూ ఉంటుంది కొంత మంది పిల్లలకి..చాలా పేద పిల్ల కావడం వల్ల పాతిక వేల రూపాయల గిటారు కొనుక్కోవాలి కాబట్టి చిన్నప్పటి గౌన్లు అవీ వేసుకుని..గిరజాల జుట్టూ...కెనెటిక్ బండీ (సుమారు నలభై వేలుండదూ)
అన్నని చితక్కొట్టి జైల్లో పడేసిన హీరోగారి ప్రేమలో పడి..ఇంక ఆ తరువాత ..!!!!

సొంత గాంగులో వాళ్లని కూడా సరదాకో..దురదకో..ప్రాక్టీసుకో..పైత్యానికో చంపేసే విలన్ గారు మన హీరోగారు ఎన్నిసార్లు..ఏమి చేసినా..ఊరుకుని..చివరివరకు  తన్నులు తింటుంటాడు. ఆలి లేని లోటు తీరచాడు సినిమాకి.
తల్లిని ఏదో అనడం...చెయ్యడం..తండ్రిని చంపడం..లాంటివీ షరా మామూలే.వీరి సినిమాలో..
ఇంకో ట్విస్టు...అసలే రకరకాల ప్రాబ్లెంసు..వీసా గొడవలు..విదేశీ ప్రయాణాలూ కష్టంగా ఉన్న ఈ రోజుల్లో..హీరోగారికి ఫోనొచ్చిన మరుక్షణం పోలీసులకో ఇంటర్పోల్ వాళ్లకో అన్నట్టుగా...మరుక్షణం సార్ బాంకాక్ లో ప్రత్యక్ష్యం. ఆదిత్యరాం టికెట్ పెట్టినా...వీసా పాస్పోర్ట్ ఎవరిచ్చారో ? మరో వింతేమిటంటే బాంకాక్ లో పబ్బులో మైకేలు జాక్సన్ గారికి తెలుగు నివాళి.ధన్య జీవి,,,మన పూరీ గారికి మైకేలంటే చాలా ఇష్టమట..అందుకే వాళ్లింట్లో రెండు కుక్క పిల్లల్లో ఒకటి జాక్సన్ మరోటి మైకేలూను. బాగు బాగు....భౌ భౌ సంగీత సార్వాభౌ ' ముడు కదా.

హీరో అనగా...చింపిరి జుట్టు..మాసిన గడ్డం,,,,చదువు సంధ్య లేకపోవడం...సిగరెట్టు..మందు కొట్టడం..దేవుణ్ని నమ్మకపోవడం..దొరికిన వాణ్ని తన్నడం...వగైరా పూరీ మార్కు హీరో లక్షణాలన్ని ఉన్న యాక్ నిరంజన్ కు జోహార్.



నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

షిఫ్ట్ డెలిట్




షిఫ్ట్ డెలిట్
కంప్యూటర్ వాడేవారందరికీ ఇది తెలిసే ఉంటుంది..షిఫ్ట్ డెలిట్ అంటే పెర్మినెంట్ గా తొలగింపు అని...
హస్తినా పురం లో అడ్మినిస్ట్రేటర్  మాత ..ప్రస్తుతం అదే చేసినట్టున్నారు?
వై ఎస్ ప్రోగ్రాం సడెన్ గా క్రాష్ కాగానే...వెంటనే రన్ అవుతుందనుకున్న సబ్ ప్రోగ్రాం జగన్ సాఫ్ట్ వేర్ కి టెస్టింగ్ కాలేదని..ఓల్డ్ వెర్షన్ ఐనా రోశయ్య టూల్ నే ఎంచుకున్నారు.

మాటి మాటికి సీ ఎం వెర్షన్ మార్చే కాంగ్రెస్ లో .. మార్పు అవసరం లేకుండా నెట్టుకొచ్చిన ఆపరేటింగ్ సిస్టం వై ఎస్. కొత్తగా తెచ్చిన..ప్రోగ్రాం లు.. ఇంకా కొన్ని సబ్ ప్రోగ్రాం లు.. ఇందిరా రాజీవ్ ల పేరున తయారు చేసిన స్టైల్ షీట్లు..ఒకటేమిటి..మళ్లీ ఏ ఆపరేటింగ్ సిస్టం అవసరం లేకుండా..నదిపించేసాడు...పాద యాత్రలు అలవాటు కదా.కానీ సడెన్ గా క్రాష్ అవడం తో..ప్రస్తుతం అగమ్యగోచరం అనుకుంటున్న తరుణం లో రోశయ్య రూపంలో ఓల్డ్ వెర్షన్ దొరికింది..కాంగ్రెస్ సెర్వర్ కి.

చూద్దాం  ఏం జరుగుతుందో..



మాయాజాలం

మాయాజాలం
తిరుపతి లో ఆంధ్ర మెజీషియన్ లు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఇంద్రజాల సభలు జరుగుతున్నాయి. ఆశ్చర్యమేమిటంటే ఇక్కడ ఇంకా పెద్ద స్థాయిలో ఇంద్రజాలం జరుగుతోంది. పీ సీ సర్కార్ సీనియర్ తరువాత ఆయన పరంపరని కొనసాగించాడు జూనియర్ పీ సీ సర్కార్...కానీ.ఇక్కడ సీనియర్ వై ఎస్ 'సర్కార్ ' తరువాత జూనియర్ వై ఎస్ కి అలా జరగలేదు. రాజకీయమనే ఇల్ల్యూజన్ లు ఇంకా వంటబట్టించుకోకపోవడమే దీనికి కారణమనుకుంటా...రక రకాల బిజినెస్సుల్లో బిజీ గా మెస్సై పోవడం వల్ల...కాబోలు.


సీనియర్ సర్కార్ రాష్ట్రమంతటా పర్యటించి...తన ఇందిరాజలం తో జనాల్ని సమ్మోహితుల్ని చేసి ఎసెంబ్లీ హౌసు ఫుల్లు కాక పోయినా కలెక్షన్ కి సీ ఎం సెలెక్షన్ కీ కావాల్సినంత చేసుకోగలిగాడు..ఐతే..పావురాల గుట్ట ????... మెజీషియన్ లు ఎక్కువగా పావురాలతోనే మేజిక్ చేస్తారు. అక్కడ అనుకోంది దుర్ఘటన తో..అందరికీ దూరమైనాడు. కానీ ఆయన కొనసాగింపు..వారసుడికి రాలేదు. సాధారణంగా వారసత్వాన్నే పౌరసత్వంగా భావించే కాంగ్రెస్ ఈ సారి ఎందుకనో? అలా జరక్కుండా..పీఠం జారకుండా జాగ్రత్త పడ్డారు.
బడ్జెట్ మంత్రిగారు..అదే ఆర్ధిక మంత్రిగారు..ఎలాగూ జిమ్మిక్కులు..అప్పులు-ఆస్తుల మేజిక్కులు..ప్రతిపక్షం వారిని నోరుమూయించగల లాజిక్కులు చాలా తెలుసు కాబట్టి..నెమ్మదిగా.ముఖ్య.మంత్ర దండం అందుకుని తిప్పుతున్నారు.


ఎలాగూ టోపీల్లోంచి వచ్చేవి 'కుందేళ్ళే " గనక ఖంగారు లేకుండా...నడిపించేస్తున్నారు రోశయ్య గారు. ఇండియన్ రోప్ ట్రిక్కు లాగా అందరినీ ఒక్క తాటి మీద నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కొరకరాని కొండ లుంటే,,డబ్బా లో పెట్టి మాయం చెయ్యగల సమర్ధులు. వారు.


ఢిల్లీలో చూద్దామా అంటే ...సీనియర్ వై ఎస్ సర్కార్ కి మేనేజర్ ఐన కె వీ పీ గారికి ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి..మేనేజ్మెంట్ లేకుండానే షో నడుస్తోంది..సోనియా చూస్తే ఫ్యూచర్ ప్రోగ్రాం గురించి చెప్పటం లేదు. గట్టిగా అడిగితే మేనేజర్గిరీ కే ప్రమాదమేమో కూడా.


మొత్తానికి..ప్రస్తూం ఆంధ్ర గవర్నమెంటు 'జంతర్ మంతర్ ' తిరుపతిలో జరగనున్న జాతీయ ఇంద్రజాలికుల సదస్సుకి శుభాభినందనలు శుభాకాంక్షలతో ..


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

ఆంధ్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

రాజీ నామా

 రాజీ నామా
ఏమిటి సీ బ్లాకు దగ్గర హడావిడి..కెమేరాలు..పాత్రికేయులు..న్యూసెన్స్ చానెళ్ళు అంతా విడి విడి గా..కలివిడి గా హడావిడి..మాట్లాడేసుకుంటున్నారు. మళ్ళీ ఏ బిల్డింగైనా కాలిపోయిందా..కూలిపోయిందా అని డౌటొచ్చేసింది..కాదు కొండ గురించిన మాటలు జరుగుతున్నాయక్కడ.

ఇది మార్పుల వేళయనీ..జగనన్న మాసమనీ తొందరపడి ఒక కోయిలా డిజైను చూసింది...రెజైను చేసింది...వెనకాల బాక్ గ్రౌండులో పాట వినిపిస్తోంది.

కానీ,,ముఖ్య మంత్రి గారు మాత్రం...

లేదు..కాదు..తెలీదు..ఇదేలే గవర్నమెంటాఫీసులో రెడీమేడ్ సమాధానం
ఏ ఫైలు ఎక్కడుందో చెప్పడం ఒక పెద్ద అవధానం
సంతకానికీ పంపకానికీ మధ్య ఒఖ్ఖ ఏడాదే వ్యవధానం
వాళ్ళు నిత్యం పాటించే సూక్తి "నిదానమే ప్రధానం "

ఇది మన రోశయ్య గారికి బాగా వొంట పట్టినట్టుంది. ఇనుమైనా వేడిమీద ఉన్నప్పుడు కొడితే పనౌతుంది..చల్లారాక వంచడం కష్టం అని తెలుసు కాబట్టి...నెమ్మదిగా..వేడి తగ్గేదాకా ఆగారు...ఇప్పుడు సోనియా ఆశీస్సులతో నెట్టుకొచ్చేస్తున్నారు.

రాజీనామాల పేరుతో ఎదిరించిన వారూ బెదిరించిన వారూ..కూడా ప్రస్తుతం రాజీ మార్గం పట్టి..సోనియా ఏం చెప్తే అదే అంటున్నారు..కొండకు దారమేస్తే..కొండా సురేఖ రాజీనామా దాకా వచ్చింది..కదా మరి
వై ఎస్ మరణం తరువాత వేడెక్కిన రాజకీయాల మీద వరద పోటు రావడం వల్ల చల్లారిపోయి..జగన్ భవిష్యత్తు సీ ఎం గా మిగిలిపోయాడు..ప్రస్తుత....మౌనమే దానికి 'సాక్షి '.

ఏం మంత్రి గారు,,మీరెటు ? ఆ చేతిలోది ఏమిటి...
ఔను రాజీనామా నే కాకపోతే...రాజీ అని నామానాన నేను పని చేసుకు పోతాను అని రాశా..అంతే...
అవతల ముఖ్యమంత్రిగారి మంత్రివర్గ విస్తరణలోగా ఈ కాగితం అందకపోతే..ఇక నేనూ ఇంటికి మార్గం పట్టాల్సిందే..అనుకుంటూ హడావిడిగా ఎవరికి వారు విడి విడి గా విడిది గృహం బయలుదేరారు.
గవర్నరు గారు రెడీ గా ఉన్నారా ప్రమాణ స్వీకారం చేయించడానికి..మళ్ళీ చానెల్స్ కి బోల్డంత..న్యూసు..మనకి న్యూసెన్సు...చూస్తూనే ఉండండి ,,,మాకు తోచింది చూపిస్తాం...



నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

గెలిచిన వేళనే చూడాలీ

 గెలిచిన వేళనే చూడాలీ ..నాయకుని ముఖమున వెలుగూ.....
 
ఆహా ఇంద్రప్రస్థ పురము న...10, జనపధ మార్గము ..ఇట్లు వెలిగిపోవుచున్నదేమి..ఆహా దీపావళి పండుగ మరలా వచ్చినదా ఏమి..అని ఆకాశమునుంచీ దేవతలు ఆశ్చర్యమున చూచుచున్నారు.

నాలుగు దినముల క్రితము ఐపోయిన పండుగ వాతావరణం మళ్ళీ ..డిల్లీలో కనిపించింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి..కాంగిరెస్సు వారు ఆనందోత్సాహాలతో సోనియా మాత గుడికి వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నారు. మాత దర్శనం కోసం క్యూ కాంప్లెక్సు లో వైటింగు చేస్తున్నారు.

ఇటు ..జగన్ కూడా 'ఆ ' పని మీద అమ్మగా(వా)రి దర్శనం కోసం వెళ్ళాడు. జ్యోతి దర్శనం కోసం బయలుదేరినట్టు..అందరు...తలో మార్గం లో ప్రయాణిస్తున్నారు. ఐతే ప్రసాదం ఎవరికి దక్కుతుందో ..అక్షింతలు ఎవరకి పడతాయో..చూడాలి మరి.

ఇన్నాళ్ళు 'జగనంత కుటుంబం మాదీ' ..అన్న వాళ్ళు కాస్తా..ఇప్పుడు.  రోషాలకు..పాశాలకు పోకుండా ..రోశయ్య గారు చెప్పినట్ట్లు నడుచుకుంటున్నారు..సంతకాలు ఎందుకు పెట్టామో కూడా తెలీదు అని చెప్పారు కొందరు మహానుభావులు..అంతే లే ఇవి 'మామూలే '

జిల్లాకి పేరుపెట్టి...రాష్ట్రం సంగతి నే చూసుకుంటాలే అని చెప్పకనే చెప్పారు..ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు..ఆలస్యం అమృతం విషం అని ముందే కూసిన కోయిలలు..గవర్నమెంటు పనులలో నిదానమే ప్రధానం అన్న సూక్తి మాత్రమే వర్కౌట్ అవుతుందని తెలిసేలోగా...జరగాల్సినవి జరిగిపోతున్నాయి..బీ బ్లాకునుంచీ సీ బ్లాకుకి..

నేను నిమిత్త మాత్రుణ్ణి..దేవత ఏమి చెబితే అది చేస్తాను ..అని రోశయ్య గారి ఉవాచ..ఎలాగూ. ఓ నాలుగైదేళ్ళు తపస్సు చేస్తే గానీ.దేవత ప్రత్యక్ష్యమై.వరాలివ్వదని ఆయనకీ తెలుసు..దాదాపు 50 ఏళ్ళుగా తపస్సుచేస్తున్న అనుభవం ఆయనది..


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

దివాళీ


 దివాళీ
హ్యాపీ దివాళి అంకుల్...ఎప్పుడూ పలకరించని మా పక్కింటి అబ్బాయి చెప్పగానే ఒక్క సారి ఆస్చర్యపోయా...క్రికెట్ బంతి మా బాల్కనీ లో పడితే ఇంక తిరిగి ఇవ్వనని నా మీద కోపం వాడికి...ఐనా ఎందుకు చెప్పాడో లే అని నేనూ హ్యాపీ దివాలి అన్నా..'ఢాం' అని పెద్ద  శబ్ధం తో నా కాళ్ల దగ్గర పెద్ద శబ్ధం..ఉలిక్కి పడి ఆమడ ఎత్తు పైకెగిరి పడ్డా...పక్కన చూస్తే వాడు లేడు..

టీ వీ లో మంచి సినిమాలొస్తాయి చూద్దామంటే 100000వాలాట ఒకటే సౌండు...అసలే అపార్టుమెంటు...కూలుతుందేమోనని బెంగ.

ఎవడో కావాలని వేసిన రాకెట్టు తో పైన ఆరేసిన బట్టలన్నీ కన్నాలు..

లక్ష్మీ బాంబు పేలడం వల్ల బీటలిచ్చిన కిటికీ అద్దాలు.నానా భీభత్సం..కానీ మరోఅ    పక్క మళ్ళీ.హ్యాపీ దివాళీ అంటూ ఒకటే పలకరింపులు...ఎస్ ఎం ఎస్ లు..ఫోన్ కాల్సు..ఆ హా హ్యాపీ గానే ఉంది దివాళీ. ఎందుకంటే క్రాకర్సు కొందామంటే..ఆకాశం లో ఆగిపోయిన చంద్రయాన్ ఉపగ్రహం దగ్గర తచ్చాడుతున్న రేట్లు ...పంచదార దొరక్క చప్పబడిన స్వీట్లు..వరదల వల్ల కరకట్టలకి పడ్డ తూట్లు..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విసేషాలు.

ఇది వరకైతే..ఎంచక్కా..కాగితాలు గొట్టాలు చేసి ఎండబెట్టి..బొగ్గు..సురేకారం, ఇంకా కొన్ని..సామాను తెచ్చి కలిపి  .తారాజువ్వలు..మతాబులు..పిచ్చికలు..సిసింద్రీలు..సీమ టపాసులు..తాటాకు బాంబులు..వగైరా వగైరా..(వయాగ్రా అని చదవకండే) స్వయంగా తయారు చేసిన.చేసిన దీపావళి సామానుతో పక్కింటోళ్ళతో పోటీ పడుతూ..హాయిగా పాటలు పాడుతూ ..సరదాగా గడిచేది..ఇంట్లో అందరూ పూజ చేసి కొత్తబట్టలు కట్టుకుని ..ఆ రోజులే వేరు.

ఇప్పుడో..అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నామో కూడా తెలీదు. ప్రజలను కాపాడడానికి భూదేవి దుష్టుడైన తన కుమారుణ్ణి...సత్యభామ అవతారంతో వధించి తద్వారా మనకి ఆనందమయ జీవితాన్ని అందించింది కాబట్టి...అమావాస్య చీకటి వదిలి కాంతులీనే వెలుగు ప్రసరించడానికి ఈ పండగ..ఏర్పాటైందని ఎందరీ తెలుసోఅ...మరి.

మనం మాత్రం..వెలుతురొచ్చేవి వదిలేసి....చెవులు చిల్లులు పడే సౌండొచ్చే బాంబులు..లడీలు...దిక్కుమాలిన పేర్లు గుండెలవిసే సౌండ్లు..ఉన్న వాటితోనే మన దివాళీ...
ఎన్ జాయ్...ఎన్ జాయ్


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.....

ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.....


అదే సామెత గుర్తొస్తోంది...ప్రస్తుతం ఆంధ్ర పరిస్థితి చూస్తుంటే..ఒక పక్క ఇళ్ళు మునిగిపోయి జీవనం అస్తవ్యస్తమై పోయి జనం బాధ పడుతుంటే...
టీ వీ చానెళ్ళ వాళ్ళు ---అధికారులు స్పందించలేదు..జనం కష్టాలు పడుతున్నారు..దొంగల భయం..అదీ ఇదీ అంటూ కధనాలు...ఇప్పుడు ఏ ప్రాంతం మునుగుతుంది..ఏది తేలుతుంది..కాంగ్రెస్ వాళ్ల వల్లేనా ఇది అంతా అంటూ చర్చా కార్యక్రమాలు. ఒక్కళ్ళైనా...ఎమెర్జెన్సీ నంబర్లు స్క్రోఅలింగు వెయ్యడం కానీ..ఖాళీ చెయ్యాల్సిన ప్రాంతాల వివరాలు చెప్పడం కానీ జరిగిందా? ఎంతసేపూ జరిగే విషయాన్ని భూతద్దం లో చూపించి..అందరికన్నా ముందు మేము అనిపించుకోవడం తప్ప ..ప్రభుత్వాన్నో ఇంకోళ్ళనో విమర్శించడం తప్ప నిజంగా సామాజిక బాధ్యత తో ప్రవర్తించడం వీళ్లకి ఎప్పుడు వస్తుందో..ఎంతసేపూ మాకు డబ్బులు పంపండి..బట్టలు పంపండి అంటూ విడి విడి గా స్క్రోలింగులు ఇచ్చుకోవడం తప్ప..సరిగ్గా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్నేమన్నాయి..దానికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పింది..ఇదే చర్చ..చ చ.
టెక్నాలజీ పెరిగినా ఎందుకు సరిగా వినియోగించుకోలేక పోతున్నామో తెలీదు. ఏమీ లేని ఆ రోజుల్లోనే వరదలో ఇంకో విపత్తో వస్తే, ఆకాశ వాణి ద్వారా...ఎమెర్జెన్సీ సర్వీసుల వివరాలు..సహాయ శిబిరాల వివరాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ఎంతో మందికి సాయ పడ్డారు.
మరి ఈ నాటి మీడియా..?????

అటు రాజకీయాలు చూస్తే..ఇంతటి విపత్తు వచ్చినప్పుడు కూడా..కాంగ్రెస్ గవర్నమెంటు అవినీతి జల యజ్ఞ్మ్ వల్లనే ఈ విపత్తుకు కారణం అంటూ ప్రతిపక్షాలు..ఇది వరకు పాలించిన చంద్రబాబు విధానాల వల్ల నే అంటూ పాలక వర్గం ...కొట్టుకోవడానికే టైం సరిపోవట్లేదు. ఇలాంటి స్మయం లో నైనా కలిసి ప్రజలకు ఏమైనా చేస్తే బాగుంటుంది..కదా. ఇక మన కే సీ ఆర్ గారైతే ఇంకో అడుగు ముందుకేసి..జలయజ్ఞ్మ్ అవినీతి వారం రోజుల్లో బయటపెడతా..లేక పోతే ఉరేసుకు చస్తా అని ప్రకటించారు. సారూ కే సీ ఆరు..జనానికి ఇప్పుడు నిజాలు...అవినీతి గురించిన వివరాలు కాదు కావాల్సింది...తిండి, గుడ్డ ..గూడు...ఆరోగ్యం ...కుదిరితే ఆ విషయం ఆలోచించండి..ఏ ప్రాంతం వాళ్ళైనా ప్రబ్లెం ఒకటే...'వరద '. ముక్కు నేల కి రాస్తావా ? నేనైతే ఉరేసుకుంటా ...అంటూ చాలెంజ్ ఇప్పటికి ఎన్ని విషయాల్లో ఎన్ని సార్లు చేసారో గుర్తు తెచ్చుకోండి..ఎంత మంది తో ముక్కు రాయించారో..ఎన్ని సార్లు ఉరేసుకున్నారో ?



నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

diwali



FUN COUNTER

నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

తుమ్మెద


'తుమ్మెద' అంటే .....అదేదో పూల మీద వాలే 'తుమ్మెద' అనుకునేరు. ఇది జలుబు వల్ల వచ్చిన వైరస్ తో కూడిన తుమ్ము...'తుమ్మెద' అంటే...నాలుగు మైళ్లు పరిగెడుతున్నారు..ప్రజలు.

భారత దేశం లో అస్సలు పారిసుద్ధత ఉండదు...అంతా చెత్త...ఇక్కడ జనాలకు ఆరోగ్య సూత్రాలు తెలీదు అనే విదేసీయుల్ని...కొందరు స్వదేశీయులనీ చూస్తుంటే ఆస్చర్యమేస్తుంది. ఎందుకంటే...ఈ మధ్య వచ్చిన జబ్బులు ఐడ్స్, బర్డ్ ఫ్లూ, ఆంత్రాక్స్, స్వైన్ ఫ్లూ ఇంకా కొన్ని రకాల జబ్బులు..అన్నీ విదేశియులు మనకిచ్చిన కానుకలే..అవి అక్కడ నుంచీ దిగుమతి ఐన మహమ్మారులే.......మనవి కావు అని మనవి చేస్తున్నా.

సుబ్బరంగా వయసు వాచ్చాక పెళ్ళి...ఒకరే పెళ్ళాం,,,,హాయిగా సంసారం...పిల్లలు..ఇదీ మన సంప్రదాయం...కొన్ని రోజులు కలిసుండీ...ఒక్కోసారి ఏళ్ళతరబడి కూడా..నచ్చితే పెళ్ళి...నచ్చకపోతే...చెల్లు..అంటూ వదిలేసే డేటింగు వాళ్ళ విధానం..దేనివల్ల నష్టం....ఐడ్స్ కష్టం..అన్నది జనాలే నిర్ణయించుకోవాలి.

చిన్నప్పటినుంచీ తుమ్మొస్తే..చెయ్యి అడ్డం పెట్టుకోమని మనం పిల్లలకి నేర్పుతాం,..ఇప్పుడూ అదే చెబుతున్నారు...కాకపోతే..చెయ్యి స్థాయి నుంచీ...మాస్కు స్థాయి వరకు వచ్చింది..ఇంకా ఇప్పుడు అవతల వాడు తుమ్ముతుంటే..మనం అడ్డు పెట్టుకోవాల్సి వస్తోంది..దీనికి మందు...మన హోమియోలోనే ఉందిట..ఎప్పుడూ పాస్చాత్యుల్ని చూసి ఇన్ ఫ్లు యెన్స్ అవుతామనఒ ఏంటో దాని పేరు కూడా ఇంఫ్లుయెంజా...ట..అంతే కాదు..తులాసాకు, వేపాకు వేడి నీళ్లలో వేసి వాసన చూసినా తగ్గుతుందట...మరి.

ఈ మధ్య వస్తున్న చాలా జబ్బులు..పేర్లు కూడా కొన్ని తెలీవు..కిడ్నీ లో రాళ్ళు, గాలిబ్లాడర్ లో రాళ్ళు,,.ఊబకాయం వొళ్ళు....ఇంకా చాలా..... కేవలం ఆహార పద్ధతుల వల్లే పెరుగుతున్నాయట. క్యాబేజీ...టమాటా....లాంటివి ఎక్కువేసి చేసిన...సాండు విచ్(ఇసుక దెయ్యం అనొచ్చేమో), చీజ్ వేసిన బర్గర్లు..పిజ్జాలు...లాంటి ఫుడ్డు ఎక్కువయ్యాకనే ...ఇలాంటి జబ్బులూ పెరిగాయి అని చెప్పడానికి సర్వేలు అక్కర్లేదేమో..
లావు తగ్గడానికి ఏమి చెయ్యాలి డాక్టర్ అని పేరొందిన..కార్పొరేట్ హాస్పిటల్ లో ఫారిన్ లో ట్రైన్ అయి ఫ్లైట్ లో వచ్చిన డైటీషన్ ని అడిగితే...ఎల్ డీ ఎల్...వీ డీ ఎల్,,హెచ్ డీ ఎల్...లిపిడ్ ప్రొఫైల్ లాంటి వంద టెస్టులు చేసి..
ఫాట్ ఫూడ్డు తగ్గించండి..ఆయిల్స్ తినకండి...పచ్చి కూర ముక్కలు..కీరా..కారట్ తినండి...మొలకెత్తిన ధాన్యాలు తినండి..రాగి/ఓట్స్, లేక పోతే ఆకుకూరల గంజి తాగండి (ఇంగ్లీసులో సూప్ అంటారు)...రోజూ నడవండి...అంటూ కారులో వచ్చిన వాణ్ణి ఫీజు గుంజి...స్వంత కాళ్ళ మీద నడిపిస్తారు...

సో నే చెప్పొచ్చేదేంటంటే..మన పద్ధతుల్లో మనం ఉంటే.....ఏ ప్రాబ్లెంసూ రావు.
కష్టం లో ఉన్న భూమిని (పంది) వరాహ రూపం లో ఆదుకున్న వేద భూమి మనది...పందుల వల్ల స్వయన్ ఫ్లూ...వ్యాపింపచేసే..విదేశీ అనుకరణలొద్దు మనకి.




నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

'జత' దినోత్సవాలు

ఊరంతా ఒకటే హడావిడి..హైదరాబాద్ లో ఆర్ టీ సీ క్రాస్ రోడ్డులో ఒక ధియేటర్ లో అంతా హడావిడి గా ఉంది. బానర్లు రెప రెపలాడుతున్నాయ్. అభిమానులు గోల గోల గా తిరుగుతున్నారు. పూల దండలు.కొబ్బరికాయలు, పాటల సౌండు..ఒకటేమిటి అంతా రచ్చ రచ్చ.
అన్నిటికీ కారణం ఒక పెద్ద హీరోగారి అబ్బాయి మొదటి సినిమా రెండోరోజుకావడమే.

ఇవన్నీ 'జత ' దినోత్సవ వేడుకల హడావిడి. సినిమా రిలేజు కాకముందే..మా సినిమా 100 రోజులు ఆడేస్తుంది..అని 'హ్రుదయం ' ఇంటిపేరుగా మారిపోయిన నిర్మాత గారు ప్రకటించేసారు. ఆయనకి ఇది వరకు డిస్టిబ్యూటర్ గా అనేక సినిమాల 100 రోజుల షీల్డులు అందుకున్న అనుభవం తో...అలా చెప్పారు. ఇండియాలో.ఫారిన్ లో కలిపి ఎన్నో? (వాళ్ళకి కూడ తెలీదు) ప్రింట్లు రిలీజు చేసి...తిరిగొచ్చిన డబ్బాలు..తిరిగి రాని డబ్బాలు(డబ్బులు అనాలేమో?) లెక్క కట్టి మొత్తం వందరోజులు అనుకోవచ్చో? లేక అన్ని ధియేటర్లూ కలిపి..ఆడిన రోజులులెక్క కట్టాలో మరి.
వెనకటికి ఆత్రేయగారు ఒక సినిమా నాలుగు వారాలు ఆడుతుంది అని చెప్పారట! తీరా చూస్తే ఆ సినిమా నాల్రోజుల్లోనే ఎత్తేసారట. అదేంటండీ అంటే నేను చెప్పింది నిజమే నాయనా,,నీకర్ధం కాలేదు...శుక్ర వారం, శని వారం, ఆదివారం, సోమ వారం మొత్తం నాలుగు వారాలు అంటూ 'ముసి ముసి ' నవ్వులు నవాడట మనసు కవి.

ఇహ ఈ సినిమా విషయానికొస్తే,,,,జత దినోత్సవ ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి ...కారణం ..సదరు హీరోగారి తండ్రిగారు...హీరోయిన్ గారి తల్లిగారూ, హీరో..హీరోయిన్ను. మ్యూజిక్ ఇచ్చినాయన..ఇలా అందరూ వస్తున్నారట. మర్నాడు విజయ యాత్ర కూడా ఉండడం తో..హడావిడి అలా ఉంది.
అందరూ ఎదురు చూస్తున్న టైము రానే వచ్చింది..హీరో అండ్ బాచ్ వచ్చేశారు.నడుస్తున్న సినిమ ఆపేసి..దండయాత్ర కార్యక్రమం అదే దండలు వేసే కార్యక్రాం..అయిపోయాక..హీరో గారి తండ్రి గారు..ఇన్నాళ్ళూ నన్ను భరించారు ఇక మా అబ్బాయిని మీ మీదకి వదులుతున్నా . ఇక మీ ఇష్టం అంటూ చేతులూపాడు. హీరోయిన్ తల్లి..మాట్లాడుతూ...హీరోగారి ఫాదర్ తో నేను ఇంతకు ముందు హీరోయిన్ గా చేసా ఇప్పుడు మా పిల్లలు కలిసి చేస్తుంటే 'ఆ ' రోజులు గుర్తొస్తున్నాయి అంటూ తెగ సిగ్గు పడిపోయింది.

హీరోయిన్ స్టేజి మీద కి వచ్చింది..ఆవిడ ఎటు చూస్తోందో కెమెరా వాళ్ళకి కూడా అర్ధం కాలేదు.ఆమె మొదలెట్టింది. అమ్మా వాడు నిండా పెద్ద హీరోయిన్ ఉంది..అప్పుడు. అంకుల్ నాకు హీరోయిన్ చేసినందుకు హాప్య్..అండ్ తాంక్స్..హీరో చాలా కోపరేటివ్....నేను ఒక కన్ను టాలివుడ్..ఒక కన్ను కోలివుడ్(తమిళ సినిమా) మీద పెట్టా అందుకనే ఇలా కనిపిస్తుంది అని మెల్లగా తన మెల్ల రహస్యాన్ని చెప్పింది
ఇక మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ ,,, when I heard the story , I was inspired and gave music in one day అంటూ హిందీ సినిమా కోసం చేసి హైద్రాబాద్లో తన ఆల్బం మర్చిపోయిన తన పీ యే ని తిట్టుకుంటూ ....చెప్పేసాడు.
ఇక హీరోగారి వంతు...ఈ రోజు కోసమే..ఈ రోజు కోసమే 23 ఏళ్ళు గా ఎదురుచూస్తున్నా..చదువుకుందామనుకున్నా..అబ్బలేదు..స్పోర్ట్స్ మెన్ అవుదామనుకున్నా కష్టపడలేను..బిజినెస్ చేద్దామనుకున్నా చేతకాలేదు...అందుకే ఇక హీరో అవుదామనుకున్నా...అయిపోయా....తాంక్స్ టు తాత,,,,నాన్న...తాంక్స్ టు హృదయం అంకుల్ ....తాంక్స్ తొ మీకందరికి...అంటూ ఇంగ్లీషు..తెలుగు కలిపి అనేసి చెయ్యి చూపించేసి..బయలుదేరాడు.

తనకి సినిమా సినిమాకీ గుండెపోటు వస్తుంది కాబట్టి హృదయం ప్రొడ్యూసర్ అంటారు అనీ...ఆ సినిమా తీసినందుకు కాదని చెబుదామనుకుని...తనకి చాన్స్ రాకపోవడం తో రేపటి విజయ యాత్రకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడానికి బయలుదేరాడు ఆ ప్రొడ్యూసర్.
ఏమో శత దినోత్సవాల రోజులు పోయి ఇలా జత దినోత్సవాలు వస్తాయేమో కూడా
చూశారా మరి.




నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

కెలక్కు

వెన్న ముద్దలు అనే పుస్తకంలో ప్రముఖ రచయిత జనార్ధన మహర్షి అన్నారు..ఇష్టం లేక పోతే ఉలక్కు పలక్కు కానీ కెలక్కు...అని...ప్రస్తుతం కాంగ్రెస్ అధిస్టాన వర్గం అదే చేస్తోంది. ప్రస్తుతం ఆంధ్ర లో రాజకీయ అనిస్చితి చూసి....ఏం చెయ్యాలో తెలీక...ఏదో ఒకటి చేసేయలేక..ఎదురుచూస్తోంది.

సోనియా నే అన్నీ చూసుకుంటారు..సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు అని మిగిలినవాళ్ళు చెబుతున్నా....'ఆ' నిర్ణయం ఏంటో ఇంకా ఆవిడకి కూడా అంతుబట్టటం లేదు. ఇన్నాళ్ళూ అన్ని తానే అయి నడిపించిన రాజసేఖరుడు స్థానాన్ని ఎవరికి ఇవ్వాలో తెలియక తిక మక పడుతున్నారు.

మొన్నేమో జగనే సీ ఎం అన్నవాళ్ళు ఇప్పుడు కొంచెం గేప్ ఇచ్చారు. అటు కే వీ పీ...హైదరాబాదు..డిల్లీ తిరిగి తిరిగి విసిగి ఉన్నారు..ఇన్నాళ్ళూ వెనకుండి నడిపించిన ఆయన ప్రస్తుతం ముందు జరగవలసిన దాని గురించి మల్ల గుల్లాలు పడుతున్నారు.

ఏమిటో ...ప్రస్తుతం రోశయ్య గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా ఉన్నా...అలా ఉండడం ఆయనకూ ఇస్టం ఉండదు...ఐతే మొత్తం అవాలి లేదా ఊరుకోవాలి...





నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

' ప్రజా ' శేఖర్ రెడ్డి= ప్రజా సేవకు రెడీ అనే రాజ శేఖర్ రెడ్డి

ప్రజా సేవకు రెడీ అనే రాజ శేఖర్ రెడ్డి ఇక లేరు...ఇది ఇవ్వాళ ఏ పేపరు చూసినా..న్యూస్ చానెల్ పెట్టినా కనిపించిన హెడ్ లైను.కానీ ఆయన మనందరి మనసుల్లో ఉన్నాడు. ఇంత ఏ ముక్యమంత్రి మరణానికీ పక్క రాష్ట్రాలు కూడా శలవు ప్రకటించలేదు..అంటే ఆయనకున్న మంచి పేరు ఎలాంటిదో అందరికీ అర్ధం అవుతుంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రచ్చబండ కి వెళుతూ.తరలి రాని లోకాలకు వెళ్ళిపోయాడు ఆ మహా మనిషి.

ప్రజా సేవకు రెడీ అనే ఆ రాజ శేఖరుడు...కాలిబాటన రాష్ట్రం నలుమూలలా పర్యటించి..రాజధానికి రాజుగా చేరుకున్నాడు. పల్లెలో వెతలు చూసి ఉచిత కరెంటు ఇచ్చాడు, పల్లె బాటలో జనాన్ని చూసి రెండు రూపాయలకు బియ్యం ఇచ్చాడు. డాక్టరు కావడం వల్ల..తన ఆరాధ్యమైన రాజీవ్ పేరిట ఆరోగ్య శ్రీని అందించాడు...ఇందిరమ్మ ఇళ్ళు కట్టించి...కష్టించే వాళ్ళకూ గూడు అందించాడు. కూడు.గూడు..ఆరోగ్యం ....అందించాడు..ప్రాజెక్టులు కట్టి..పూర్తి చేసాడు...తలచిన పని చేసుకు పోవడమే కానీ వెను తిరిగి చూడని ధీశాలి.

ఇంకా ఎన్నో చేయాలనుకున్నా....మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఆ పనులు ఇంక ఎవరు చేస్తారో వేచి చూడాలి. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని ఆశిస్తూ






నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మీ మైలు...నా ఫైలు

Enter your email address:

Delivered by FeedBurner

Add-Telugu



Add This

Share/Save/Bookmark

Naa Gurinchi

My Photo
Fun Counter
Hyderabad, Andhra Pradesh, India
Telugu Mitrulakosam Telugu Satire.
View my complete profile

Indie Blogger Rank

పాత బంగారం ఇక్కడ దాచా

Followers

funcounter

link to michigan website design
powered by web design guide.

Neo Count

అంతర్జాల వాణి

అంతర్జాల వాణి

Alexalent

Globe counter

ప్రత్యక్ష్య ప్రేక్షకులు

FUNCOUNTER.COM


FUNCOUNTER.COM - ఫన్ కౌంటర్ © 2008

Alexa Status

Snap Shots

Get Free Shots from Snap.com

Kontera

Technorati

Add to Technorati Favorites

Google Darshini

Site meter

Google Analytics

Info links

Ad Brite